ఇప్పటిదాకా విడుదలైన 2024 సినిమాలో అతి పెద్ద బ్లాక్ బస్టర్ గా అవతరించిన హనుమాన్ సీక్వెల్ జై హనుమాన్ ని అధికారికంగా ఎప్పుడో ప్రకటించారు. ఇవాళ హైదరాబాద్ ఏఏఏ మల్టీప్లెక్స్ లో ఫ్రీ షోతో పాటు వంద రోజుల వేడుక చేయబోతున్నారు. ఈ సందర్భంగా పార్ట్ 2కి సంబంధించిన అప్డేట్స్ ఏమైనా చెబుతారేమోనని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. జై హనుమాన్ ని ప్రత్యేకంగా ఐమాక్స్ వెర్షన్ లో షూట్ చేయబోతున్నట్టు, పూర్తిగా 3డి వెర్షన్ లో ఎంజాయ్ చేయొచ్చని నిర్మాతలు అఫీషియల్ గా ఒక కొత్త పోస్టర్ తో ప్రకటించారు. వినడానికి బాగానే ఉంది తెలుగు అభిమానులకు మాత్రం నిరాశే.
ఎందుకంటే ఏపీ, తెలంగాణలో బోలెడు థియేటర్లున్నా ఎక్కడా ఒరిజినల్ ఐమాక్స్ స్క్రీన్ లేదు. దేశం మొత్తం ప్రధాన నగరాల్లో ఈ తెరలను పలు కార్పొరేట్ సంస్థలు ఏర్పాటు చేశాయి కానీ కనీసం హైదరాబాద్, విజయవాడ, వైజాగ్ వంటి నగరాలు కూడా ఆ అదృష్టానికి నోచుకోలేదు. ఉన్నంతలో ఏషియాలోనే అతి భారీ భారీ స్క్రీన్లను ప్రసాద్ కార్పొరేషన్, వి సెల్యులాయిడ్(సూళ్లూరు పేట) ఏర్పాటు చేశాయి కానీ వాటిలో వాడే టెక్నాలజీ ఐమాక్స్ తో సమానం కాదు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న టికెట్ ధరల నిబంధనలే ఐమాక్స్ కు అడ్డుగా ఉన్నాయనే టాక్ డిస్ట్రిబ్యూటర్ వర్గాల్లో ఉంది.
ఒక తెలుగువాడు భారీ సాంకేతికతతో సినిమా తీస్తే దాన్ని పూర్తిగా ఆస్వాదించే ఛాన్స్ అందరికీ లేకపోవడం గురించి ఇకనైనా సీరియస్ గా ఆలోచించాలి. తక్కువ థియేటర్లు నడిచే కేరళ, తమిళనాడులో ఐమాక్స్ లు ఉండగా ఇక్కడ ఊసే లేకపోవడం విచారకరం. జై హనుమాన్ బడ్జెట్ దీన్ని బట్టే ఎంత భారీ పెంచారో అర్థం చేసుకోవచ్చు. రాముడు, హనుమంతుడుగా ఎవరు నటిస్తారోననే యాంగ్జైటీ మూవీ లవర్స్ లో విపరీతంగా ఉంది. ఆ సస్పెన్స్ ఎప్పుడు తీరుతుందో చూడాలి. అయితే గతంలో ప్రకటించినట్టు 2025 సంక్రాంతి విడుదల జై హనుమాన్ కు సాధ్యం కాదు. అందుకే వేసవిని టార్గెట్ చేస్తారని టాక్.
This post was last modified on April 23, 2024 5:00 pm
టాలీవుడ్లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…
తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్చార్జ్ శంకర్గౌడ్…
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…
సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ది రాజా సాబ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన…