గత కొంత కాలంగా సరైన సక్సెస్ లేక వెనుకబడినట్టు కనిపిస్తోంది కానీ రాశిఖన్నాకు అవకాశాల పరంగా లోటేమీ లేదు. బాలీవుడ్ లో చాలా గ్యాప్ తర్వాత జెండా పాతాలని ప్రయత్నించింది కానీ మెగా ఫ్లాప్ స్పీడ్ బ్రేకర్స్ లా అడ్డుపడింది. గత నెల ఎన్నో ఆశలు పెట్టుకుని సిద్ధార్థ్ రాయ్ జోడిగా నటించిన యోధ దారుణంగా బోల్తా కొట్టగా ఆగస్ట్ 2 విడుదల కాబోతున్న వివాదాస్పద అంశాల ది సబర్మతి రిపోర్ట్ ఖచ్చితంగా బ్రేక్ ఇస్తుందనే నమ్మకంతో ఉంది. దీనికన్నా ముందు మే 3 రిలీజవుతున్న బాక్ (అరణ్మయి 4) గురించి కోలీవుడ్ లో మంచి బజ్ ఉంది. తమన్నాతో కలిసి నటించిన హారర్ మూవీ ఇది.
ఇవి కాకుండా సిద్ధూ జొన్నలగడ్డ తెలుసు కదాలో ముగ్గురు హీరోయిన్లలో ఒకరిగా మంచి ప్రాధాన్యం దక్కేలా దర్శకురాలు నీరజ కోన డిజైన్ చేసినట్టు ఆల్రెడీ టాక్ ఉంది. మేధావి అనే మరో తమిళ సినిమా నిర్మాణంలో ఉంది. ఇంకో బాలీవుడ్ మూవీ ప్రతిపాదన దశలో ఉంది. ఇవన్నీ చూస్తే ఒకటో రెండో హిట్ అయినా చాలు కెరీర్ మళ్ళీ ఊపందుకోవడం ఖాయం. నితిన్ రాబిన్ హుడ్ నుంచి శ్రీలీల తప్పుకున్నాక రాశిఖన్నాను దాదాపు ఓకే చేశారనే ప్రచారం బలంగా జరుగుతోంది కానీ ప్రొడక్షన్ హౌస్ నుంచి ఇంకా కన్ఫర్మేషన్ లేదు. ఊరికే నిప్పులేనిదే పొగరాదుగా అనుకోవచ్చు.
కొన్నేళ్ల క్రితం దాకా హిట్లలో ఉండి ఇప్పుడిలాంటి గ్రాఫ్ చూడటం కొంచెం ఇబ్బందే అయినా ఇన్నేసి ఆఫర్లు చేతిలో ఉండటం విశేషమే. వెబ్ సిరీస్ రుద్రా, ఫర్జీలతో డిజిటల్ ఎంట్రీ ఇచ్చిన రాశిఖన్నా కథలు బాగుంటే ఏ భాషలో అయినా నటిస్తానని చెబుతోంది. ఒక దశలో చిరంజీవి విశ్వంభర, బాలయ్య 109కు తన పేరే పరిశీలించారు కానీ ఎందుకో మరి ఫైనల్ కాలేదు. సీనియర్ హీరోల సరసన నటించేందుకు సానుకూలంగా ఉంటే ఎక్కువ ఛాన్సులు వస్తాయి. త్రిష, నయనతార లాంటి వాళ్ళు ఇంకా డిమాండ్ లో ఉన్నారంటే కారణం ఇదే. అలాంటి బ్రేక్ ఒకటి రాశిఖన్నాకు దక్కాలి.
This post was last modified on April 24, 2024 3:04 pm
వైసీపీ హయాంలో జరిగిన 3500 కోట్ల రూపాయల లిక్కర్ కుంభకోణం కేసు.. అనేక మలుపులు తిరుగుతోంది. తాజాగా వైసీపీ కీలక…
శ్రియా రెడ్డి అంటే తెలుగు ప్రేక్షకుల్లో చాలామందికి ఇప్పటికీ ‘పొగరు’ సినిమాలోని ఈశ్వరి పాత్ర గుర్తొస్తుంది. విశాల్ హీరోగా వచ్చిన…
ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో, అటు ప్రేక్షకుల్లో జరుగుతున్న చర్చ ఎల్లుండి నుంచి ఇరుముడికి కేటాయించిన చాలా థియేటర్లు టాక్సిక్ కు…
ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత ప్రమాదానికి గురయ్యారు. ఆమె ఎగుర వేసిన డ్రోన్.. కొద్ద దూరం పైకి వెళ్లి…
కుళ్లిపోయిన చికెన్ వ్యర్థాలను చేపలకు ఆహారంగా వినియోగిస్తున్న వ్యవహారం వెలుగులోకి రావడంతో ప్రజారోగ్యంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో…
బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన ఒక ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ అభ్యంతరకరంగా వ్యవహరించడం విమర్శలకు తావిచ్చింది. రాజస్థాన్ లోని ఒక ప్రిన్సిపాల్ విద్యార్థినులతో…