రామ్ గోపాల్ వర్మ మరో సంచలనానికి సిద్ధమవుతున్నాడు. తన మీద బయోపిక్ తీయడానికి తనే రంగం సిద్ధం చేశాడు. అందులో ఆయనే నటించబోతున్నాడు కూడా. మూడు భాగాలుగా ఈ చిత్రం తెరకెక్కనుంది. వర్మ కాలేజీ రోజుల నుంచి ఈ కథ మొదలవుతుంది. మొదటి భాగమంతా వర్మ సినిమాల్లోకి రావడానికి ముందు రోజుల నేపథ్యంలో నడుస్తుంది. బుధవారమే ఈ సినిమా ప్రారంభోత్సవం కూడా జరిగింది.
ఈ కార్యక్రమానికి వర్మ తల్లి సూర్యవతి, సోదరి విజయ హాజరు కావడం విశేషం. సూర్యవతి కెమెరా స్విచాన్ చేస్తే.. విజయ క్లాప్ ఇచ్చారు. విశేషం ఏంటంటే.. ఈ సినిమాకు 20 ఏళ్ల వయసున్న దొరసాయి తేజ అనే కుర్రాడు దర్శకత్వం వహిస్తున్నాడు. ఫస్ట్ పార్ట్లో యంగ్ ఆర్జీవీగా నటించబోయేది కూడా అతనే కావడం విశేషం. ఈ విషయాన్ని వర్మే స్వయంగా ట్విట్టర్లో వెల్లడించాడు.
బొమ్మకు మురళి నిర్మాణంలో ‘రాము’ పేరుతో తెరకెక్కనున్న ఈ చిత్రంలో తొలి భాగాన్ని పూర్తిగా వర్మ పుట్టి పెరిగిన విజయవాడలోనే తెరకెక్కించనున్నారు. వర్మ సినీ ప్రయాణం అద్భుతంగా సాగిన రోజుల నేపథ్యంలో రెండో భాగం నడుస్తుంది. అందులో వర్మ పాత్రను వేరే నటుడు చేస్తాడట. ఆ తర్వాత వర్తమాన నేపథ్యంలో సాగే మూడో భాగంలో వర్మ పాత్రను వర్మే పోషించనున్నాడు.
బహుశా అందులో వర్మ పతనాన్ని చూపిస్తారేమో. ఇలా ఒక ప్రముఖుడి బయోపిక్లో ఆ వ్యక్తే నటించడం అరుదైన విషయమే. మరి గత దశాబ్ద కాలంలో ఫిలిం మేకర్గా, వ్యక్తిగా బాగా దిగజారిపోయిన వర్మ.. ఉన్నదున్నట్లుగా సినిమాలో చూపించడానికి ఒప్పుకుంటాడా అన్నది ఆసక్తికరం. ఎన్నో ఆసక్తికర మలుపులతో ముడిపడ్డ వర్మ జీవితాన్ని సరిగ్గా చూపిస్తే ప్రేక్షకుల్లో ఆసక్తి ఉంటుంది. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.
This post was last modified on September 16, 2020 3:31 pm
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…