ఒకప్పుడు ఉత్తరాది దర్శకులు, హీరోలంటే బాలీవుడ్ లో అంత ఉన్నత భావం ఉండేది కాదు. సాక్ష్యాత్తు చిరంజీవే ఓ సందర్భంలో మాట్లాడుతూ ఒక ఫిలిం ఫెస్టివల్ కు వెళ్ళినప్పుడు మన లెజెండ్స్ ఫోటోలు లేకపోవడం చూసి బాధపడ్డానని చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడదంతా గతం. ముఖేష్ అంబానీ కొడుకు వేడుకలో ముగ్గురు ఖాన్లు కలిసి స్టేజి మీద డాన్సు చేయడానికి ఆస్కార్ సాధించిన తెలుగు పాట నాటు నాటునే కావాల్సి వచ్చింది. రాజమౌళి మీదున్న అక్కసు వర్తమానంలో తగ్గింది కానీ గతంలో ఎక్కువే. ఇప్పుడు సందీప్ రెడ్డి వంగా పదే పదే లక్ష్యంగా మారుతున్నాడు.
అసలు విషయమేంటో చూద్దాం. అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ కబీర్ సింగ్ లో షాహిద్ కపూర్ చదివే మెడికల్ కాలేజీ డీన్ గా నటించిన వ్యక్తి ఆదిల్ హుసేన్. తక్కువ సీన్లు ఉంటాయి. ఇటీవలే జరిగిన ఒక రేడియో టాక్ షోలో మాట్లాడుతూ ఆ సినిమా చేసినందుకు ఇప్పటికీ బాధ పడుతుంటానని, షూటింగ్ కు వెళ్లకుండా ఎక్కువ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తే అదీ ఇచ్చారని, అందువల్ల చేయక తప్పలేదని అన్నాడు. అక్కడితో ఆగకుండా తెరమీద కబీర్ సింగ్ చూస్తున్నప్పుడు చాలా ఇబ్బంది పడ్డానని కాస్త మోతాదు మించే ఓవరాక్షన్ చేశాడు. నిజానికి ఆయన క్యారెక్టర్ లెన్త్ కి ఇంత అవసరం లేదు.
దానికి సందీప్ వంగా ఘాటుగా బదులిస్తూ 30 ఆర్ట్ సినిమాలు తీసుకురాని పేరు ఒక్క బ్లాక్ బస్టర్ ఇచ్చినందుకు బాధ పడటంలో తప్పు లేదని, నటన పట్ల ప్యాషన్ కన్నా దురాశే కనిపిస్తోందని చురకలు వేశాడు. ఇప్పటికైనా మించిపోలేదని ఏఐ టెక్నాలజీ వాడి నీ మొహాన్ని మారుస్తానని ట్వీట్ చేయడం సంచలనం రేపుతోంది. ఇప్పుడే కాదు కబీర్ సింగ్ రిలీజైన టైంలోనూ కొందరు హిందీ క్రిటిక్స్ ఉద్దేశపూర్వకంగా తక్కువ రేటింగ్స్ ఇచ్చి నెగటివ్ రివ్యూలు రాశారు. ఆడియన్స్ మద్దతుతో అది మూడు వందల కోట్లు సాధించింది. యానిమల్ మీద ఎన్ని డిబేట్లు జరిగాయో చూశాం. అయినా సందీప్ వంగా పట్ల ఇదేం ఏడుపో.
This post was last modified on April 18, 2024 3:46 pm
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…