ప్రభాస్ హీరోగా సెట్స్ మీదున్న సినిమాల్లో ది రాజా సాబ్ మీద అభిమానుల్లో ప్రత్యేక అంచనాలున్నాయి. యాక్షన్ వయొలెన్స్ కి దూరంగా ఒకనాటి వింటేజ్ డార్లింగ్ ని ఇందులో చూడబోతున్నామనే ఉత్సుకత వాళ్లలో విపరీతంగా ఉంది. దర్శకుడు మారుతీ ట్రాక్ రికార్డు కొంత కాలంగా ఆశించిన స్థాయిలో లేకపోయినా చేతికి బాహుబలి దొరికాడు కాబట్టి ఖచ్చితంగా ఓ రేంజ్ లో చూపిస్తాడనే నమ్మకం ఫ్యాన్స్ లో ఉంది. ఇవాళ మిరాయ్ టైటిల్ లాంచ్ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈవెంట్ లో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ తరఫున నిర్మాత విశ్వప్రసాద్ రాజా సాబ్ అప్ డేట్స్ గురించి ఓపెనయ్యారు.
కల్కి 2898 ఏడి రిలీజయ్యాకే ది రాజా సాబ్ కు సంబంధించిన ప్రమోషన్లు మొదలుపెడతామని చెప్పారు. ఇది మంచి స్ట్రాటజీ. ఎందుకంటే ఒక ప్యాన్ ఇండియా మూవీ విడుదలకు సిద్ధంగా ఉన్నప్పుడు అదే హీరో ఇంకో సినిమా గురించి ప్రచారం చేయడం పలురకాలుగా ఇబ్బంది పెడుతుంది. అందుకే కల్కి కోసం రాజా సాబ్ బృందం వెయిట్ చేస్తోంది. అలా అని షూటింగ్ అయిపోలేదు కానీ సగానికి పైగానే పూర్తయ్యిందని ఇన్ సైడ్ టాక్. తాతగా సంజయ్ దత్ కీలక పాత్ర పోషిస్తున్న రాజా సాబ్ కు తమన్ అందించే సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. సో కొంత కాలం వెయిట్ చేయాలి.
ది రాజా సాబ్ ఎప్పుడు రావొచ్చనే ప్రశ్నను విశ్లేషణ చేసుకుంటే ఈ ఏడాది ఉండదు. డిసెంబర్ ఒక ఆప్షన్ గా పెట్టుకుంటే క్రిస్మస్ ని లాక్ చేసుకున్న నితిన్ రాబిన్ హుడ్ తో పాటు అదే ప్లానింగ్ లో ఉన్న నాగచైతన్య తండేల్ ఆలోచనలో పడతాయి. ఒకవేళ సంక్రాంతికి లక్ష్యంగా పెట్టుకుకున్నా ప్రభాస్ ప్రాణ స్నేహితుల బ్యానర్ నుంచి చిరంజీవి విశ్వంభర వస్తుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో క్లాష్ అయ్యే సమస్యే ఉండదు. ప్రభాస్, చిరులు ఏదైనా అనూహ్య నిర్ణయం తీసుకుంటే తప్ప. ఈ లెక్కన ది రాజా సాబ్ వచ్చే ఏడాది మార్చి నుంచి వేసవి సెలవుల మధ్యలో ఏదో ఒకటి ఫిక్స్ చేసుకోవడం ఖాయం.
This post was last modified on April 18, 2024 3:42 pm
అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో అటవీ శాఖ అధికారుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ…
రాజకీయాలంటే అంతే. అడుగుపెట్టాక చాలా బురదను కడుక్కోవాల్సి ఉంటుంది. కొందరు తట్టుకుంటారు. కొందరు వదిలేస్తారు. చిరంజీవి ప్రజారాజ్యం విషయంలో ఎక్కడైతే…
అభిమానులందు పవన్ అభిమానులు వేరయా అంటే అందులో అతిశయోక్తి ఏమీ లేదు. ఆయనకున్న లాయల్ ఫ్యాన్ బేస్ ఇండియా మొత్తంలో…
బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తనకి ఎన్నో…
వందల కోట్లతో ప్యాన్ ఇండియా మూవీస్ తీస్తున్నప్పుడు పెద్ద ఎత్తున ప్రమోషన్లు అవసరం. ఎవరికైనా ఇది తప్పదు. ఎప్పుడో 2027…
కొన్నేళ్ల ముందు నందమూరి తారకరత్న ఒక రాజకీయ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా గుండెపోటుకు గురి కావడం, కొన్ని రోజుల పాటు…