హనుమాన్ విడుదలకు ముందు దర్శకుడు ప్రశాంత్ వర్మ తనకు అవకాశం దొరికితే అవతార్ లాంటి సినిమా తీస్తానని ఓ ఇంటర్వ్యూలో చెబితే చాలా ఓవర్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడంటూ నెటిజెన్లు ట్రోల్ చేశారు. ముగ్గురు పెద్ద స్టార్ల పోటీని తట్టుకుని ఇండస్ట్రీ రికార్డులు తిరగరాయడం చూశాక ఎవరూ నోరు విప్పలేదు. కట్ చేస్తే హనుమాన్ దిగ్విజయంగా వంద రోజులు పూర్తి చేసుకుంది. డైరెక్ట్, షిఫ్ట్ అన్ని కలిపి పాతిక పైగా కేంద్రాలు వచ్చినట్టు ట్రేడ్ టాక్. నిన్న హైదరాబాద్ ఏఏఏ మల్టీప్లెక్స్ లో ఘనంగా శతదినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రశాంత్ ప్లాన్స్ చెప్పాడు.
సినిమాటిక్ యునివర్స్ మీద ఇంకో ఇరవై ఏళ్ళు పని చేస్తానని, తనతో పాటు ఇతర దర్శకులు ఇందులో భాగమవుతారని, సౌత్ నుంచి నార్త్ దాకా ఎందరో స్టార్లు వీటిలో నటిస్తారని చెప్పుకొచ్చాడు. అంటే తన కెరీర్ మొత్తం దీనికే అంకితం చేయబోతున్నాననే సంకేతం స్పష్టంగా ఇచ్చాడు. ప్రశాంత్ వర్మ దగ్గర చాలా ఫాంటసీ కథలున్నాయి. నెక్స్ట్ లైన్ లో ఉన్న అధీరా కూడా అలాంటిదే. జై హనుమాన్ గురించి తెలిసిందే. అందరు సూపర్ హీరోలను ఒక తాటిపైకి తీసుకొచ్చి అవెంజర్స్ తరహాలో టాలీవుడ్ లో ల్యాండ్ మార్క్ ఫ్రాంచైజ్ ఇవ్వాలనేది ఈ యువ దర్శకుడి జీవిత లక్ష్యంగా కనిపిస్తోంది.
చూస్తుంటే పెద్ద రిస్క్ తీసుకుంటున్నాడు ప్రశాంత్ వర్మ. కమర్షియల్ జానర్ ని టచ్ చేయకుండా కేవలం సూపర్ హీరోలతో సినిమాలు చేయడమనేది బడ్జెట్, మార్కెట్ రెండింటి పరంగా పెద్ద బాధ్యతతో కూడుకున్నది. పైగా హాలీవుడ్ లో మాత్రమే ఈ ప్లానింగ్ వర్కౌట్ అవుతూ వచ్చింది కానీ ఇండియాలో ఎవరూ చేయలేకపోయారు. హృతిక్ రోషన్ క్రిష్ సైతం మూడో భాగం తర్వాత ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నారు. అక్కడ రాకేష్ రోషన్ వయసు ఇబ్బంది పెడుతోంది. కానీ ప్రశాంత్ వర్మకు ఆ సమస్య లేదు. ఒకవేళ అన్ని హిట్ అయితే మాత్రం నిజంగానే ఇండియాకో అవతార్ ఇచ్చేలా ఉన్నాడు.
This post was last modified on April 24, 2024 12:18 pm
సరిగ్గా వారం రోజుల్లో ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చేస్తాడు. థియేటర్ యజమానులు ఆ క్షణం కోసమే ఎదురు చూస్తున్నారు. కేవలం…
ఇప్పుడు తెలుగు సినిమా ఎంతో ఎదిగిపోయింది.. సరికొత్త సినిమాలు తీస్తోంది అని కాలర్ ఎగరేస్తున్నాం కానీ.. రెండు దశాబ్దాల ముందు…
ఇండస్ట్రీ పెద్ద ఎవరు..? ఈ ప్రశ్న టాలీవుడ్లో తరచుగా వినిపిస్తుంటుంది. ఒకప్పుడు దర్శక రత్న దాసరి నారాయణరావు ఈ పాత్రను…
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…