నిన్న టిల్లు స్క్వేర్ డబుల్ బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్ కి ముఖ్య అతిథిగా వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ ఇచ్చిన జోష్ మాములుగా లేదు. సాయంత్రం దాకా సోషల్ మీడియాలో వేర్వేరు టాపిక్స్ మీద ఉన్న ట్రెండింగ్ ఒక్కసారిగా తారక్ స్పీచ్ వైపు వచ్చేసింది. దేవరకు సంబంధించిన అప్డేట్స్ ఇవ్వడమే కాక సిద్దు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్ మీద కురిపించిన ప్రశంసలు, సినిమా గురించి పొగిడిన విధానం, టీమ్ మీద ప్రశంసలు గుప్పించిన వైనం ఆకట్టుకునేలా సాగాయి.
అన్నింటి కంటే హైలైట్ పవన్ కళ్యాణ్ అత్తారింటిది దారేదిలో డైలాగుని వాడి స్టేజి మీద త్రివిక్రమ్ ని సంబోధించడం. “కుదిరితే సరిదిద్దండి లేదంటే క్షమించండి అంతేకాని నేనున్నాను గుర్తించండి ఇక్కడ మీరు” అంటూ సరదాగా పలకడం అందరినీ నవ్వుల్లో ముంచెత్తింది. అక్కడితో ఆగకుండా బ్రహ్మానందం స్టైల్ లో ఐ యాం టెల్లింగ్ థట్ అంటూ ఇంకో పంచ్ వేసి పోలా అదిరిపోలా అంటూ ఫినిషింగ్ టచ్ ఇవ్వడంతో త్రివిక్రమ్ వెంటనే దగ్గరికి వచ్చేశారు.
ఆహ్లాదకరంగా సాగిన ప్రసంగంలో జూనియర్ ఎన్టీఆర్ హుషారు ప్రతి మాటలో వినిపించింది. ఏదో వచ్చా నాలుగు మాటలు చెప్పేసి వెళదామనే తరహాలో కాకుండా ఫ్యాన్స్ కి ఉత్సాహం కలిగేలా చేయడంతో వీడియోలు వైరలయ్యాయి. ది ఫ్యామిలీ స్టార్ ఫలితం తేలిపోయాక టిల్లు స్క్వేర్ కలెక్షన్లలో ఒక్కసారిగా ఊపు రావడంతో ప్రమోషన్లలో మళ్ళీ వేగం పెంచారు. ఈవెంట్ చేయడం కూడా అందులో భాగమే. పది రోజులకే 100 కోట్ల గ్రాస్ దాటేయడంతో సంక్రాంతికి వచ్చిన హనుమాన్ తర్వాత మళ్ళీ ఆ స్థాయి బ్లాక్ బస్టర్ అనిపించుకుంది ఈ సినిమానే.
This post was last modified on April 9, 2024 3:52 pm
పదేళ్ల ముందు ‘దంగల్’ మూవీతో ఇండస్ట్రీ హిట్ ఇచ్చాడు బాలీవుడ్ సూపర్ స్టార్. ఇప్పటికీ ఇండియాస్ హైయెస్ట్ గ్రాసింగ్ మూవీ…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా పెద్ద సినిమాకు ముందస్తు బిజినెస్ జరగడం చాలా కష్టమైపోయింది. ముఖ్యంగా ఒక్క టీజర్ తోనే మొత్తం…
టాలీవుడ్ టాప్ హీరోల్లో అత్యధిక డిమాండ్ ఉన్నది ఎవరికయ్యా అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు ప్రభాస్. తెలుగులోనే కాదు హిందీలోనూ…
ఇరాన్ యుద్ధ పరిణామాలు టీవీలో, సోషల్ మీడియాలో చూస్తూ తెలుసుకుంటున్న మన దేశ జనాలకు మెల్లగా దాని ప్రభావం నేరుగా…
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారం కేసును రెండేళ్ల నుంచి కార్తీక దీపం సీరియల్ మాదిరి లాగుతున్నారని బీఆర్ఎస్ నేతలు…
అదేంటో సీనియర్ నటులు రాజేంద్రప్రసాద్ పదే పదే నోరు జారే తప్పులు చేస్తూనే ఉన్నారు. రాబిన్ హుడ్ టైంలో ఆస్ట్రేలియా…