రామ్ గోపాల్ వర్మ మరో సంచలనానికి సిద్ధమవుతున్నాడు. తన మీద బయోపిక్ తీయడానికి తనే రంగం సిద్ధం చేశాడు. అందులో ఆయనే నటించబోతున్నాడు కూడా. మూడు భాగాలుగా ఈ చిత్రం తెరకెక్కనుంది. వర్మ కాలేజీ రోజుల నుంచి ఈ కథ మొదలవుతుంది. మొదటి భాగమంతా వర్మ సినిమాల్లోకి రావడానికి ముందు రోజుల నేపథ్యంలో నడుస్తుంది. బుధవారమే ఈ సినిమా ప్రారంభోత్సవం కూడా జరిగింది.
ఈ కార్యక్రమానికి వర్మ తల్లి సూర్యవతి, సోదరి విజయ హాజరు కావడం విశేషం. సూర్యవతి కెమెరా స్విచాన్ చేస్తే.. విజయ క్లాప్ ఇచ్చారు. విశేషం ఏంటంటే.. ఈ సినిమాకు 20 ఏళ్ల వయసున్న దొరసాయి తేజ అనే కుర్రాడు దర్శకత్వం వహిస్తున్నాడు. ఫస్ట్ పార్ట్లో యంగ్ ఆర్జీవీగా నటించబోయేది కూడా అతనే కావడం విశేషం. ఈ విషయాన్ని వర్మే స్వయంగా ట్విట్టర్లో వెల్లడించాడు.
బొమ్మకు మురళి నిర్మాణంలో ‘రాము’ పేరుతో తెరకెక్కనున్న ఈ చిత్రంలో తొలి భాగాన్ని పూర్తిగా వర్మ పుట్టి పెరిగిన విజయవాడలోనే తెరకెక్కించనున్నారు. వర్మ సినీ ప్రయాణం అద్భుతంగా సాగిన రోజుల నేపథ్యంలో రెండో భాగం నడుస్తుంది. అందులో వర్మ పాత్రను వేరే నటుడు చేస్తాడట. ఆ తర్వాత వర్తమాన నేపథ్యంలో సాగే మూడో భాగంలో వర్మ పాత్రను వర్మే పోషించనున్నాడు.
బహుశా అందులో వర్మ పతనాన్ని చూపిస్తారేమో. ఇలా ఒక ప్రముఖుడి బయోపిక్లో ఆ వ్యక్తే నటించడం అరుదైన విషయమే. మరి గత దశాబ్ద కాలంలో ఫిలిం మేకర్గా, వ్యక్తిగా బాగా దిగజారిపోయిన వర్మ.. ఉన్నదున్నట్లుగా సినిమాలో చూపించడానికి ఒప్పుకుంటాడా అన్నది ఆసక్తికరం. ఎన్నో ఆసక్తికర మలుపులతో ముడిపడ్డ వర్మ జీవితాన్ని సరిగ్గా చూపిస్తే ప్రేక్షకుల్లో ఆసక్తి ఉంటుంది. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.
This post was last modified on September 16, 2020 3:31 pm
ఎల్లుండి విడుదల కాబోతున్న తండేల్ కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టికెట్ రేట్ల పెంపుకు అనుమతి ఇవ్వడం గురించి చర్చ జరుగుతోంది.…
దేశభాషలందు తెలుగు లెస్స అని ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారు అంటుంటే…ఏపీలో వైసీపీ ప్రభుత్వం మాత్రం ఏపీలో తెలుగు ‘లెస్’…
న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో రెండో వంద కోట్ల బ్లాక్ బస్టర్ గా నిలిచిన సరిపోదా శనివారం అభిమానులతో…
గత నెల సంక్రాంతికి విడుదలైన గేమ్ ఛేంజర్ మొదటి రోజే హెచ్డి పైరసీకి గురి కావడం ఇండస్ట్రీ వర్గాలతో పాటు…
తమిళంలో బిగ్గెస్ట్ స్టార్లలో ఒకడు అజిత్ కుమార్. సూపర్ స్టార్ రజినీకాంత్ జోరు తగ్గాక.. అటు విజయ్, ఇటు అజిత్…
పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో వైసీపీ ఎంపీ…