Movie News

నిశ్శబ్దం.. డీల్ డన్.. డేట్ ఫిక్స్?

దక్షిణాదిన థియిేట్రికల్ రిలీజ్‌ను స్కిప్ చేసి నేరుగా ఓటీటీల్లో రిలీజైన అతి పెద్ద సినిమా అంటే ‘వి’నే. ఈ సినిమా ఇలా ముందుకు రాగానే.. మరికొన్ని పేరున్న సినిమాలు ఓటీటీ రిలీజ్‌కు సై అనేశాయి. వాటిలో ప్రముఖంగా వినిపించిన పేరు.. నిశ్శబ్దం. అనుష్క ప్రధాన పాత్రలో హేమంత్ మధుకర్ రూపొందించిన ఈ చిత్రం ఓటీటీలోకి వస్తుందని ఎప్పట్నుంచో ప్రచారం జరుగుతోంది.

ఇందులో నిర్మాణ భాగస్వామి అయిన కోన వెంకట్ కూడా ఈ దిశగా ఈ మధ్య సంకేతాలు ఇచ్చాడు. కానీ ఇప్పటిదాకా అధికారిక ప్రకటన అయితే రాలేదు. మంచి డీల్ కోసం ఓటీటీలతో చిత్ర బృందం చర్చలు జరుపుతోందని, త్వరలోనే డీల్ ఓకే అవుతుందని ఇండస్ట్రీ జనాలు చెప్పుకుంటూ వచ్చారు. ఐతే ఎట్టకేలకు డీల్ ఓకే అయిందని.. రిలీజ్ డేట్ కూడా దాదాపు ఖరారైందని.. అతి త్వరలో ఈ మేరకు ప్రకటన కూడా రాబోతోందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం.

ఒక టాప్ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ‘నిశ్శబ్దం’ సినిమాను రిలీజ్ చేయడానికి అగ్రిమెంట్ కుదుర్చుకుందని.. అక్టోబరు 2న గాంధీ జయంతి కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేయొచ్చని అంటున్నారు. దక్షిణాది సినిమాలపై ఎక్కువగా పెట్టుబడులు పెడుతున్న అమేజాన్ ప్రైమ్ వాళ్లే ఈ సినిమాను సొంతం చేసుకుని ఉండొచ్చని భావిస్తున్నారు. అక్టోబరు 2న రాజ్ తరుణ్ సినిమా ‘ఒరేయ్ బుజ్జిగా’ను ‘ఆహా’లో రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే.

ఐతే ‘నిశ్శబ్దం’తో పోలిస్తే అది చిన్న సినిమా కావడం, పైగా థియేటర్లలో మాదిరి క్లాష్‌కు అవకాశం లేదు కాబట్టి అదే రోజు అనుష్క సినిమాను రిలీజ్ చేయాలని ఫిక్సయ్యారని అంటున్నారు. ఈ డేట్ మిస్ అయితే మళ్లీ మంచి ముహూర్తం అంటే దసరానే. అక్టోబరు 25 వరకు ఆగాలి. మరి ఏం చేస్తారో చూడాలి. ఒకట్రెండు రోజుల్లోనే ‘నిశ్శబ్దం’ ఓటీటీ రిలీజ్ గురించి ప్రకటన రావచ్చని అంటున్నారు.

This post was last modified on September 15, 2020 1:38 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

నేనే ‘కింగ్’ అంటున్న దళపతి విజయ్

నిన్నటివరకు టీవీకే అధ్యక్షుడు, దళపతి విజయ్ ఎవరితో పొత్తు పెట్టుకుంటారని కేవలం తమిళనాట ప్రజలు మాత్రమే కాదు, దక్షిణ భారత…

1 hour ago

ఈ తరంలో చిరుకు నచ్చిన యంగ్ హీరో

మెగాస్టార్ చిరంజీవి అభినందన అంటే యువ నటీనటులకు ఒక సర్టిఫికెట్ లాంటిదే. ఐతే ఏదైనా ఈవెంట్లకు వచ్చినపుడు అక్కడున్న వారిని…

4 hours ago

‘అమ్మాయిలను అనుభవించడానికే సినిమాలు తీస్తున్నారు’

సినీ ప‌రిశ్ర‌మ‌లో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్ప‌లేమ‌ని సీనియ‌ర్ ద‌ర్శ‌క నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ స్ప‌ష్టం చేశారు. ఇటీవ‌ల…

9 hours ago

డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ సతీమణి

బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…

12 hours ago

చంద్రబాబు ప్రయోగశాలగా మారిన కుప్పం

త‌న సొంత నియోజ‌కవ‌ర్గం కుప్పాన్ని ప్ర‌యోగ‌శాల‌గా మార్చ‌నున్న‌ట్టు సీఎం చంద్ర‌బాబు తెలిపారు. తాజాగా శుక్ర‌వారం రాత్రి త‌న నియోజ‌క‌వర్గానికి వ‌చ్చిన…

12 hours ago

కేసీఆర్ చెప్పిన‌ట్లు కుద‌ర‌దు

ఫోన్ ట్యాపింగ్ కేసు విచార‌ణ విష‌యంలో తెలంగాణ‌ మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ పంతం నెగ్గ‌లేదు. త‌న‌ను ఎర్ర‌వెల్లిలోని త‌న ఫామ్…

13 hours ago