విడుదల తేదీ ఖరారు కాకపోయినా అక్టోబర్ రావడం పక్కాని తేలిపోవడంతో రామ్ చరణ్ ఫ్యాన్స్ గేమ్ ఛేంజర్ కౌంట్ డౌన్ మొదలు పెట్టేశారు. మొన్నటిదాకా కూతురి పెళ్లిలో బిజీగా ఉన్న దర్శకుడు శంకర్ ఫ్రీ అయిపోవడంతో అతి త్వరలో రిలీజ్ డేట్ లాక్ చేయబోతున్నారు. ఇటీవలే వచ్చిన జరగండి జరగండి లిరికల్ వీడియోకి మిశ్రమ స్పందన వచ్చిన నేపథ్యంలో తరువాత ప్రమోషనల్ కంటెంట్ ని ప్రత్యేకంగా ప్లాన్ చేయబోతున్నారు. ముఖ్యంగా టీజర్ చూశాక అంచనాలు ఎక్కడికో వెళ్లిపోయేలా శంకర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారట. కాకపోతే ఇంకో రెండు నెలలు ఎదురు చూడాలి.
ఇదిలా ఉండగా గేమ్ ఛేంజర్ లో మెయిన్ హీరోయిన్ గా అందరూ కియారా అద్వానీనే చూస్తున్నారు. ఏదో ఊరికే ఆడిపాడటం లాగా కాకుండా లీకైన గెటప్ చూస్తుంటే నటనకు ప్రాధాన్యం ఉన్నట్టుగానే అనిపించింది. చరణ్ తో పాటు ఐఎఎస్ చదివిన ఆఫీసర్ గా మంచి లెన్త్ దొరికినట్టు ఉంది. అయితే అసలు ఛాలెంజ్ ఇందులో అంజలికి ఉన్నట్టు యూనిట్ టాక్. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే పెద్ద రామ్ చరణ్ భార్యగా ఎవరూ ఊహించని తరహాలో శంకర్ ఆమె పాత్రను డిజైన్ చేశారట. కమల్ హాసన్ భారతీయుడులో సుకన్య తరహాలో యాక్టింగ్, మేకప్ రెండూ చాలా క్లిష్టం అనిపించేలా ప్రెజెంట్ చేశారట.
ఈ లెక్కన ఎవరూ ఊహించని సర్ప్రైజ్ అంజలినే కాబోతోంది. తనకో పాట కూడా ఉంటుంది కానీ డ్యూయెట్ తరహాలో కాకుండా ఎమోషనల్ గా, దేశభక్తిని మిళితం చేస్తూ తమన్ కంపోజ్ చేశాడని తెలిసింది. ఇటీవలే తన యాభై సినిమా గీతాంజలి మళ్ళీ వచ్చింది ఫలితంతో నిరాశ చెందిన అంజలికి గేమ్ ఛేంజర్ సక్సెస్ చాలా కీలకం కానుంది. ప్రస్తుతానికి అవకాశాలకు లోటు లేకపోయినా ఇది బ్లాక్ బస్టర్ అయితే గ్రాఫ్ అమాంతం ఎక్కడికో వెళ్ళిపోతుంది. దీనికన్నా ముందు విశ్వక్ సేన్ గ్యాంగ్స్ అఫ్ గోదావరిలోనూ పెర్ఫార్మన్స్ కు స్కోప్ ఉన్న పాత్రనే దక్కించుకున్న అంజలి దేంతో బ్రేక్ దక్కుతుందో చూడాలి.
This post was last modified on April 21, 2024 10:21 am
సంక్రాంతి పండుగ హడావుడి మొదలవడంతో హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఖాళీ అవుతోంది. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో విజయవాడ జాతీయ రహదారి…
టాలీవుడ్లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…
తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్చార్జ్ శంకర్గౌడ్…
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…