రామ్ గోపాల్ వర్మ మరో సంచలనానికి సిద్ధమవుతున్నాడు. తన మీద బయోపిక్ తీయడానికి తనే రంగం సిద్ధం చేశాడు. అందులో ఆయనే నటించబోతున్నాడు కూడా. మూడు భాగాలుగా ఈ చిత్రం తెరకెక్కనుంది. వర్మ కాలేజీ రోజుల నుంచి ఈ కథ మొదలవుతుంది. మొదటి భాగమంతా వర్మ సినిమాల్లోకి రావడానికి ముందు రోజుల నేపథ్యంలో నడుస్తుంది. బుధవారమే ఈ సినిమా ప్రారంభోత్సవం కూడా జరిగింది.
ఈ కార్యక్రమానికి వర్మ తల్లి సూర్యవతి, సోదరి విజయ హాజరు కావడం విశేషం. సూర్యవతి కెమెరా స్విచాన్ చేస్తే.. విజయ క్లాప్ ఇచ్చారు. విశేషం ఏంటంటే.. ఈ సినిమాకు 20 ఏళ్ల వయసున్న దొరసాయి తేజ అనే కుర్రాడు దర్శకత్వం వహిస్తున్నాడు. ఫస్ట్ పార్ట్లో యంగ్ ఆర్జీవీగా నటించబోయేది కూడా అతనే కావడం విశేషం. ఈ విషయాన్ని వర్మే స్వయంగా ట్విట్టర్లో వెల్లడించాడు.
బొమ్మకు మురళి నిర్మాణంలో ‘రాము’ పేరుతో తెరకెక్కనున్న ఈ చిత్రంలో తొలి భాగాన్ని పూర్తిగా వర్మ పుట్టి పెరిగిన విజయవాడలోనే తెరకెక్కించనున్నారు. వర్మ సినీ ప్రయాణం అద్భుతంగా సాగిన రోజుల నేపథ్యంలో రెండో భాగం నడుస్తుంది. అందులో వర్మ పాత్రను వేరే నటుడు చేస్తాడట. ఆ తర్వాత వర్తమాన నేపథ్యంలో సాగే మూడో భాగంలో వర్మ పాత్రను వర్మే పోషించనున్నాడు.
బహుశా అందులో వర్మ పతనాన్ని చూపిస్తారేమో. ఇలా ఒక ప్రముఖుడి బయోపిక్లో ఆ వ్యక్తే నటించడం అరుదైన విషయమే. మరి గత దశాబ్ద కాలంలో ఫిలిం మేకర్గా, వ్యక్తిగా బాగా దిగజారిపోయిన వర్మ.. ఉన్నదున్నట్లుగా సినిమాలో చూపించడానికి ఒప్పుకుంటాడా అన్నది ఆసక్తికరం. ఎన్నో ఆసక్తికర మలుపులతో ముడిపడ్డ వర్మ జీవితాన్ని సరిగ్గా చూపిస్తే ప్రేక్షకుల్లో ఆసక్తి ఉంటుంది. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.
This post was last modified on September 16, 2020 3:31 pm
ఒకప్పటి డిజాస్టర్లు ఇప్పుడు రీ రిలీజ్ ట్రెండ్ లో బాగా ఆడటం గమనిస్తున్నాం. ఆరెంజ్ మూడుసార్లు వచ్చినా కలెక్షన్లు కుమ్మరించింది.…
టాలీవుడ్లో ఘన చరిత్ర ఉన్న బేనర్లో లక్ష్మీప్రసన్న పిక్చర్స్ ఒకటి. ఈ బేనర్ మీద పదుల సంఖ్యలో సినిమాలు తీశారు…
‘యమదొంగ’ చిత్రంతో టాలీవుడ్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది మలయాళ భామ మమతా మోహన్ దాస్. ఆ చిత్రంలో చలాకీ పాత్ర…
ఇరు తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నాయకుల్లో చాలామంది పెద్దగా భావోద్వేగాలకు లోను కారు. మిన్ను విరిగి మీద పడ్డా…ఎన్నికల…
మన శంకరవరప్రసాద్ గారు రూపంలో చిరంజీవికి బ్లాక్ బస్టర్ కానుక ఇచ్చి రెమ్యునరేషన్ తో పాటు రేంజ్ రోవర్ కారు…
24 ఏళ్ల కిందట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే కాక దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయిన నటి ప్రత్యూష మృతి వ్యవహారంలో సుప్రీం కోర్టు…