టాలీవుడ్ కు పుష్పతో పరిచయమైన ఫహద్ ఫాసిల్ ఆ తరువాత ఓటిటిలో బోలెడు డబ్బింగ్ సినిమాల ద్వారా మన ప్రేక్షకులకు మరింత చేరువయ్యాడు. పోలీస్ ఆఫీసర్ భన్వర్ సింగ్ షెకావత్ గా నున్నని గుండుతో, బయటికి కనిపించని క్రూరత్వాన్ని కళ్ళతోనే పలికించే పాత్రలో ఎంతగా మెప్పించాడో మళ్ళీ చెప్పనక్కర్లేదు. పార్టీ లేదా పుష్ప అంటూ ఫహద్ చెప్పే డైలాగ్ ఒక మీమ్ కంటెంట్ గా మారిపోయింది. అయితే పుష్ప 1లో తన క్యారెక్టర్ ని కేవలం గంటలోపు నిడివికే పరిమితం చేశాడు సుకుమార్. కథ ప్రకారం లేట్ ఎంట్రీ అయినా ఉనికిని చాటుకోవడంలో ఫహద్ సక్సెసయ్యాడు.
మరి పుష్ప 2 ది రూల్ లో ఎంత లెన్త్ ఉంటాడనేది అభిమానుల్లో పెద్ద సస్పెన్స్ గా మారింది. అంతర్గత సమాచారం మేరకు ఈసారి భన్వర్ సింగ్ షెకావత్ అసలు రూపం చూడబోతున్నామట. పుష్పరాజ్ చేతిలో భంగపడ్డ అనసూయ, సునీల్, ధనుంజయ్ లు ఒక ముఠాగా ఏర్పడి తోడుగా జగపతిబాబుని తెచ్చుకుంటారు. వీళ్ళను సమన్వయపరుస్తూ స్మగ్లింగ్ మాఫియాను వెనుక నుండి నడిపిస్తునే పగతో రగిలిపోతున్న భన్వర్ అవకాశం దొరికినప్పుడంతా పుష్పని దెబ్బ కొడుతూనే ఉంటాడు. కొన్నిసార్లు అవి చాలా తీవ్రంగా ఉంటాయి. ఈ క్లాష్ కు సంబంధించిన ఎపిసోడ్స్ కీలకం కాబోతున్నాయి.
సో అంచనాలకు మించే పుష్ప వర్సెస్ భన్వర్ సింగ్ షెకావత్ పాత్ర ఉంటుందని టాక్. ఆగస్ట్ 15 విడుదల కాబోతున్న ఈ బ్లాక్ బస్టర్ సీక్వెల్ కి బిజినెస్ క్రేజ్ పీక్స్ లో ఉంది. దానికి తోడు ఫహద్ ఫాసిల్ మార్కెట్ ఇటీవలి బ్లాక్ బస్టర్ ఆవేశంతో మరింత ఎగబాకింది. దీంతోష్ సహజంగానే బన్నీతో తన కాంబో మీద హైప్ మాములుగా ఉండదు. దర్శకుడు సుకుమార్ షాకింగ్ ఎలిమెంట్స్ చాలానే ప్లాన్ చేసినట్టు తెలిసింది. పుష్ప 3 ఉందనే ప్రచారం జరుగుతోంది కానీ ఫహద్ ఫాసిల్ పోషిస్తున్న క్యారెక్టర్ మాత్రం ఈ సెకండ్ పార్ట్ వరకే పరిమితమని అంటున్నారు. తన పాత్ర మీద ప్రత్యేక టీజర్ వస్తుందట.
This post was last modified on April 16, 2024 5:48 pm
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…