బాలీవుడ్ ప్రముఖులకు ముంబయి పేలుళ్ల సూత్రధారి, మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంతో ఉన్న సంబంధాలపై ఒకప్పుడు తరచుగా చర్చ జరుగుతుండేది. పాకిస్థాన్లో సెటిలైపోయిన దావూద్ గురించి ఇప్పుడు పెద్దగా వార్తలేమీ రావట్లేదు కానీ.. ఈ తరహా వార్తలు రోజూ వస్తుండేవి. అలాగే లెజెండరీ హీరోయిన్ డింపుల్ ఖన్నా కూతురు, స్టార్ హీరో అక్షయ్ కుమార్ భార్య అయిన ఒకప్పటి నటి ట్వింకిల్ ఖన్నా గురించి కూడా ఒకప్పుడు ఓ వార్త హాట్ టాపిక్ అయింది.
ఆమె దావూద్ నిర్వహించిన ఓ పార్టీలో డబ్బు కోసం డ్యాన్స్ చేశారంటూ ఓ టీవీ ఛానెల్ ప్రసారం చేసిన వార్త దుమారం రేపింది. తర్వాత ఇతర మీడియాల్లో కూడా దాని గురించి వార్తలు వచ్చాయి. ఆ అంశంపై ఇప్పుడు ట్వింకిల్ ఓపెన్ అయింది.
“నేను దావూద్ ఇబ్రహీం పార్టీలో డ్యాన్స్ చేసినట్లు అప్పట్లో ఓ టీవీ ఛానెల్ వార్తలు వడ్డించింది. అది చూసి నా పిల్లలు నవ్వుకున్నారు. నేను డ్యాన్స్ చేస్తే ఎలా ఉంటుందో నా కుటుంబ సభ్యులకు బాగా తెలుసు. అందుకే ఎవ్వరూ నమ్మలేదు. నేనేమీ గొప్ప డ్యాన్సర్ను కాదు. దావూద్ కావాలనుకుంటే ఇంకా మంచి డ్యాన్సర్లను పెట్టుకుంటాడనే విషయాన్ని ఆ ఛానెళ్లు గ్రహించాల్సింది. కరోనా సమయంలో మనం ఎన్నో ఫేక్ వార్తలు చూశాం. ఇటీవల సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం విషయంలో కూడా ఎన్నో ఫేక్ వార్తలు సృష్టించారు. వాటిని జనం నిజమని నమ్మారు టెక్నాలజీని ఉపయోగించుకుని అబద్ధపు వార్తలు పుట్టిస్తున్నారు. ఇటీవల రెజ్లర్లు నిరసన ప్రదర్శన చేస్తుంటే.. అందులో వినేశ్ ఫొగాట్, సంగీత ఫొగాట్ నవ్వుతున్నట్లు మార్ఫింగ్ ఫొటోలు వైరల్ చేశారు. గతంలో నా పైనా ఇలాంటి ప్రచారాలే జరిగాయి. అలాంటిదే దావూద్ పార్టీలో నేను డ్యాన్స్ చేశాననే వార్త” అని ట్వింకిల్ పేర్కొంది.
This post was last modified on April 22, 2024 8:59 pm
హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…
నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…
ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…
నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…
ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కోల్ కతాలోని కాళీ ఘాట్ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చేపల కూర…