రామ్ గోపాల్ వర్మ మరో సంచలనానికి సిద్ధమవుతున్నాడు. తన మీద బయోపిక్ తీయడానికి తనే రంగం సిద్ధం చేశాడు. అందులో ఆయనే నటించబోతున్నాడు కూడా. మూడు భాగాలుగా ఈ చిత్రం తెరకెక్కనుంది. వర్మ కాలేజీ రోజుల నుంచి ఈ కథ మొదలవుతుంది. మొదటి భాగమంతా వర్మ సినిమాల్లోకి రావడానికి ముందు రోజుల నేపథ్యంలో నడుస్తుంది. బుధవారమే ఈ సినిమా ప్రారంభోత్సవం కూడా జరిగింది.
ఈ కార్యక్రమానికి వర్మ తల్లి సూర్యవతి, సోదరి విజయ హాజరు కావడం విశేషం. సూర్యవతి కెమెరా స్విచాన్ చేస్తే.. విజయ క్లాప్ ఇచ్చారు. విశేషం ఏంటంటే.. ఈ సినిమాకు 20 ఏళ్ల వయసున్న దొరసాయి తేజ అనే కుర్రాడు దర్శకత్వం వహిస్తున్నాడు. ఫస్ట్ పార్ట్లో యంగ్ ఆర్జీవీగా నటించబోయేది కూడా అతనే కావడం విశేషం. ఈ విషయాన్ని వర్మే స్వయంగా ట్విట్టర్లో వెల్లడించాడు.
బొమ్మకు మురళి నిర్మాణంలో ‘రాము’ పేరుతో తెరకెక్కనున్న ఈ చిత్రంలో తొలి భాగాన్ని పూర్తిగా వర్మ పుట్టి పెరిగిన విజయవాడలోనే తెరకెక్కించనున్నారు. వర్మ సినీ ప్రయాణం అద్భుతంగా సాగిన రోజుల నేపథ్యంలో రెండో భాగం నడుస్తుంది. అందులో వర్మ పాత్రను వేరే నటుడు చేస్తాడట. ఆ తర్వాత వర్తమాన నేపథ్యంలో సాగే మూడో భాగంలో వర్మ పాత్రను వర్మే పోషించనున్నాడు.
బహుశా అందులో వర్మ పతనాన్ని చూపిస్తారేమో. ఇలా ఒక ప్రముఖుడి బయోపిక్లో ఆ వ్యక్తే నటించడం అరుదైన విషయమే. మరి గత దశాబ్ద కాలంలో ఫిలిం మేకర్గా, వ్యక్తిగా బాగా దిగజారిపోయిన వర్మ.. ఉన్నదున్నట్లుగా సినిమాలో చూపించడానికి ఒప్పుకుంటాడా అన్నది ఆసక్తికరం. ఎన్నో ఆసక్తికర మలుపులతో ముడిపడ్డ వర్మ జీవితాన్ని సరిగ్గా చూపిస్తే ప్రేక్షకుల్లో ఆసక్తి ఉంటుంది. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.
This post was last modified on September 16, 2020 3:31 pm
ఏపీలో తలెత్తిన ఎన్నికల గుర్తు రగడ మరో మలుపు తిరిగింది. జనసేనకు కేటాయించిన ఎన్నికల గుర్తు గాజు గ్లాసును స్వతంత్ర…
టాలీవుడ్ దర్శకుల్లో క్రిష్ జాగర్లమూడిది డిఫరెంట్ స్టైల్. ‘గమ్యం’ లాంటి సెన్సేషనల్ మూవీతో మొదలుపెట్టి ఆయన వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ…
ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో మోస్ట్ వాంటెడ్ లేడీ ఆర్టిస్టుల్లో వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరు. ఆమె ఓవైపు లీడ్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లోనే అత్యధిక బడ్జెట్లో, భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ‘హరిహర వీరమల్లు’ సినిమా గురించి జనాలు…
థియేటర్లకు జనాలు రాక పరిస్థితి ఏ మాత్రం బాలేదు. రేపు విడుదల కాబోతున్న అయిదు కొత్త సినిమాలతో బాక్సాఫీస్ కు…
పచ్చగా సాగుతున్న వైసీపీ కాపురంలో కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం చిచ్చుపెడుతున్నాడా ? పార్టీకి ఆయన వ్యాఖ్యలు బలం చేకూర్చకపోగా చేటు చేస్తున్నాయా…