Movie News

నాని కోసం.. ఆ దర్శకుడి క్రేజీ ప్లాన్

న్యాచురల్ స్టార్ నాని డిమాండ్ మాములుగా లేదు. ఊర మాస్ దసరా చేసినా, ఎమోషనల్ హాయ్ నాన్నగా వచ్చినా హిట్టుకు తగ్గకుండా బాక్సాఫీసు ఫలితం అందుకుంటూనే ఉన్నాడు. నిర్మాణంలో ఉన్న సరిపోదా శనివారం మీద ఇప్పటికే కావాల్సినంత హైప్ వచ్చేసింది. పవన్ కళ్యాణ్ ఓజి చేస్తున్న సుజిత్, బలగంతో బలంగా ఋజువు చేసుకున్న వేణు ఊడుగుల, డెబ్యూతోనే బ్లాక్ బస్టర్ అందుకున్న శ్రీకాంత్ ఓదెలకు నాని ఆల్రెడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇంత టైట్ షెడ్యూల్ లోనూ ఒక తమిళ దర్శకుడు నానినే కావాలని వెంటపడుతున్నట్టు తెలిసింది. అదేంటో చూద్దాం.

జై భీమ్ తో ఆస్కార్ రేంజ్ లో ప్రశంసలు దక్కించుకున్న టీజె జ్ఞానవేల్ ప్రస్తుతం రజనీకాంత్ తో వెట్టయన్ చేస్తున్న సంగతి తెలిసిందే. దీంట్లో ఒక ముఖ్యమైన పాత్ర కోసం షూటింగ్ కు ముందు నానినే అడిగాడు. కానీ తనకు నప్పదని భావించి సున్నితంగా నో చెప్పడంతో అది కాస్తా రానా చేతికి వెళ్ళింది. అయినా సరే నానికి సరిపడా ఒక మంచి సబ్జెక్టు తన వద్ద ఉండటంతో జ్ఞానవేల్ రజని మూవీ తర్వాత ఇదే చేసే ప్రయత్నంలో ఉన్నాడట. ఇతని పట్టుదల గమనించిన నాని స్టోరీ చాలా నచ్చి ఖచ్చితంగా చేద్దామని చెప్పడంతో అక్టోబర్ తర్వాత దీనికి అడుగులు పడే అవకాశం లేకపోలేదు.

గతంలో శివ కార్తికేయన్ డాన్ తీసిన సిబి చక్రవర్తి నానితో ఒక సబ్జెక్టు ఓకే చేయించుకుని హైదరాబాద్ లో ఆఫీస్ తీసిచ్చాక ఫైనల్ వెర్షన్ తో మెప్పించలేకపోయాడు. కానీ జ్ఞానవేల్ తో ఆ సమస్య రాదు. జై భీమ్ లో సున్నితమైన సమస్యని అద్భుతంగా ప్రెజెంట్ చేసిన విధానం ఏకంగా సూపర్ స్టార్ పిలుపు వచ్చేలా చేసింది. అలాంటిది నాని ఓకే చెప్పకపోవడం అనే సమస్యే ఉండదు. కాకపోతే కన్ఫర్మ్ గా తేలడానికి ఇంకొంచెం టైం పడుతుంది. ఆగస్ట్ చివరి వారంలో విడుదల కాబోతున్న సరిపోదా శనివారం మీద నాని నమ్మకం మాములుగా లేదు. స్పీడ్ తగ్గించి మరీ ఎక్కువ డేట్లు ఇచ్చాడు. 

This post was last modified on May 1, 2024 7:34 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

34 minutes ago

‘నీట్’ గా పేపర్ అమ్మేశారట!

నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…

37 minutes ago

భగీరథ్ కేసు వాదించేది వైసీపీ ఎంపీనే

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…

2 hours ago

కేరళం ‘సీల్డ్ కవర్’ తెరచుకునేదెన్నడో..?

దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…

2 hours ago

ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్న మోదీ వ్యాఖ్యలు

యావత్తు ప్రపంచాన్ని కరోనా చుట్టుముట్టిన తరుణంలో లాక్ డౌన్ అంటే ఏమిటో… ఎలా ఉంటుందో చూశాం. ఇప్పుడు కరోనా లాంటి…

5 hours ago

ఒక్క ఓటుతో గెలిస్తే ఓటేయొద్దా…?

తమిళ రాజకీయాల్లో వరుసబెట్టి ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తమిళనాడు అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడిన దగ్గర నుంచి రోజుకో…

6 hours ago