బాలీవుడ్ ప్రముఖులకు ముంబయి పేలుళ్ల సూత్రధారి, మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంతో ఉన్న సంబంధాలపై ఒకప్పుడు తరచుగా చర్చ జరుగుతుండేది. పాకిస్థాన్లో సెటిలైపోయిన దావూద్ గురించి ఇప్పుడు పెద్దగా వార్తలేమీ రావట్లేదు కానీ.. ఈ తరహా వార్తలు రోజూ వస్తుండేవి. అలాగే లెజెండరీ హీరోయిన్ డింపుల్ ఖన్నా కూతురు, స్టార్ హీరో అక్షయ్ కుమార్ భార్య అయిన ఒకప్పటి నటి ట్వింకిల్ ఖన్నా గురించి కూడా ఒకప్పుడు ఓ వార్త హాట్ టాపిక్ అయింది.
ఆమె దావూద్ నిర్వహించిన ఓ పార్టీలో డబ్బు కోసం డ్యాన్స్ చేశారంటూ ఓ టీవీ ఛానెల్ ప్రసారం చేసిన వార్త దుమారం రేపింది. తర్వాత ఇతర మీడియాల్లో కూడా దాని గురించి వార్తలు వచ్చాయి. ఆ అంశంపై ఇప్పుడు ట్వింకిల్ ఓపెన్ అయింది.
“నేను దావూద్ ఇబ్రహీం పార్టీలో డ్యాన్స్ చేసినట్లు అప్పట్లో ఓ టీవీ ఛానెల్ వార్తలు వడ్డించింది. అది చూసి నా పిల్లలు నవ్వుకున్నారు. నేను డ్యాన్స్ చేస్తే ఎలా ఉంటుందో నా కుటుంబ సభ్యులకు బాగా తెలుసు. అందుకే ఎవ్వరూ నమ్మలేదు. నేనేమీ గొప్ప డ్యాన్సర్ను కాదు. దావూద్ కావాలనుకుంటే ఇంకా మంచి డ్యాన్సర్లను పెట్టుకుంటాడనే విషయాన్ని ఆ ఛానెళ్లు గ్రహించాల్సింది. కరోనా సమయంలో మనం ఎన్నో ఫేక్ వార్తలు చూశాం. ఇటీవల సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం విషయంలో కూడా ఎన్నో ఫేక్ వార్తలు సృష్టించారు. వాటిని జనం నిజమని నమ్మారు టెక్నాలజీని ఉపయోగించుకుని అబద్ధపు వార్తలు పుట్టిస్తున్నారు. ఇటీవల రెజ్లర్లు నిరసన ప్రదర్శన చేస్తుంటే.. అందులో వినేశ్ ఫొగాట్, సంగీత ఫొగాట్ నవ్వుతున్నట్లు మార్ఫింగ్ ఫొటోలు వైరల్ చేశారు. గతంలో నా పైనా ఇలాంటి ప్రచారాలే జరిగాయి. అలాంటిదే దావూద్ పార్టీలో నేను డ్యాన్స్ చేశాననే వార్త” అని ట్వింకిల్ పేర్కొంది.
This post was last modified on April 22, 2024 8:59 pm
బీజేపీ, జనసేనలతో కూటమి కట్టిన టీడీపీ ఏపీలో జరిగిన ఎన్నికల్లో పోరాటం చేసిన విషయం తెలిసిందే. పోలింగ్ శాతం పెరిగిన…
గేమ్ ఛేంజర్ దెబ్బకు ఏకంగా మూడు సంవత్సరాలకు పైగా దానికే కేటాయించాల్సి వచ్చిన రామ్ చరణ్ శంకర్ మీద ఉన్న…
ఎన్నికల సమరం ముగియడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబంతో కలిసి విదేశాలకు విహారయాత్రకు వెళ్లారు. జగన్ విదేశీ పర్యటనకు…
చాంతాడంత కారణాలు చెప్పుకుని జనం థియేటర్లకు రావడం లేదని ఎంత బాధ పడినా వాస్తవిక పరిస్థితిని అర్థం చేసుకుంటే కనక…
యానిమల్ దెబ్బకు జాతీయ స్థాయిలో భారీ గుర్తింపు తెచ్చేసుకున్న రష్మిక మందన్న బీజీపీ ప్రభుత్వం తరఫున అనధికార ప్రచార కర్త…
దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలలో 370కి పైగా స్థానాలు సాధించి హ్యాట్రిక్ విజయంతో అధికారం చేజిక్కించుకోవాలన్న కమలం ఆశలమీద ఆయా…