మూడేళ్లకుపైగా వాయిదా పడుతూ వచ్చిన మైదాన్ ఎట్టకేలకు థియేటర్లలో అడుగు పెట్టింది. అజయ్ దేవగన్ హీరోగా బోనీ కపూర్ నిర్మించిన ఈ స్పోర్ట్స్ డ్రామా మీద ముందు నుంచి పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. పోటీగా బడేమియా చోటేమియా లాంటి యాక్షన్ ఎంటర్ టైనర్ ఉన్నప్పటికీ ఆడియన్స్ అధిక శాతం దీనివైపే ఆసక్తి చూపారు. రిలీజ్ డేట్ ఇవాళ అయినప్పటికీ కంటెంట్ మీద నమ్మకంతో ముందు రోజు సాయంత్రం నుంచే ప్రీమియర్లు వేశారు. ప్రియమణి భార్య పాత్రలో నటించగా భారీ బడ్జెట్ తో అమిత్ శర్మ దర్శకత్వంలో రూపొందించారు. ఇంతకీ పీరియాడిక్ బయోపిక్ ఎలా ఉందో లుక్ వేద్దాం.
1952 ఒలంపిక్స్ లో ఇండియన్ ఫుట్ బాల్ టీమ్ యుగోస్లేవియా చేతిలో దారుణంగా ఓడిపోతుంది. దీంతో హైదరాబాద్ కు చెందిన కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీం (అజయ్ దేవగన్) వివిధ నగరాలు తిరిగి బెస్ట్ టాలెంట్ ని వెతికి పట్టుకుంటాడు. ఎంత బాగా ఆడించినా గెలుపు తీరాలకు చేరలేకపోతాడు. దీంతో ఉద్యోగం పోతుంది. ఈలోగా ఆరోగ్యానికి సంబంధించి ఒక భయంకర నిజం తెలుస్తుంది. ఎలాగైనా దేశాన్ని విజేతగా నిలపాలని కమిటీని, ప్రభుత్వాన్ని ఒప్పించిన రహీం 1962 ఏషియన్ గేమ్స్ కు కొత్త బృందాన్ని తీసుకెళ్తాడు. ఎన్నో ప్రతికూల పరిస్థితుల మధ్య బలమైన ప్రత్యర్థిని ఓడించి 47 కోట్ల ప్రజల కలను నిజం చేస్తాడు.
ఇలాంటి నేపథ్యం ఉన్న సినిమాలు ఎన్నో వచ్చినప్పటికీ మైదాన్ వాటికి భిన్నంగా నిలవడానికి కారణం ఇది స్వాతంత్రం వచ్చిన తొలినాళ్ళలో జరిగిన నిజమైన కథ కావడం. కమర్షియల్ అంశాలు ఆశించే వాళ్లకు అంత రుచించకపోవచ్చు కానీ ఎమోషన్స్ ని లైట్ గా టచ్ చేస్తూ ఓవర్ డ్రామా లేకుండా సింగల్ పాయింట్ మీద అమిత్ శర్మ నడిపించిన తీరు ఆకట్టుకుంది. ఏఆర్ రెహమాన్ బిజిఎం, ఆర్ట్ డిపార్ట్ మెంట్ పనితనం కవచంలా నిలబడ్డాయి. లగాన్, చక్ దే ఇండియా స్థాయిలో గూస్ బంప్స్ ఇవ్వకపోవచ్చు కానీ దేశభక్తి కూడిన బరువైన భావోద్వేగం ఇవ్వడంలో మైదాన్ ఫెయిలవ్వలేదు.
This post was last modified on April 11, 2024 10:10 am
అమెరికాను నెంబర్ వన్ చేయాలన్న పేరుతో ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటూ.. ప్రపంచాన్ని ఆగమాగం చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇమేజ్…
‘అమరావతి’ని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా నిర్ణయిస్తూ ఏపీ అసెంబ్లీ పెట్టిన తీర్మానం మీద ఇటీవలే ఒక టీవీ ఛానెల్లో చర్చా…
కంటెంట్ మీద ఎంత నమ్మకం ఉన్నా ప్రీమియర్ల విషయంలో నిర్మాతలు ఒకటికి పదిసార్లు ఆలోచించే పరిస్థితులు ఇప్పుడున్నాయి. కొన్నిసార్లు ఈ…
జివి ప్రకాష్ కుమార్ మనకూ బాగా సుపరిచితుడైన సంగీత దర్శకుడు. తమిళంలో అయితే రెగ్యులర్ గా హీరోగా కూడా నటిస్తూ…
ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్లాన్-బీ’గా మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాన్ని…
టాలీవుడ్ టాప్ స్టార్లందరూ తమ సినిమా రిలీజ్ ముంగిట డ్రగ్ టెస్టులు చేసుకోవాలని.. అప్పుడే ఆ సినిమాలు రిలీజ్ అయ్యేలా…