గత ఏడాది తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ విడుదల టైంలో పెద్దగా అంచనాలేం లేవు. తమిళ వెర్షన్ ఏమో కానీ తెలుగు డబ్బింగ్ హక్కులను తక్కువకు విక్రయించి రికవరీ అయితే చాలు అదే గొప్పనుకున్న మాట అబద్దం కాదు. కట్ చేస్తే అంచనాలకు మించి ఆడి బ్లాక్ బస్టర్ సాధించి నలభై కోట్లకు పైగా ఏపీ, తెలంగాణకు కలిపి వసూలు చేయడం అనూహ్యం. అందుకే సీక్వెల్ మీద ఎక్కడ లేని హైప్ ఉంది. లాల్ సలామ్ ఘోరమైన డిజాస్టర్ అయినా సరే కేవలం రజని ఒక్కడే దానికి బాద్యుడు కాదు కాబట్టి మార్కెట్ మీద అంత ప్రభావం ఉండేలా లేదు. కానీ జైలర్ బ్రాండ్, కథా కమామీషు వేరే.
తాజా అప్డేట్ ప్రకారం జైలర్ 2 టైటిల్ మారబోతోంది. సినిమాలోని బాగా పాపులర్ అయిన హుకుమ్ పదాన్ని పేరుగా నిర్ణయించాలని ప్రాథమికంగా నిర్ణయించుకున్నట్టు తెలిసింది. దీనికి తలైవర్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందట. ప్రస్తుతం డ్రాఫ్ట్ సిద్ధం చేసిన దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ రజని చెప్పిన కొన్ని కీలక మార్పుల మీద వర్క్ చేస్తున్నాడు. అవి ఓకే కాగానే జూన్ నుంచే షూటింగ్ మొదలుపెట్టేలా ప్రణాళికలు రెడీ చేస్తున్నాడు. ఈసారి సన్ పిక్చర్స్ బడ్జెట్ ని పెద్ద ఎత్తున పెంచబోతోంది. లొకేషన్లు, క్యాస్టింగ్ వేరే లెవెల్ లో అత్యంత భారీగా ఉంటాయట.
జైలర్ మొదటి భాగంలో కొడుకు, మెయిన్ విలన్ చనిపోయారు కాబట్టి వాళ్ళ స్థానంలో కొత్త పాత్రల మీద ప్రత్యేక కసరత్తు జరుగిందట. శివరాజ్ కుమార్ పోషించిన నరసింహ పాత్రను పొడిగించి, మోహన్ లాల్ ని కొంత మేర వాడుకునేలా ప్లాన్ చేసినట్టు వినికిడి. హీరోయిన్ అవసరం లేదు కాబట్టి వయసు మళ్ళిన ముత్తువేల్ పాండియన్ విగ్రహాల దొంగలను కాకుండా ఈసారి మెడికల్ మాఫియా పని పట్టేలా డిఫరెంట్ బ్యాక్ గ్రౌండ్ సెట్ చేశారట. అనిరుద్ సంగీతం సమకూర్చబోతున్నాడు. లోకేష్ కనగరాజ్ తో రజని 171 రిలీజ్ అయ్యాకే హుకుమ్ ని విడుదల చేసే ఛాన్స్ ఉంది.
This post was last modified on April 12, 2024 10:55 pm
ప్రభాస్ అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్న స్పిరిట్ కు రంగం సిద్ధమవుతోంది. చేతిలో ఉన్న ఫౌజీ, ది రాజా సాబ్…
రెండేళ్ల క్రితం బేబీ రిలీజ్ ముందు వరకు తనెవరో పెద్దగా పరిచయం లేని పేరు. అల వైకుంఠపురములో అల్లు అర్జున్…
తమిళనాట అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ... అధికార డీఎంకేలో ఫుల్ జోష్ నింపే పరిణామం ఒకటి శనివారం జరిగింది. సుప్రీంకోర్టులో రెండేళ్లుగా…
హర్యానాలోని సోనిపట్లో ఉన్న ఓపీ జిందాల్ విశ్వవిద్యాలయంలో ఓ విద్యార్థి చేసిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ అవుతోంది.…
మాజీ ఉప రాష్ట్రపతి, బీజేపీ నాయకుడు ముప్పవరపు వెంకయ్యనాయుడు.. తాజాగా అటు తెలంగాణ, ఇటు ఏపీ నేతలపై సెటర్లు గుప్పించారు.…
కొన్నిసార్లు బాక్సాఫీస్ ఫలితాలు అనూహ్యంగా ఉంటాయి. టాక్ తేడాగా వచ్చినా, జనానికి పూర్తిగా నచ్చకపోయినా కలెక్షన్లు మాత్రం భీభత్సంగా వచ్చేస్తాయి.…