ఈ మధ్య కాలంలో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ మొత్తంలో సందీప్ రెడ్డి వంగ మూవీ ‘యానిమల్’ స్థాయిలో మరేదీ వివాదాస్పదం కాలేదు. ఒక సినిమాలోని అంశాల మీద ఏదైనా ఒక వర్గం మనోభావాలు దెబ్బ తినడం.. విమర్శలు గుప్పించడం మామూలే. కానీ బయటి వాళ్లు కాకుండా సినిమా ఇండస్ట్రీలోని వాళ్లే ఒక చిత్రాన్ని తూర్పారబట్టడం.. తీవ్ర స్థాయిలో బహిరంగంగా విమర్శలు చేయడం అరుదు. ‘యానిమల్’ విషయంలో అదే జరిగింది.
బాలీవుడ్ లెజెండరీ రైటర్లలో ఒకరైన జావెద్ అక్తర్ సహా చాలామంది ఈ చిత్రంలోని అంశాలను తప్పుబట్టారు. ఇందులో సన్నివేశాలను తీవ్రంగా తప్పుబట్టారు. పురుషాధిక్యత, మహిళలపై దురహంకారాన్ని గ్లోరిఫై చేసేలా సినిమా ఉందంటూ విమర్శలు గుప్పించారు. ఇటీవలే హీరో సిద్దార్థ్ సైతం ‘చిత్తా’ లాంటి మంచి సినిమా విషయంలో అభ్యంతరాలు చెప్పిన వాళ్లు ‘యానిమల్’ను మాత్రం ఎగబడి చూశారంటూ పరోక్షంగా కౌంటర్లు వేశారు. కాగా ఇప్పుడు ఓ బాలీవుడ్ నటుడు, సివిల్ సర్వెంట్ ‘యానిమల్’ మీద తీవ్ర విమర్శలు గుప్పించాడు. అతనే.. వికాస్ దివ్య కీర్తి. ఈ మధ్య బ్లాక్ బస్టర్ అయిన ‘12th fail’ సినిమాలో ఈ నటుడు ఓ కీలక పాత్ర పోషించాడు.
వికాస్ ఐఏఎస్ అధికారి, విద్యా ఉద్యమకారుడు కూడా. ఆయన ‘యానిమల్’ సినిమాలో చూపించిన అంశాల మీద తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశాడు. ఈ సినిమా సమాజాన్ని పదేళ్లు వెనక్కి తీసుకెళ్లిందని విమర్శించాడు. ఇలాంటి సినిమాలు తీయడం తప్పు అన్నాడు. సినిమాలో ఒక చోట రణబీర్.. త్రిప్తి దిమిరిని షూ నాకమని అడుగుతాడని.. అలాంటివి చూసి నిజ జీవితంలో కూడా చాలామంది మగాళ్లు ఆడవాళ్లను అలా ఆదేశిస్తారని వికాస్ అన్నాడు. ఏ సినిమాలో అయినా కొంత సామాజిక బాధ్యత ఉండాలని.. కేవలం డబ్బుల కోసమే తీస్తే ఇలాంటి సినిమాలే వస్తాయని ఆయన వ్యాఖ్యానించాడు.
This post was last modified on April 17, 2024 8:54 pm
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…