కొందరి సినీ తారల జీవితాల్లో తెరమీద చూపించినట్టు ఒకరితోనే జీవితం పంచుకోవడం ఉండదు. ముందు ప్రేమించడం, కొంత కాలం సహజీవనం లేదా పెళ్లి చేసుకోవడం ఆ తర్వాత బ్రేకప్ సర్వసాధారణ విషయాలు. తాజాగా శృతి హాసన్ ఈ విషయంలోనే సర్వత్రా హైలైట్ అవుతోంది. నాలుగు పదుల వయసుకు అతి దగ్గరగా ఉన్నా అవకాశాలు, హిట్లు రెండూ కొదవ లేకుండా చేసుకుంటున్న లోక నాయకుడి తనయ తాజాగా తన బాయ్ ఫ్రెండ్ శంతను హజారికాకు గుడ్ బై చెప్పినట్టు వచ్చిన వార్త టాపిక్ గా మారింది. ఇన్స్ టాలో పరస్పరం అన్ ఫాలో కొట్టేసుకోవడమే దానికి సూచికని చెబుతున్నారు.
మూడు నాలుగు సంవత్సరాల నుంచి వీళ్ళ బంధం కొనసాగుతోంది. కలిసి తిరిగిన ఫోటోలు, వీడియోలు తమ సోషల్ మీడియా అకౌంట్లలో షేర్ చేసుకోవడం అన్నీ జరిగాయి. ఇతనికన్నా ముందు ఇటాలియన్ నటుడు మైకేల్ కొర్సాలేతో రిలేషన్ షిప్ నడిపించిన శృతి అతన్ని ఏకంగా కొన్ని ఫంక్షన్లకు తీసుకెళ్లి మరీ పరిచయం చేయడం వైరలయ్యింది. కెరీర్ ప్రారంభం నుంచి చూసుకుంటే సిద్దార్థ్, ధనుష్, చైతు, సురేష్ రైనా ఇలా ఏవేవో పేర్లు శృతి ప్రేమకథల గురించి మీడియాలో వచ్చేవి. ఏది నిజం ఏది అబద్దం అనేది తనకే తెలుసు కానీ చూస్తుంటే ఇప్పట్లో సెటిలయ్యే ఉద్దేశం లేదేమో.
తండ్రి కమల్ హాసన్ బాటే ఫాలో అవుతున్నట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం శృతి ప్రభాస్ సలార్ పార్ట్ 2 శౌర్యంగపర్వంతో పాటు అడవి శేష్ డెకాయిట్ లో నటిస్తోంది. రెండూ ప్యాన్ ఇండియా సినిమాలే. రెగ్యులర్ హీరోయిన్ పాత్రలు కాకుండా పెర్ఫార్మన్స్ స్కోప్ ఉన్నవి బాగానే వస్తున్నాయి. గత ఏడాది వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య రూపంలో రెండు బ్లాక్ బస్టర్లు ఖాతాలో వేసుకున్న శృతి హాసన్ కు ఛాన్సులకైతే లోటు లేదు. చెన్నై స్టోరీ అనే హాలీవుడ్ మూవీలోనూ ఆఫర్ పట్టేసింది. ముందు సమంతాతో అనుకుని ఆ తర్వాత అనూహ్యంగా అది శృతి చేతికి వచ్చింది. అటు వెబ్ సిరీస్ ఆఫర్లు కూడా ఉన్నాయి.
యూపీలోని మహారాజ్గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…
రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…
తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…
టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…
ఏపీ సీఎం చంద్రబాబు కలల ప్రాజెక్టు.. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం `ప్రత్యేక`…