ప్రభాస్ హీరోగా సెట్స్ మీదున్న సినిమాల్లో ది రాజా సాబ్ మీద అభిమానుల్లో ప్రత్యేక అంచనాలున్నాయి. యాక్షన్ వయొలెన్స్ కి దూరంగా ఒకనాటి వింటేజ్ డార్లింగ్ ని ఇందులో చూడబోతున్నామనే ఉత్సుకత వాళ్లలో విపరీతంగా ఉంది. దర్శకుడు మారుతీ ట్రాక్ రికార్డు కొంత కాలంగా ఆశించిన స్థాయిలో లేకపోయినా చేతికి బాహుబలి దొరికాడు కాబట్టి ఖచ్చితంగా ఓ రేంజ్ లో చూపిస్తాడనే నమ్మకం ఫ్యాన్స్ లో ఉంది. ఇవాళ మిరాయ్ టైటిల్ లాంచ్ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈవెంట్ లో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ తరఫున నిర్మాత విశ్వప్రసాద్ రాజా సాబ్ అప్ డేట్స్ గురించి ఓపెనయ్యారు.
కల్కి 2898 ఏడి రిలీజయ్యాకే ది రాజా సాబ్ కు సంబంధించిన ప్రమోషన్లు మొదలుపెడతామని చెప్పారు. ఇది మంచి స్ట్రాటజీ. ఎందుకంటే ఒక ప్యాన్ ఇండియా మూవీ విడుదలకు సిద్ధంగా ఉన్నప్పుడు అదే హీరో ఇంకో సినిమా గురించి ప్రచారం చేయడం పలురకాలుగా ఇబ్బంది పెడుతుంది. అందుకే కల్కి కోసం రాజా సాబ్ బృందం వెయిట్ చేస్తోంది. అలా అని షూటింగ్ అయిపోలేదు కానీ సగానికి పైగానే పూర్తయ్యిందని ఇన్ సైడ్ టాక్. తాతగా సంజయ్ దత్ కీలక పాత్ర పోషిస్తున్న రాజా సాబ్ కు తమన్ అందించే సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. సో కొంత కాలం వెయిట్ చేయాలి.
ది రాజా సాబ్ ఎప్పుడు రావొచ్చనే ప్రశ్నను విశ్లేషణ చేసుకుంటే ఈ ఏడాది ఉండదు. డిసెంబర్ ఒక ఆప్షన్ గా పెట్టుకుంటే క్రిస్మస్ ని లాక్ చేసుకున్న నితిన్ రాబిన్ హుడ్ తో పాటు అదే ప్లానింగ్ లో ఉన్న నాగచైతన్య తండేల్ ఆలోచనలో పడతాయి. ఒకవేళ సంక్రాంతికి లక్ష్యంగా పెట్టుకుకున్నా ప్రభాస్ ప్రాణ స్నేహితుల బ్యానర్ నుంచి చిరంజీవి విశ్వంభర వస్తుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో క్లాష్ అయ్యే సమస్యే ఉండదు. ప్రభాస్, చిరులు ఏదైనా అనూహ్య నిర్ణయం తీసుకుంటే తప్ప. ఈ లెక్కన ది రాజా సాబ్ వచ్చే ఏడాది మార్చి నుంచి వేసవి సెలవుల మధ్యలో ఏదో ఒకటి ఫిక్స్ చేసుకోవడం ఖాయం.
This post was last modified on April 18, 2024 3:42 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…