న్యాచురల్ స్టార్ నాని డిమాండ్ మాములుగా లేదు. ఊర మాస్ దసరా చేసినా, ఎమోషనల్ హాయ్ నాన్నగా వచ్చినా హిట్టుకు తగ్గకుండా బాక్సాఫీసు ఫలితం అందుకుంటూనే ఉన్నాడు. నిర్మాణంలో ఉన్న సరిపోదా శనివారం మీద ఇప్పటికే కావాల్సినంత హైప్ వచ్చేసింది. పవన్ కళ్యాణ్ ఓజి చేస్తున్న సుజిత్, బలగంతో బలంగా ఋజువు చేసుకున్న వేణు ఊడుగుల, డెబ్యూతోనే బ్లాక్ బస్టర్ అందుకున్న శ్రీకాంత్ ఓదెలకు నాని ఆల్రెడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇంత టైట్ షెడ్యూల్ లోనూ ఒక తమిళ దర్శకుడు నానినే కావాలని వెంటపడుతున్నట్టు తెలిసింది. అదేంటో చూద్దాం.
జై భీమ్ తో ఆస్కార్ రేంజ్ లో ప్రశంసలు దక్కించుకున్న టీజె జ్ఞానవేల్ ప్రస్తుతం రజనీకాంత్ తో వెట్టయన్ చేస్తున్న సంగతి తెలిసిందే. దీంట్లో ఒక ముఖ్యమైన పాత్ర కోసం షూటింగ్ కు ముందు నానినే అడిగాడు. కానీ తనకు నప్పదని భావించి సున్నితంగా నో చెప్పడంతో అది కాస్తా రానా చేతికి వెళ్ళింది. అయినా సరే నానికి సరిపడా ఒక మంచి సబ్జెక్టు తన వద్ద ఉండటంతో జ్ఞానవేల్ రజని మూవీ తర్వాత ఇదే చేసే ప్రయత్నంలో ఉన్నాడట. ఇతని పట్టుదల గమనించిన నాని స్టోరీ చాలా నచ్చి ఖచ్చితంగా చేద్దామని చెప్పడంతో అక్టోబర్ తర్వాత దీనికి అడుగులు పడే అవకాశం లేకపోలేదు.
గతంలో శివ కార్తికేయన్ డాన్ తీసిన సిబి చక్రవర్తి నానితో ఒక సబ్జెక్టు ఓకే చేయించుకుని హైదరాబాద్ లో ఆఫీస్ తీసిచ్చాక ఫైనల్ వెర్షన్ తో మెప్పించలేకపోయాడు. కానీ జ్ఞానవేల్ తో ఆ సమస్య రాదు. జై భీమ్ లో సున్నితమైన సమస్యని అద్భుతంగా ప్రెజెంట్ చేసిన విధానం ఏకంగా సూపర్ స్టార్ పిలుపు వచ్చేలా చేసింది. అలాంటిది నాని ఓకే చెప్పకపోవడం అనే సమస్యే ఉండదు. కాకపోతే కన్ఫర్మ్ గా తేలడానికి ఇంకొంచెం టైం పడుతుంది. ఆగస్ట్ చివరి వారంలో విడుదల కాబోతున్న సరిపోదా శనివారం మీద నాని నమ్మకం మాములుగా లేదు. స్పీడ్ తగ్గించి మరీ ఎక్కువ డేట్లు ఇచ్చాడు.
This post was last modified on May 1, 2024 7:34 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…