ఇప్పుడు టాలీవుడ్లోనే కాక అన్ని సినీ పరిశ్రమల్లోనూ సీక్వెల్స్, ఫ్రాంఛైజీ సినిమాల హవా నడుస్తోంది. బాహుబలి, కేజీఎఫ్ లాంటి సినిమాల ప్రభావమే అందుక్కారణం. ఏ హిట్టు సినిమానూ ఊరికే అలా వదిలేయకుండా.. కొనసాగింపు చిత్రాలు తీసేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో డిజాస్టర్ సినిమాలకు కూడా సీక్వెల్స్ అనౌన్స్ చేస్తుండటం గమనార్హం.
ఈ నేపథ్యంలో నేచురల్ స్టార్ నాని క్లాసిక్ మూవీ ‘జెర్సీ’ సీక్వెల్ ప్రస్తావన వచ్చింది. ఇటీవలే ఈ సినిమా రీ రిలీజై మంచి స్పందన తెచ్చుకుంది. ఇందులో అర్జున్ పాత్రకు ప్రేక్షకులు ఎంత ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారో మరోసారి రుజువైంది. కాగా ఇదే సమయంలో అల్లరి నరేష్ సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు’ ట్రైలర్ లాంచ్ వేడుకకు హాజరైన నానిని ‘జెర్సీ’ సీక్వెల్ గురించి అడిగారు విలేకరులు.
ఐతే ‘జెర్సీ’లో తన పాత్ర చచ్చిపోయింది కాబట్టి తాను జెర్సీ-2 చేయలేనని.. వేరే వాళ్లు ఎవరైనా చేసుకుంటే చేసుకోవచ్చని నాని తేల్చేశాడు. తద్వారా తానైతే ‘జెర్సీ-2’ చేయలేని నాని చెప్పకనే చెప్పేశాడు. పెద్ద నాని చనిపోయినా కొడుకు పాత్రలో నాని రీఎంట్రీ ఇచ్చి సీక్వెల్ చేయొచ్చుగా అనే అనుమానం కలగొచ్చు. కానీ ‘జెర్సీ’లో నాని కొడుకు పెద్దవాడైనట్లు క్లైమాక్స్లో చూపిస్తారు. ఆ పాత్రలో తమిళ నటుడు హరీష్ కళ్యాణ్ కనిపించాడు కూడా. కాబట్టి మళ్లీ నానిని పెట్టి సీక్వెల్ తీయడానికి వీల్లేదు.
హరీష్ కళ్యాణ్కు తెలుగులో అంతగా గుర్తింపు లేదు. అలాంటపుడు అతణ్ని పెట్టి జెర్సీ-2 చేయడం కూడా కష్టమే. అసలు ‘జెర్సీ’ లాంటి కథలను అక్కడితో ముగించేస్తేనే బాగుంటుంది. దానికి మళ్లీ సీక్వెల్ తీసినా అంత బాగోదన్నది మెజారిటీ ప్రేక్షకుల అభిప్రాయం కావచ్చు.
This post was last modified on April 24, 2024 5:53 am
ఒకప్పటి డిజాస్టర్లు ఇప్పుడు రీ రిలీజ్ ట్రెండ్ లో బాగా ఆడటం గమనిస్తున్నాం. ఆరెంజ్ మూడుసార్లు వచ్చినా కలెక్షన్లు కుమ్మరించింది.…
టాలీవుడ్లో ఘన చరిత్ర ఉన్న బేనర్లో లక్ష్మీప్రసన్న పిక్చర్స్ ఒకటి. ఈ బేనర్ మీద పదుల సంఖ్యలో సినిమాలు తీశారు…
‘యమదొంగ’ చిత్రంతో టాలీవుడ్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది మలయాళ భామ మమతా మోహన్ దాస్. ఆ చిత్రంలో చలాకీ పాత్ర…
ఇరు తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నాయకుల్లో చాలామంది పెద్దగా భావోద్వేగాలకు లోను కారు. మిన్ను విరిగి మీద పడ్డా…ఎన్నికల…
మన శంకరవరప్రసాద్ గారు రూపంలో చిరంజీవికి బ్లాక్ బస్టర్ కానుక ఇచ్చి రెమ్యునరేషన్ తో పాటు రేంజ్ రోవర్ కారు…
24 ఏళ్ల కిందట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే కాక దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయిన నటి ప్రత్యూష మృతి వ్యవహారంలో సుప్రీం కోర్టు…