నిన్న టిల్లు స్క్వేర్ డబుల్ బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్ కి ముఖ్య అతిథిగా వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ ఇచ్చిన జోష్ మాములుగా లేదు. సాయంత్రం దాకా సోషల్ మీడియాలో వేర్వేరు టాపిక్స్ మీద ఉన్న ట్రెండింగ్ ఒక్కసారిగా తారక్ స్పీచ్ వైపు వచ్చేసింది. దేవరకు సంబంధించిన అప్డేట్స్ ఇవ్వడమే కాక సిద్దు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్ మీద కురిపించిన ప్రశంసలు, సినిమా గురించి పొగిడిన విధానం, టీమ్ మీద ప్రశంసలు గుప్పించిన వైనం ఆకట్టుకునేలా సాగాయి.
అన్నింటి కంటే హైలైట్ పవన్ కళ్యాణ్ అత్తారింటిది దారేదిలో డైలాగుని వాడి స్టేజి మీద త్రివిక్రమ్ ని సంబోధించడం. “కుదిరితే సరిదిద్దండి లేదంటే క్షమించండి అంతేకాని నేనున్నాను గుర్తించండి ఇక్కడ మీరు” అంటూ సరదాగా పలకడం అందరినీ నవ్వుల్లో ముంచెత్తింది. అక్కడితో ఆగకుండా బ్రహ్మానందం స్టైల్ లో ఐ యాం టెల్లింగ్ థట్ అంటూ ఇంకో పంచ్ వేసి పోలా అదిరిపోలా అంటూ ఫినిషింగ్ టచ్ ఇవ్వడంతో త్రివిక్రమ్ వెంటనే దగ్గరికి వచ్చేశారు.
ఆహ్లాదకరంగా సాగిన ప్రసంగంలో జూనియర్ ఎన్టీఆర్ హుషారు ప్రతి మాటలో వినిపించింది. ఏదో వచ్చా నాలుగు మాటలు చెప్పేసి వెళదామనే తరహాలో కాకుండా ఫ్యాన్స్ కి ఉత్సాహం కలిగేలా చేయడంతో వీడియోలు వైరలయ్యాయి. ది ఫ్యామిలీ స్టార్ ఫలితం తేలిపోయాక టిల్లు స్క్వేర్ కలెక్షన్లలో ఒక్కసారిగా ఊపు రావడంతో ప్రమోషన్లలో మళ్ళీ వేగం పెంచారు. ఈవెంట్ చేయడం కూడా అందులో భాగమే. పది రోజులకే 100 కోట్ల గ్రాస్ దాటేయడంతో సంక్రాంతికి వచ్చిన హనుమాన్ తర్వాత మళ్ళీ ఆ స్థాయి బ్లాక్ బస్టర్ అనిపించుకుంది ఈ సినిమానే.
పోలవరం ప్రాజెక్టును ఆరు నూరైనా పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు శపథం చేశారు. గోదావరి జిల్లాల్లో పర్యటనకు వచ్చిన ఆయన…
అక్కినేని నాగార్జున కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 100వ సినిమా కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కానీ…
జూనియర్ ఎన్టీఆర్.. రాజకీయ రంగ ప్రవేశంపై తరచుగా ప్రచారం జరుగుతూనే ఉంది. ఆయనకు అను కూలంగా ఏపీలోనూ కొన్ని ప్రాంతాల్లో…
తెలుగు టాప్ కొరియోగ్రాఫర్లయిన జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ పరస్పరం అరుచుకుంటూ ఒకరి మీదికి ఒకరు దూసుకువెళ్తున్న వీడియో తాజాగా…
బాక్సాఫీస్ వద్ద లెనిన్ తప్ప జనాలకు వేరే ఆప్షన్ కనిపించడం లేదు. ఇతర కొత్త సినిమాలు విడుదలైనా వాటి గురించి…
తెలంగాణలో రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకు రావడం లేదని, ప్రాజెక్టులకు నీటిని విడుదల చేయడం లేదని ఆరోపిస్తూ.. ప్రధాన ప్రతిపక్షం…