బాలీవుడ్ ప్రముఖులకు ముంబయి పేలుళ్ల సూత్రధారి, మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంతో ఉన్న సంబంధాలపై ఒకప్పుడు తరచుగా చర్చ జరుగుతుండేది. పాకిస్థాన్లో సెటిలైపోయిన దావూద్ గురించి ఇప్పుడు పెద్దగా వార్తలేమీ రావట్లేదు కానీ.. ఈ తరహా వార్తలు రోజూ వస్తుండేవి. అలాగే లెజెండరీ హీరోయిన్ డింపుల్ ఖన్నా కూతురు, స్టార్ హీరో అక్షయ్ కుమార్ భార్య అయిన ఒకప్పటి నటి ట్వింకిల్ ఖన్నా గురించి కూడా ఒకప్పుడు ఓ వార్త హాట్ టాపిక్ అయింది.
ఆమె దావూద్ నిర్వహించిన ఓ పార్టీలో డబ్బు కోసం డ్యాన్స్ చేశారంటూ ఓ టీవీ ఛానెల్ ప్రసారం చేసిన వార్త దుమారం రేపింది. తర్వాత ఇతర మీడియాల్లో కూడా దాని గురించి వార్తలు వచ్చాయి. ఆ అంశంపై ఇప్పుడు ట్వింకిల్ ఓపెన్ అయింది.
“నేను దావూద్ ఇబ్రహీం పార్టీలో డ్యాన్స్ చేసినట్లు అప్పట్లో ఓ టీవీ ఛానెల్ వార్తలు వడ్డించింది. అది చూసి నా పిల్లలు నవ్వుకున్నారు. నేను డ్యాన్స్ చేస్తే ఎలా ఉంటుందో నా కుటుంబ సభ్యులకు బాగా తెలుసు. అందుకే ఎవ్వరూ నమ్మలేదు. నేనేమీ గొప్ప డ్యాన్సర్ను కాదు. దావూద్ కావాలనుకుంటే ఇంకా మంచి డ్యాన్సర్లను పెట్టుకుంటాడనే విషయాన్ని ఆ ఛానెళ్లు గ్రహించాల్సింది. కరోనా సమయంలో మనం ఎన్నో ఫేక్ వార్తలు చూశాం. ఇటీవల సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం విషయంలో కూడా ఎన్నో ఫేక్ వార్తలు సృష్టించారు. వాటిని జనం నిజమని నమ్మారు టెక్నాలజీని ఉపయోగించుకుని అబద్ధపు వార్తలు పుట్టిస్తున్నారు. ఇటీవల రెజ్లర్లు నిరసన ప్రదర్శన చేస్తుంటే.. అందులో వినేశ్ ఫొగాట్, సంగీత ఫొగాట్ నవ్వుతున్నట్లు మార్ఫింగ్ ఫొటోలు వైరల్ చేశారు. గతంలో నా పైనా ఇలాంటి ప్రచారాలే జరిగాయి. అలాంటిదే దావూద్ పార్టీలో నేను డ్యాన్స్ చేశాననే వార్త” అని ట్వింకిల్ పేర్కొంది.
This post was last modified on April 22, 2024 8:59 pm
తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారాయి. టీవీకే ప్రభుత్వం ఏర్పాటు కావడం లాంఛనమే అంతా భావించిన తరుణంలో ఆ పార్టీ అధినేత…
దక్షిణాది సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నిర్మాతల్లో ఒకరైన ఆర్.బి.చౌదరి.. రెండు రోజుల కిందట ఒక కారు ప్రమాదంలో దుర్మరణం…
టాలీవుడ్ ప్రముఖ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి మరోమారు మీడియా ముందుకు వచ్చారు. జెంటిల్మన్ ని అయిన తనను డాబర్…
తెలంగాణలోని కరీంనగర్ లో గురువారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీఆర్ఎస్ కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేల వాహనాలు, క్యాంప్…
తమిళనాడు రాజకీయాల్లో నాటకీయ పరిణామాలు జరుగుతున్నాయి. ఈ రోజు తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని భావించిన టీవీకే అధినేత…
ఏపీలో అధికార కూటమి రథసారథి తెలుగు దేశం పార్టీ (టీడీపీ)లో గురువారం ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. తూర్పుగోదావరి జిల్లా…