Movie News

టాలీవుడ్లో ఓటీటీ వేడి

మిగతా ఇండస్ట్రీలు ఓటీటీ రిలీజ్‌ విషయంలో చాలా ముందంజలో ఉంటే.. టాలీవుడ్ మాత్రం అంతగా ఆసక్తి లేనట్లు కనిపించింది. హిందీలో పేరున్న సినిమాలు జూన్ నెల నుంచే ఓటీటీల్లో విడుదలవుతూ వచ్చాయి. తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో కూడా కాస్త పేరున్న సినిమాలు ఇలా రిలీజయ్యాయి. కానీ టాలీవుడ్ నిర్మాతలు మాత్రం ధైర్యం చేయలేదు.

రెండు మూడు నెలలు ఆగితే థియేటర్లు తెరుచుకుంటాయన్న ఆశాభావంతో ఎదురు చూశారు. మధ్యలో కృష్ణ అండ్ హిజ్ లీల, 47 డేస్, భానుమతి రామకృష్ణ, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య లాంటి చిన్న సినిమాలు ఓటీటీ బాట పట్టాయి కానీ.. కొంచెం రేంజ్ ఉన్న సినిమాలేవీ ఇటువైపు చూడలేదు. కానీ ఆరు నెలలైనా థియేటర్లు తెరుచుకోకపోవడంతో మన నిర్మాతల ఆలోచనలు మారిపోయాయి.

ఈ మధ్యే ‘వి’ లాంటి పెద్ద సినిమాను నేరుగా అమేజాన్‌ ప్రైమ్‌లో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఐతే ఆ సినిమా ఆశించిన స్పందన రాబట్టుకోవడంతో కొన్ని రోజుల పాటు స్తబ్దత నెలకొంది. కొత్త ఓటీటీ రిలీజ్‌ల విషయంలో ఎలాంటి అప్ డేట్లు లేకపోయాయి.

దీంతో ప్రేక్షకుల్లో నిరాశ కనిపించింది. కానీ ఉన్నట్లుండి టాలీవుడ్లో మళ్లీ కదలిక వచ్చింది. వరుసబెట్టి కొత్త సినిమాల్ని ఓటీటీల్లోకి వదిలేయడానికి రెడీ అయిపోయారు. ఇప్పటికే అక్టోబరు 2న ‘ఒరేయ్ బుజ్జిగా’ ఆహాలో విడుదల కాబోతున్నట్లు ప్రకటన రాగా.. అదే ఓటీటీలో ‘కలర్ ఫొటో’ రిలీజ్ కూడా కన్ఫమ్ అయింది. ఆ చిత్రం దసరా కానుకగా అక్టోబరు 23న రాబోతోంది.

మరోవైపు అనుష్క సినిమా ‘నిశ్శబ్దం’ను కూడా అక్టోబరు 2నే రిలీజ్ చేయనున్నారట. ఈ మేరకు చిత్ర బృందం మీడియాకు లీకులు కూడా ఇచ్చేసింది. నెల రోజుల్లో మూడు తెలుగులో సినిమాలు ఓటీటీలో నేరుగా రిలీజ్ కావడం, అందవులో రెండు ఒకే రోజు రాబోతుండటం విశేషమే.

మరోవైపు సోలో బ్రతుకే సో బెటర్, మిస్ ఇండియా, గుడ్ లక్ సఖి, దటీజ్ మహాలక్ష్మి లాంటి సినిమాల్ని కూడా సాధ్యమైనంత త్వరగా రిలీజ్ చేయడానికి చూస్తున్నారు. ఈ మూడు కూడా అక్టోబరు, నవంబరు నెలల్లోనే విడుదలయ్యే అవకాశాలున్నాయి. మొత్తానికి థియేటర్లలో కొత్త సినిమాలను మిస్ అవుతున్న తెలుగు ప్రేక్షకులకు వచ్చే రెండు నెలల్లో ఓటీటీ విందు ఘనంగానే ఉండేలా ఉంది.

This post was last modified on September 16, 2020 10:53 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

భయం లేదు కాబట్టే… బద్దలు కొట్టాం: పవన్ కల్యాణ్

భయం లేదు కాబట్టే… దుష్ట పాలనను బద్దలు కొట్టామని జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు.…

55 minutes ago

11వ ఆవిర్భావం పూర్తి.. 11 స్థానాల‌కు ప‌రిమితం!: ప‌వ‌న్ కల్యాణ్‌

భార‌త దేశానికి బ‌హుభాషే మంచిద‌ని జ‌న‌సేన అధినేత, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ స్ప‌ష్టం చేశారు. తాజాగా పిఠాపురంలో జ‌రిగిన…

1 hour ago

పిఠాపురంలో జగన్ పై నాగబాబు సెటైర్లు!

పిఠాపురంలోని చిత్రాడలో జనసేన 12వ ఆవిర్భావ సభను ఘనంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే జయ కేతనం సభకు…

1 hour ago

ఆమిర్ ప్రేయ‌సి చ‌రిత్ర మొత్తం త‌వ్వేశారు

ఇప్ప‌టికే రెండుసార్లు పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్న బాలీవుడ్ సూప‌ర్ స్టార్ ఆమిర్ ఖాన్.. 60వ ఏట అడుగు పెడుతున్న…

2 hours ago

జగన్ నా ఆస్తులను లాక్కున్నారు: బాలినేని

జనసేన ఆవిర్భావ సభ జయకేతనం వేదికగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై సంచలన ఆరోపణ వినిపించింది. మొన్నటిదాకా…

2 hours ago

జన సైనికులను మించిన జోష్ లో పవన్

జనసేన ఆవిర్భావ వేడుకలు ఆ పార్టీ శ్రేణుల్లో ఏ మేర జోష్ ను నింపాయన్నది.. పిఠాపురం శివారు చిత్రాడలో జయకేతనం…

3 hours ago