నిన్న టిల్లు స్క్వేర్ డబుల్ బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్ కి ముఖ్య అతిథిగా వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ ఇచ్చిన జోష్ మాములుగా లేదు. సాయంత్రం దాకా సోషల్ మీడియాలో వేర్వేరు టాపిక్స్ మీద ఉన్న ట్రెండింగ్ ఒక్కసారిగా తారక్ స్పీచ్ వైపు వచ్చేసింది. దేవరకు సంబంధించిన అప్డేట్స్ ఇవ్వడమే కాక సిద్దు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్ మీద కురిపించిన ప్రశంసలు, సినిమా గురించి పొగిడిన విధానం, టీమ్ మీద ప్రశంసలు గుప్పించిన వైనం ఆకట్టుకునేలా సాగాయి.
అన్నింటి కంటే హైలైట్ పవన్ కళ్యాణ్ అత్తారింటిది దారేదిలో డైలాగుని వాడి స్టేజి మీద త్రివిక్రమ్ ని సంబోధించడం. “కుదిరితే సరిదిద్దండి లేదంటే క్షమించండి అంతేకాని నేనున్నాను గుర్తించండి ఇక్కడ మీరు” అంటూ సరదాగా పలకడం అందరినీ నవ్వుల్లో ముంచెత్తింది. అక్కడితో ఆగకుండా బ్రహ్మానందం స్టైల్ లో ఐ యాం టెల్లింగ్ థట్ అంటూ ఇంకో పంచ్ వేసి పోలా అదిరిపోలా అంటూ ఫినిషింగ్ టచ్ ఇవ్వడంతో త్రివిక్రమ్ వెంటనే దగ్గరికి వచ్చేశారు.
ఆహ్లాదకరంగా సాగిన ప్రసంగంలో జూనియర్ ఎన్టీఆర్ హుషారు ప్రతి మాటలో వినిపించింది. ఏదో వచ్చా నాలుగు మాటలు చెప్పేసి వెళదామనే తరహాలో కాకుండా ఫ్యాన్స్ కి ఉత్సాహం కలిగేలా చేయడంతో వీడియోలు వైరలయ్యాయి. ది ఫ్యామిలీ స్టార్ ఫలితం తేలిపోయాక టిల్లు స్క్వేర్ కలెక్షన్లలో ఒక్కసారిగా ఊపు రావడంతో ప్రమోషన్లలో మళ్ళీ వేగం పెంచారు. ఈవెంట్ చేయడం కూడా అందులో భాగమే. పది రోజులకే 100 కోట్ల గ్రాస్ దాటేయడంతో సంక్రాంతికి వచ్చిన హనుమాన్ తర్వాత మళ్ళీ ఆ స్థాయి బ్లాక్ బస్టర్ అనిపించుకుంది ఈ సినిమానే.
This post was last modified on April 9, 2024 3:52 pm
ప్రభాస్ అభిమానుల ఎదురు చూపులకు బ్రేక్ వేస్తూ రాజా సాబ్ థియేటర్లలో అడుగు పెట్టేశాడు. టాక్స్, రివ్యూస్ సంగతి కాసేపు…
ఏ రాష్ట్రంలో అయినా... ప్రతిపక్ష నాయకులకు ప్రభుత్వాలు పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వవు. సహజంగా రాజకీయ వైరాన్ని కొనసాగిస్తాయి. ఏపీ సహా…
ఏపీ రాజధాని అమరావతిపై వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపాయి. పార్టీలకు…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గానికి సంక్రాంతి పండుగ ముందుగానే వచ్చింది. శుక్రవారం నుంచి…
కన్నడలో ఒకప్పటి స్టార్ హీరోయిన్, తర్వాత రాజకీయ నాయకురాలిగా మారిన దివ్య స్పందన అలియాస్ రమ్య జర్నీలో వివాదాలకు లోటేమీ…
ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్ షిప్(పీపీపీ) ద్వారా రాష్ట్రంలో మెడికల్ కాలేజీలతో పాటు పర్యాటక ప్రాంతాలను కూడా అభివృద్ధి చేయాలని సీఎం…