టాలీవుడ్ లోనే కాదు ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ప్యాన్ వరల్డ్ మూవీ కల్కి 2898 ఏడి విడుదల తేదీ విషయంలో సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది. వచ్చే వారం ఏప్రిల్ 17 డేట్ ని ప్రకటించబోతున్నట్టు చెబుతున్నారు కానీ అంతర్గత సమాచారం ప్రకారం రెండు ఆప్షన్లు పెట్టుకుని వాటి మీద చర్చలు జరుపుతున్నారట. వాటిలో మొదటిది మే 30. డిస్ట్రిబ్యూటర్లు తొలుత దీనికి సానుకూలంగా ఉన్నప్పటికీ దానికన్నా మెరుగైన ప్రత్యాన్మయం చూడమంటే జూన్ 20 గురించి అనాలిసిస్ చేసే పనిలో ఉన్నట్టు వినికిడి. ఇవి కాకుండా వేరేదయ్యే ఛాన్స్ లేదు.
మెజారిటీ శాతం జూన్ 20 వైపే మొగ్గు చూపొచ్చని వినిపిస్తోంది. ఆ రోజు దేశీయంగా, అంతర్జాతీయంగా ఎలాంటి రిలీజులు లేవు. ముఖ్యంగా ఓవర్సీస్ లో ఇబ్బందిగా మారే హాలీవుడ్ మూవీస్ ఏవీ షెడ్యూల్ కాలేదు. అప్పటికప్పుడు వచ్చే సీన్ కూడా ఉండదు. సో భారీ ఎత్తున ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ స్క్రీన్లు రాబట్టుకునే ఛాన్స్ ఉంటుంది. పోటీని పట్టించుకోకుండా వెళ్లడం వల్లే సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ కు ఆక్వామెన్ 2 ఫాలెన్ కింగ్ డం నుంచి వచ్చిన అడ్డంకి చిన్నది కాదు. అది ఫ్లాప్ అయ్యింది కాబట్టి సరిపోయింది కానీ లేదంటే ప్రభాస్ సినిమా వసూళ్లకు ఇంకా గండి పడేది.
ఇవన్నీ పరిగణనలోకి తీసుకునే కల్కి 2898 డేట్ ఫిక్స్ చేయబోతున్నారు. ప్రస్తుతం షూటింగ్ దాదాపు పూర్తయినట్టే. ఇవాళో రేపో గుమ్మడికాయ కొట్టడం ఖాయమని యూనిట్ నుంచి వినిపిస్తున్న మాట. షూట్ జరిగిన భాగానికి విఎఫ్ఎక్స్ పనులు ఆల్రెడీ జరుగుతున్నాయి. దర్శకుడు నాగఅశ్విన్ ప్రతిదీ ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నాడు. దీపికా పదుకునే, దిశా పటాని హీరోయిన్లుగా నటించిన ఈ ఫాంటసీ డ్రామాలో కమల్ హాసన్ అతిథిగా నటించానని చెప్పి షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అమితాబ్ బచ్చన్ పాత్ర కూడా స్పెషల్ గా ఉంటుందట. వెయ్యి కోట్లకు పైగా బిజినెస్ అంచనాలున్నాయి.
This post was last modified on April 10, 2024 6:48 pm
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…