టాలీవుడ్ కు పుష్పతో పరిచయమైన ఫహద్ ఫాసిల్ ఆ తరువాత ఓటిటిలో బోలెడు డబ్బింగ్ సినిమాల ద్వారా మన ప్రేక్షకులకు మరింత చేరువయ్యాడు. పోలీస్ ఆఫీసర్ భన్వర్ సింగ్ షెకావత్ గా నున్నని గుండుతో, బయటికి కనిపించని క్రూరత్వాన్ని కళ్ళతోనే పలికించే పాత్రలో ఎంతగా మెప్పించాడో మళ్ళీ చెప్పనక్కర్లేదు. పార్టీ లేదా పుష్ప అంటూ ఫహద్ చెప్పే డైలాగ్ ఒక మీమ్ కంటెంట్ గా మారిపోయింది. అయితే పుష్ప 1లో తన క్యారెక్టర్ ని కేవలం గంటలోపు నిడివికే పరిమితం చేశాడు సుకుమార్. కథ ప్రకారం లేట్ ఎంట్రీ అయినా ఉనికిని చాటుకోవడంలో ఫహద్ సక్సెసయ్యాడు.
మరి పుష్ప 2 ది రూల్ లో ఎంత లెన్త్ ఉంటాడనేది అభిమానుల్లో పెద్ద సస్పెన్స్ గా మారింది. అంతర్గత సమాచారం మేరకు ఈసారి భన్వర్ సింగ్ షెకావత్ అసలు రూపం చూడబోతున్నామట. పుష్పరాజ్ చేతిలో భంగపడ్డ అనసూయ, సునీల్, ధనుంజయ్ లు ఒక ముఠాగా ఏర్పడి తోడుగా జగపతిబాబుని తెచ్చుకుంటారు. వీళ్ళను సమన్వయపరుస్తూ స్మగ్లింగ్ మాఫియాను వెనుక నుండి నడిపిస్తునే పగతో రగిలిపోతున్న భన్వర్ అవకాశం దొరికినప్పుడంతా పుష్పని దెబ్బ కొడుతూనే ఉంటాడు. కొన్నిసార్లు అవి చాలా తీవ్రంగా ఉంటాయి. ఈ క్లాష్ కు సంబంధించిన ఎపిసోడ్స్ కీలకం కాబోతున్నాయి.
సో అంచనాలకు మించే పుష్ప వర్సెస్ భన్వర్ సింగ్ షెకావత్ పాత్ర ఉంటుందని టాక్. ఆగస్ట్ 15 విడుదల కాబోతున్న ఈ బ్లాక్ బస్టర్ సీక్వెల్ కి బిజినెస్ క్రేజ్ పీక్స్ లో ఉంది. దానికి తోడు ఫహద్ ఫాసిల్ మార్కెట్ ఇటీవలి బ్లాక్ బస్టర్ ఆవేశంతో మరింత ఎగబాకింది. దీంతోష్ సహజంగానే బన్నీతో తన కాంబో మీద హైప్ మాములుగా ఉండదు. దర్శకుడు సుకుమార్ షాకింగ్ ఎలిమెంట్స్ చాలానే ప్లాన్ చేసినట్టు తెలిసింది. పుష్ప 3 ఉందనే ప్రచారం జరుగుతోంది కానీ ఫహద్ ఫాసిల్ పోషిస్తున్న క్యారెక్టర్ మాత్రం ఈ సెకండ్ పార్ట్ వరకే పరిమితమని అంటున్నారు. తన పాత్ర మీద ప్రత్యేక టీజర్ వస్తుందట.
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…