కొన్ని రోజుల కిందట బాలీవుడ్ మార్కెటింగ్ స్ట్రాటజిస్ట్ కావేరి బరువా.. టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ గురించి చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారం రేపాయో తెలిసిందే. అల్లు అర్జున్ను కలవబోతే.. ఆయన కళ్లలోకి కళ్లు పెట్టి చూడకూడదు, సార్ అనే పిలవాలి, షేక్ హ్యాండ్ ఇవ్వకూడదు.. అంటూ ‘డూస్ అండ్ డోంట్స్’తో 42 పాయింట్లు ఇచ్చారంటూ ఆమె చేసిన వ్యాఖ్యలపై బన్నీ టీం తీవ్రంగా స్పందించింది.
ఈ వ్యాఖ్యలను ఖండించడమే కాక.. కావేరి మీద, తనతో పాడ్ కాస్ట్ చేసిన స్వీకృతి మీద న్యాయపరమైన చర్యలకు కూడా సిద్ధమైంది. వీళ్లిద్దరి మీద అల్లు అర్జున్ అభిమానులు సోషల్ మీడియాలో గట్టిగానే దాడి చేశారు. మరోవైపు కావేరి వ్యాఖ్యలను అందిపుచ్చుకున్న బన్నీ యాంటీ ఫ్యాన్స్.. అతణ్ని సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేశారు. ఇలా ఒక వారం పాటు వ్యవహారం నాని.. తర్వాత సద్దుమణిగింది.
కాగా ఇప్పుడు కావేరి, స్వీకృతి.. అల్లు అర్జున్కు బేషరతుగా క్షమాపణ చెబుతూ ప్రెస్ నోట్స్ రిలీజ్ చేశారు. సరిగా వెరిఫై చేసుకోకుండా అల్లు అర్జున్ మీద ఆ వ్యాఖ్యలు చేశానని.. వాటి పట్ల చింతిస్తున్నానని.. ఆ కామెంట్స్ వెనక్కి తీసుకుంటున్నానని కావేరి స్పష్టం చేశారు. .. తాను మాటల ఫ్లోలో ఆ వ్యాఖ్యలు చేశానన్నారు. అంతే తప్ప తనకు వేరే ఉద్దేశాలేమీ లేవని ఆమె పేర్కొన్నారు.
డూస్ అండ్ డోంట్స్ అంటూ 42 పాయింట్లతో ఎవ్వరూ నోట్ తనకు ఇవ్వలేదని.. సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న లిస్ట్ కూడా నిజమైంది కాదని ఆమె స్పష్టం చేసింది. బన్నీకి తాను మనస్ఫూర్తిగా క్షమాపణ చెబుతున్నట్లు పేర్కొన్న కావేరి.. ఆయన హార్డ్ వర్క్ను తాను ఎంతో గౌరవిస్తానని పేర్కొన్నారు.
మరోవైపు స్వీకృతి మాట్లాడుతూ.. అల్లు అర్జున్ మీద కావేరి వ్యాఖ్యలకు సంబంధించిన అన్ని వీడియోలు సోషల్ మీడియా నుంచి డెలీట్ చేశామన్న స్వీకృతి.. తాను కూడా బన్నీకి బేషరతుగా క్షమాపణ చెబుతున్నట్లు పేర్కొన్నారు. ఈ వ్యవహారాన్ని ఇంతటితో ముగించాలని ఆమె కోరారు.
This post was last modified on February 17, 2026 1:11 pm
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…
ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికాల యుద్ధం మన దేశంపై కూడా ప్రభావం చూపుతోంది. పెట్రోల్, డీజిల్ తో పోలిస్తే ఎల్పీజీ…
లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సాగుతోంది. ఇలా లోక్సభ స్పీకర్పై తమకు విశ్వాసం…
ఉస్తాద్ భగత్ సింగ్ కౌంట్ డౌన్ సంవత్సరాలు, నెలల నుంచి కేవలం ఏడు రోజులకు వచ్చేసింది. ముందు రోజు ప్రీమియర్లు…
అత్యంత కీలకమైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు డుమ్మా కొట్టిన జగన్…ఆ తర్వాత అడపాదడపా మీడియా ముందుకు వచ్చి వెళుతున్న సంగతి…