భారతీయ సినిమా ప్యాన్ ఇండియాని మించి ప్రతి విషయంలో ముందడుగు వేసేందుకు పరుగులు పెడుతోంది. కలగా మిగిలిపోయిన ఆస్కార్ ని సాధించాం. ఓవర్సీస్ లో హాలీవుడ్ మూవీస్ కి ధీటుగా ఆడే బ్లాక్ బస్టర్లను తీస్తున్నాం. ఇంకా ఎదిగేందుకు ఏమేం అవకాశాలు ఉన్నాయో దేన్నీ వదిలి పెట్టడం లేదు. ఇప్పుడో కొత్త మైలురాయి దక్కింది. ఇప్పటిదాకా మనం స్క్రీన్ మీద చూస్తున్న అత్యున్నత సాంకేతిక 4K రెజోల్యూషన్. అందుబాటులో 8K ఉంది కానీ మన దేశంలో ఐమాక్స్ తో సహా మెజారిటీ థియేటర్లన్నీ ఫోర్ కెతో నడుస్తున్నవే. ఈ టెక్నాలజీని టీవీలు కూడా వాడుతున్నాయి.
అలాంటిది 12K రిజొల్యూషన్ అంటే ఎలా ఉంటుందో ఊహించుకోగలమా. అది కూడా ఒక పాత సినిమాకి. చెన్నైకు చెందిన ప్రసాద్ కార్పొరేషన్ సంస్థ దాన్ని సాధ్యం చేసింది. 2000 సంవత్సరంలో రిలీజైన కమల్ హాసన్ హే రామ్ ని అప్ గ్రేడ్ చేసి భవిష్యత్తు తరాల కోసం సరికొత్త ప్రింట్ ని సిద్ధం చేసి ఉంచింది. అంటే తెరమీద ప్రతి ఒక్క డీటెయిల్ స్పష్టమైన నాణ్యతతో ఎన్ని వందల ఇంచుల స్క్రీన్ అయినా సరే ఏ మాత్రం చెక్కుచెదరకుండా కనిపిస్తుంది. ఒకరకంగా చెప్పాలంటే నిజంగానే ఇది ఇరవై సంవత్సరాల క్రితం తీసిన సినిమానేనా అని అనుమానం వచ్చేంత గొప్పగా ఉంటుంది.
కొన్నేళ్ల క్రితమే హే రామ్ ని 4Kకి మార్చి తమిళనాడులో రీ రిలీజ్ చేశారు. దురదృష్టవశాత్తు తెలుగులో మాత్రం ఈ సినిమా ఎందుకో అందుబాటులో లేకుండా పోయింది. మూవీ లవర్స్ మాత్రం కనీసం ఇప్పటికైనా డబ్బింగ్ వెర్షన్ ని అందివ్వమని కోరుతున్నారు. హే రామ్ వివాదాస్పద గాంధీ మరణం చుట్టూ తిరిగే కథతో కమల్ హాసన్ స్వీయ దర్శకత్వంలో రూపొందింది. షారుఖ్ ఖాన్ ప్రత్యేక పాత్రలో నటించగా ఇళయరాజా సంగీతం ప్రాణం పోసింది. మూడున్నర గంటల నిడివి ఉన్నా అద్భుతమైన నెరేషన్ తో కట్టి పారేస్తుంది. ఒరిజినల్ వెర్షన్ అఫీషియల్ గానే యూట్యూబ్ లో చూడొచ్చు.
This post was last modified on April 17, 2024 10:06 am
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…