బాలీవుడ్ ప్రముఖులకు ముంబయి పేలుళ్ల సూత్రధారి, మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంతో ఉన్న సంబంధాలపై ఒకప్పుడు తరచుగా చర్చ జరుగుతుండేది. పాకిస్థాన్లో సెటిలైపోయిన దావూద్ గురించి ఇప్పుడు పెద్దగా వార్తలేమీ రావట్లేదు కానీ.. ఈ తరహా వార్తలు రోజూ వస్తుండేవి. అలాగే లెజెండరీ హీరోయిన్ డింపుల్ ఖన్నా కూతురు, స్టార్ హీరో అక్షయ్ కుమార్ భార్య అయిన ఒకప్పటి నటి ట్వింకిల్ ఖన్నా గురించి కూడా ఒకప్పుడు ఓ వార్త హాట్ టాపిక్ అయింది.
ఆమె దావూద్ నిర్వహించిన ఓ పార్టీలో డబ్బు కోసం డ్యాన్స్ చేశారంటూ ఓ టీవీ ఛానెల్ ప్రసారం చేసిన వార్త దుమారం రేపింది. తర్వాత ఇతర మీడియాల్లో కూడా దాని గురించి వార్తలు వచ్చాయి. ఆ అంశంపై ఇప్పుడు ట్వింకిల్ ఓపెన్ అయింది.
“నేను దావూద్ ఇబ్రహీం పార్టీలో డ్యాన్స్ చేసినట్లు అప్పట్లో ఓ టీవీ ఛానెల్ వార్తలు వడ్డించింది. అది చూసి నా పిల్లలు నవ్వుకున్నారు. నేను డ్యాన్స్ చేస్తే ఎలా ఉంటుందో నా కుటుంబ సభ్యులకు బాగా తెలుసు. అందుకే ఎవ్వరూ నమ్మలేదు. నేనేమీ గొప్ప డ్యాన్సర్ను కాదు. దావూద్ కావాలనుకుంటే ఇంకా మంచి డ్యాన్సర్లను పెట్టుకుంటాడనే విషయాన్ని ఆ ఛానెళ్లు గ్రహించాల్సింది. కరోనా సమయంలో మనం ఎన్నో ఫేక్ వార్తలు చూశాం. ఇటీవల సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం విషయంలో కూడా ఎన్నో ఫేక్ వార్తలు సృష్టించారు. వాటిని జనం నిజమని నమ్మారు టెక్నాలజీని ఉపయోగించుకుని అబద్ధపు వార్తలు పుట్టిస్తున్నారు. ఇటీవల రెజ్లర్లు నిరసన ప్రదర్శన చేస్తుంటే.. అందులో వినేశ్ ఫొగాట్, సంగీత ఫొగాట్ నవ్వుతున్నట్లు మార్ఫింగ్ ఫొటోలు వైరల్ చేశారు. గతంలో నా పైనా ఇలాంటి ప్రచారాలే జరిగాయి. అలాంటిదే దావూద్ పార్టీలో నేను డ్యాన్స్ చేశాననే వార్త” అని ట్వింకిల్ పేర్కొంది.
This post was last modified on April 22, 2024 8:59 pm
గత వారం విడుదలైన ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా ఫుల్ పాజిటివ్ టాకేమీ తెచ్చుకోలేదు. ప్రిమియర్స్ నుంచే డివైడ్ టాక్ మొదలైంది.…
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని విష్ణుమూర్తి అవతారంగా ప్రముఖ బాలివుడ్ నటుడు సుదేష్ బెర్రీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో…
బలమైన కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆశలన్నీ కొరియన్ కనకరాజు మీదే ఉన్నాయి. ఆగస్ట్…
బారత ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ... వరుసబెట్టి మూడు పర్యాయాలు దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. అంతేకాకుండా దేశానికి అత్యధిక…
కొత్త నెల వచ్చేసింది. సంక్రాంతి అయిపోయాక ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ దాకా జనాలు రాక థియేటర్లు అలో లక్ష్మణా అంటున్న…
జంతర్ మంతర్ ఆందోళనలో విద్యార్థులు తనను దుషించారని ప్రధాని మోదీ శుక్రవారం రాత్రి విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో…