వెతకాలే కానీ కొన్ని సెలబ్రిటీల నిజ జీవిత కథల్లో ఊహకందని డ్రామా ఉంటుంది. దాన్ని సరైన రీతిలో తెరకెక్కిస్తే ఆదరణ దక్కడం ఖాయం. అలాంటిదే నిన్న నెట్ ఫ్లిక్స్ లో నేరుగా విడుదలైన అమర్ సింగ్ చమ్కీలా. లవ్ ఆజ్ కాల్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన ఇంతియాజ్ అలీ దర్శకత్వంలో దిల్ జిత్ దోసాంజ్ టైటిల్ రోల్ పోషించగా లెజెండరీ ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూర్చారు. పరిణితి చోప్రా హీరోయిన్. వివాదాస్పద గాయకుడిగా పేరున్న ఈ సింగర్ జీవితాన్ని రెండున్నర గంటల్లో చూపించిన వైనం ఆశ్చర్యపరచడమే కాదు షాక్ ఇచ్చే ఎన్నో సంగతులు చెప్పింది.
1988లో పంజాబ్ రాష్ట్రం మెహసంపూర్ గ్రామానికి ప్రోగ్రాం ఇవ్వడానికి వెళ్లిన చమ్కీలా, అతని రెండో భార్య అమర్ జీత్ ఇద్దరినీ పట్టపగలు కొందరు దుండగులు కాల్చి చంపేస్తారు. బూతు సాహిత్యంతో కూడిన పాటలు స్వంతంగా రాసుకుని పాడే చమ్కీలా వాటి ద్వారానే విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. క్లాసు మాసు తేడా లేకుండా ప్రతి చోట ఇతని ఆల్బమ్స్ మారుమ్రోగిపోయేవి. వీటిని మానేయమని మత పెద్దలు, మిలిటెంట్లు హెచ్చరించినా మానుకోడు. దీంతో చివరికి చావును కొని తెచ్చుకుంటారు. అయితే హత్య చేసిన నిందితులు ఎప్పటికీ దొరక్కపోవడం అంతు చిక్కని రహస్యం.
ఎంత గొప్ప టాలెంట్ ఉన్నా వివాదాలతోనే ఎక్కువ పాపులరైన చమ్కీలా లైఫ్ లో బోలెడు నాటకీయత ఉంటుంది. మొదటి భార్యకు చెప్పకుండా రెండో పెళ్లి చేసుకోవడం, బీడీలు తాగే అలవాటు, పంచాయితీ పెద్దలను తెలివిగా ఏమార్చడం ఇలా వ్యక్తిగత జీవితంలోనూ సినిమాని మించిన డ్రామా నడిపించాడు. ఆడియో కంపెనీలకు పంజాబీ సంగీతం కోట్లు కురిపించగలదని ఋజువు చేసిన వాళ్లలో అమర్ సింగ్ చమ్కీలా ప్రముఖుడు. కేవలం 28 సంవత్సరాల చిన్న వయసులో భార్యతో సహా దుర్మార్గుల చేతిలో కన్ను మూయడం మర్చిపోలేని విషాదం. అందుకే ఈ బయోపిక్ మీద ప్రశంసలు కురుస్తున్నాయి.
This post was last modified on April 13, 2024 12:32 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…