ఇప్పటిదాకా విడుదలైన 2024 సినిమాలో అతి పెద్ద బ్లాక్ బస్టర్ గా అవతరించిన హనుమాన్ సీక్వెల్ జై హనుమాన్ ని అధికారికంగా ఎప్పుడో ప్రకటించారు. ఇవాళ హైదరాబాద్ ఏఏఏ మల్టీప్లెక్స్ లో ఫ్రీ షోతో పాటు వంద రోజుల వేడుక చేయబోతున్నారు. ఈ సందర్భంగా పార్ట్ 2కి సంబంధించిన అప్డేట్స్ ఏమైనా చెబుతారేమోనని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. జై హనుమాన్ ని ప్రత్యేకంగా ఐమాక్స్ వెర్షన్ లో షూట్ చేయబోతున్నట్టు, పూర్తిగా 3డి వెర్షన్ లో ఎంజాయ్ చేయొచ్చని నిర్మాతలు అఫీషియల్ గా ఒక కొత్త పోస్టర్ తో ప్రకటించారు. వినడానికి బాగానే ఉంది తెలుగు అభిమానులకు మాత్రం నిరాశే.
ఎందుకంటే ఏపీ, తెలంగాణలో బోలెడు థియేటర్లున్నా ఎక్కడా ఒరిజినల్ ఐమాక్స్ స్క్రీన్ లేదు. దేశం మొత్తం ప్రధాన నగరాల్లో ఈ తెరలను పలు కార్పొరేట్ సంస్థలు ఏర్పాటు చేశాయి కానీ కనీసం హైదరాబాద్, విజయవాడ, వైజాగ్ వంటి నగరాలు కూడా ఆ అదృష్టానికి నోచుకోలేదు. ఉన్నంతలో ఏషియాలోనే అతి భారీ భారీ స్క్రీన్లను ప్రసాద్ కార్పొరేషన్, వి సెల్యులాయిడ్(సూళ్లూరు పేట) ఏర్పాటు చేశాయి కానీ వాటిలో వాడే టెక్నాలజీ ఐమాక్స్ తో సమానం కాదు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న టికెట్ ధరల నిబంధనలే ఐమాక్స్ కు అడ్డుగా ఉన్నాయనే టాక్ డిస్ట్రిబ్యూటర్ వర్గాల్లో ఉంది.
ఒక తెలుగువాడు భారీ సాంకేతికతతో సినిమా తీస్తే దాన్ని పూర్తిగా ఆస్వాదించే ఛాన్స్ అందరికీ లేకపోవడం గురించి ఇకనైనా సీరియస్ గా ఆలోచించాలి. తక్కువ థియేటర్లు నడిచే కేరళ, తమిళనాడులో ఐమాక్స్ లు ఉండగా ఇక్కడ ఊసే లేకపోవడం విచారకరం. జై హనుమాన్ బడ్జెట్ దీన్ని బట్టే ఎంత భారీ పెంచారో అర్థం చేసుకోవచ్చు. రాముడు, హనుమంతుడుగా ఎవరు నటిస్తారోననే యాంగ్జైటీ మూవీ లవర్స్ లో విపరీతంగా ఉంది. ఆ సస్పెన్స్ ఎప్పుడు తీరుతుందో చూడాలి. అయితే గతంలో ప్రకటించినట్టు 2025 సంక్రాంతి విడుదల జై హనుమాన్ కు సాధ్యం కాదు. అందుకే వేసవిని టార్గెట్ చేస్తారని టాక్.
ఈ మధ్య రిలీజ్ డేట్ ప్రకటించాక ఎంత ప్లాన్డ్ గా పనులు చేసినా చివరి నిమిషం వరకు వాయిదా ఉండదన్న…
మలయాళంలో బ్లాక్ బస్టర్ అవ్వొచ్చేమో కానీ తెలుగులో మాత్రం దృశ్యం 3ని ఫ్లాప్ గానే పరిగణించాలి. తక్కువ బిజినెస్ చేయడం…
మీలాగా మేం ఫామ్ హౌస్లో పడుకోవట్లే - అంటూ తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.. బీఆర్ఎస్ పార్టీపై ఓ…
స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లిలాంటిదే అన్నట్టుగా వైసీపీ నాయకులకు ఎక్కడ ఎలా వ్యవహరించాలో తెలియడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.…
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ కు నిజంగానే షాక్…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్లు.. కూటమి ప్రభుత్వంలో కీలక రోల్ పోషిస్తున్న విషయం తెలిసిందే.…