తెలుగువాడైన విశాల్ తమిళంలో పెద్ద మాస్ హీరోగా ఎదిగాడు. ‘చెల్లమే’ అనే సాఫ్ట్ మూవీతో అతను హీరోగా పరిచయం అయినప్పటికీ.. ఆ తర్వాత ‘సెండై కోళి’ (తెలుగులో పందెం కోడి) అనే మాస్ మూవీ చేసి యాక్షన్ హీరో ఇమేజ్ సంపాదించుకున్నాడు. అప్పట్నుంచి అతడిది మాస్ బాటే.
ఎక్కువగా యాక్షన్ ప్రధానంగా సాగే సినిమాలే చేసి హీరోగా ఎదిగాడు. ఐతే ఎప్పుడూ రొటీన్ మాస్ మసాలా సినిమాలే చేస్తే ఏ హీరో కెరీర్ కూడా నడవదు. అందుకే విశాల్ మధ్యలో రూటు మార్చాడు. ఇరుంబు తిరై (అభిమన్యుడు), తుప్పరివాలన్ (డిటెక్టివ్) లాంటి వైవిధ్యమైన చిత్రాలతో అతను మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. వాటిలో కూడా యాక్షన్ ఉంటుంది కానీ.. దానికి తోడు మంచి కథా ఉంటుంది. కొత్తగా అనిపిస్తాయి. ఒక టైంలో ఇలా భిన్నమైన దారిలో ప్రయాణం చేశాడు విశాల్.
కానీ కొన్నేళ్ల నుంచి విశాల్ మళ్లీ రొడ్డకొట్టుడు సినిమాలతో ప్రేక్షకులను విసుగెత్తిస్తున్నాడు. సామాన్యుడు, లాఠీ లాంటి సినిమాలు చూసి ప్రేక్షకులకు తల బొప్పి కట్టింది. ఆ సినిమాలో ఫైట్లు తప్ప ఏమీ ఉండవు. రొటీన్ కథలతో తన కటౌట్కు తగ్గ మాస్ ఫైట్లు పెట్టి లాగించేశాడు. కథలో కొంచెమైనా కొత్తదనం లేకుండా.. కేవలం ఫైట్లే చేస్తుంటే చూసేదెవరు? ఇప్పుడు విశాల్ నుంచి వచ్చిన ‘రత్నం’ అయితే మరీ దారుణం.
సినిమా అంతా ఫైట్లు తప్ప ఏమీ లేదు. ఒక ల్యాండ్ సెటిల్మెంట్ చుట్టూ తిరిగే చిన్న పాయింట్ను రెండున్నర గంటల సినిమాగా సాగదీసిన హరి.. ప్రేక్షకులను విసుగెత్తించేశాడు. సినిమా అంతా హీరోయిన్ మీద రౌడీలు ఎటాక్ చేయడం.. హీరో కాపాడ్డం.. ఇదే కథ. లొకేషన్లు మారుతుంటాయి కానీ.. ఒకటే కాన్సెప్ట్ మీద హీరో ఫైట్లు చేసుకుంటూ గడిపేస్తాడు. విశాల్ అర్జెంటుగా రూటు మార్చి భిన్నమైన కథలు ట్రై చేయకుంటే అతడి కెరీర్ పుంజుకోవడం చాలా కష్టం.
This post was last modified on April 27, 2024 8:14 am
జగన్ ఇటీవల కాలంలో సహనం కోల్పోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తన పార్టీ వారిపై కేసులు పెట్టినా.. తమ…
అంజి ఇప్పుడు గుర్తు రావడం ఏమిటనుకుంటున్నారా.. విషయం ఉంది. కొన్ని వింటే సిల్లీగా తోస్తాయి కానీ కొంచెం లోతుగా ఆలోచిస్తే…
బుట్టబొమ్మ గా అల వైకుంఠపురములో నుంచి టాలీవుడ్ పాపులారిటీ సంపాదించుకున్న పూజా హెగ్డే చాలా కాలంగా ఫ్లాపుల్లో ఉంది. ఏ…
ఒక గంట నిలబడేందుకే ఇబ్బంది పడతాం. అలాంటిది ఏకంగా ఏడున్నరగంటల పాటు ఏకబిగిన నిలబడడం అంటే మాటలా? ఊహించేందుకే కష్టమైన…
కనకవర్షం కురిపించుకోవడమంటే బాక్సాఫీస్ దగ్గర అదో పెద్ద యుద్ధం అన్నట్టు పరిస్థితి మారిపోయింది. ఏది ఎలా ఎప్పుడు ఆడుతుందో ఎవరూ…
వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు నోటి దురుసు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రమ్మను…ఆ…ని..చూసుకుందాం..అంటూ ముఖ్యమంత్రి…