ప్రభాస్ హీరోగా సెట్స్ మీదున్న సినిమాల్లో ది రాజా సాబ్ మీద అభిమానుల్లో ప్రత్యేక అంచనాలున్నాయి. యాక్షన్ వయొలెన్స్ కి దూరంగా ఒకనాటి వింటేజ్ డార్లింగ్ ని ఇందులో చూడబోతున్నామనే ఉత్సుకత వాళ్లలో విపరీతంగా ఉంది. దర్శకుడు మారుతీ ట్రాక్ రికార్డు కొంత కాలంగా ఆశించిన స్థాయిలో లేకపోయినా చేతికి బాహుబలి దొరికాడు కాబట్టి ఖచ్చితంగా ఓ రేంజ్ లో చూపిస్తాడనే నమ్మకం ఫ్యాన్స్ లో ఉంది. ఇవాళ మిరాయ్ టైటిల్ లాంచ్ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈవెంట్ లో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ తరఫున నిర్మాత విశ్వప్రసాద్ రాజా సాబ్ అప్ డేట్స్ గురించి ఓపెనయ్యారు.
కల్కి 2898 ఏడి రిలీజయ్యాకే ది రాజా సాబ్ కు సంబంధించిన ప్రమోషన్లు మొదలుపెడతామని చెప్పారు. ఇది మంచి స్ట్రాటజీ. ఎందుకంటే ఒక ప్యాన్ ఇండియా మూవీ విడుదలకు సిద్ధంగా ఉన్నప్పుడు అదే హీరో ఇంకో సినిమా గురించి ప్రచారం చేయడం పలురకాలుగా ఇబ్బంది పెడుతుంది. అందుకే కల్కి కోసం రాజా సాబ్ బృందం వెయిట్ చేస్తోంది. అలా అని షూటింగ్ అయిపోలేదు కానీ సగానికి పైగానే పూర్తయ్యిందని ఇన్ సైడ్ టాక్. తాతగా సంజయ్ దత్ కీలక పాత్ర పోషిస్తున్న రాజా సాబ్ కు తమన్ అందించే సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. సో కొంత కాలం వెయిట్ చేయాలి.
ది రాజా సాబ్ ఎప్పుడు రావొచ్చనే ప్రశ్నను విశ్లేషణ చేసుకుంటే ఈ ఏడాది ఉండదు. డిసెంబర్ ఒక ఆప్షన్ గా పెట్టుకుంటే క్రిస్మస్ ని లాక్ చేసుకున్న నితిన్ రాబిన్ హుడ్ తో పాటు అదే ప్లానింగ్ లో ఉన్న నాగచైతన్య తండేల్ ఆలోచనలో పడతాయి. ఒకవేళ సంక్రాంతికి లక్ష్యంగా పెట్టుకుకున్నా ప్రభాస్ ప్రాణ స్నేహితుల బ్యానర్ నుంచి చిరంజీవి విశ్వంభర వస్తుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో క్లాష్ అయ్యే సమస్యే ఉండదు. ప్రభాస్, చిరులు ఏదైనా అనూహ్య నిర్ణయం తీసుకుంటే తప్ప. ఈ లెక్కన ది రాజా సాబ్ వచ్చే ఏడాది మార్చి నుంచి వేసవి సెలవుల మధ్యలో ఏదో ఒకటి ఫిక్స్ చేసుకోవడం ఖాయం.
సమంత అసాధ్యం అనుకున్నది చేసి చూపించేసింది. ఈ రోజుతో మా ఇంటి బంగారం వంద కోట్ల గ్రాస్ క్లబ్బులో అడుగు…
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…