Movie News

IPL దెబ్బకు ఇంతకన్నా సాక్ష్యం కావాలా

థియేటర్లకు జనాలు రాక పరిస్థితి ఏ మాత్రం బాలేదు. రేపు విడుదల కాబోతున్న అయిదు కొత్త సినిమాలతో బాక్సాఫీస్ కు కొత్త ఊపు రావాలని బయ్యర్లు మొక్కుకుంటున్నారు. ఒకపక్క మండిపోయే ఎండలు కారణంగా కనిపిస్తున్నా మెప్పించే కంటెంట్ లేనివి రావడం వల్లే వసూళ్లు లేవనే కామెంట్ ని ఎంత మాత్రం కొట్టిపారేయలేం. వీటికి తోడు ఐపీఎల్ దెబ్బ ఈసారి మాములుగా లేదు. ముఖ్యంగా రేసులో ఎక్కువ వెనుకబడి ఉండే హైదరాబాద్ సన్ రైజర్స్ టీమ్ సూపర్ ఫామ్ తెలుగు రాష్ట్రాల అభిమానులను సంతోషంలో ముంచెత్తుతోంది. ఇతర మ్యాచులను కూడా ఎగబడి చూస్తున్నారు.

ఈ టోర్నమెంట్ ప్రభావం ఏ స్థాయిలో ఉందంటే నిన్న కృష్ణమ్మ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చిన దర్శకుడు అనిల్ రావిపూడి ఐపీఎల్ చూడకపోతే కొంపలేం మునిగిపోవు, హాళ్లలోనే ఫోన్ ద్వారా లైవ్ స్కోర్స్ చూసుకోవచ్చు, దయచేసి థియేటర్లకు రమ్మని ఓపెన్ గా అడిగేశాడు. దీని గురించి సోషల్ మీడియాలో రకరకాల స్పందనలు రావడం సహజమే కానీ సినిమా బాగుంటే ఎలాంటి ప్రతికూలతలు ఆడియన్స్ రాకుండా ఆపలేవని టిల్లు స్క్వేర్ లాంటివి నిరూపించాయి. కానీ ఏప్రిల్ మొత్తంలో ఒక్కటంటే ఒక్కటి స్ట్రెయిట్ మూవీ మెప్పించేలా లేకపోవడం ఎగ్జిబిటర్ల పాలిట శరాఘాతంగా మారింది.

ఇకపై ప్రతి సంవత్సరం ఐపీఎల్, సమ్మర్ రెండింటిని చూసుకుని మరీ రిలీజులు ప్లాన్ చేయాల్సి వచ్చేలా ఉంది. అనిల్ రావిపూడి అన్నదాంట్లో లాజిక్ ఉంది కానీ ఐపీఎల్, సినిమా రెండూ వినోదం అందించేవే. క్రికెట్ లైవ్ మిస్ అయితే మళ్ళీ చూడబుద్ది కాదు. కానీ సినిమా అలా కాదు. ఏ షోకు వెళ్లినా అనుభూతిలో మార్పు ఉండదుగా అనేది కొందరి వాదన. నిజానికి అనిల్ ఉద్దేశం అది కాదు. ఎండలకు మార్నింగ్, మ్యాట్నీలకు ఎలాగూ రారు కాబట్టి సాయంత్రం, సెకండ్ షోలకు వస్తే బాగుంటుందని. అయినా ఒక మేకర్ గా ఆయన ఆలోచించింత లోతుగా ప్రేక్షకులు ఆలోచిస్తారా. 

Satya

Recent Posts

ఏడాది తర్వాత… అటు జగన్, ఇటు కేటీఆర్ !

మరో ఏడాది తర్వాత తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పాదయాత్రల సందడి మొదలుకానుంది. ఎన్నికలకు ముందు ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రధాన పార్టీలు…

33 minutes ago

డిజిటల్ పాఠం నేర్పిస్తున్న పెద్ది ఫలితం

థియేటర్ రన్ పూర్తి చేసుకున్న పెద్ది ఇటీవలే ఓటిటిలో వచ్చిన సంగతి తెలిసిందే. అయితే నార్త్ ఆడియన్స్ తో పాటు…

1 hour ago

పోక్సో కేసు నిందితుడికి బెయిలు రానివ్వకూడదు: రేవంత్ తో పవన్

తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డికి.. ఏపీ ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్ లేఖ రాశారు. ``షాబాద్ ఘ‌ట‌న దారుణం`` అని…

1 hour ago

ప్రజాధనం అంటే పవన్ ఒప్పుకోరు

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఉదార స్వభావం, దాతృత్వం గురించి జనసైనికులు, ఆయన అభిమానులు గొప్పగా…

1 hour ago

ముద్ర‌గ‌డ పాడె మోసిన జ‌గ‌న్‌

కాపు ఉద్య‌మ నాయ‌కుడు, మాజీ మంత్రి ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం అంత్య‌క్రియ‌లు ముగిశాయి. తూర్పుగోదావ‌రి జిల్లా కిర్లంపూడిలోని ఆయ‌న ఇంటి ప్రాంగ‌ణంలోనే…

2 hours ago

బాబు సర్కారును పొగిడిన కేటీఆర్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నీటిపారుదల విధానాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. ఎల్‌నినో పరిస్థితుల్లోనూ నీటి సమస్య…

2 hours ago