నిన్న టిల్లు స్క్వేర్ డబుల్ బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్ కి ముఖ్య అతిథిగా వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ ఇచ్చిన జోష్ మాములుగా లేదు. సాయంత్రం దాకా సోషల్ మీడియాలో వేర్వేరు టాపిక్స్ మీద ఉన్న ట్రెండింగ్ ఒక్కసారిగా తారక్ స్పీచ్ వైపు వచ్చేసింది. దేవరకు సంబంధించిన అప్డేట్స్ ఇవ్వడమే కాక సిద్దు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్ మీద కురిపించిన ప్రశంసలు, సినిమా గురించి పొగిడిన విధానం, టీమ్ మీద ప్రశంసలు గుప్పించిన వైనం ఆకట్టుకునేలా సాగాయి.
అన్నింటి కంటే హైలైట్ పవన్ కళ్యాణ్ అత్తారింటిది దారేదిలో డైలాగుని వాడి స్టేజి మీద త్రివిక్రమ్ ని సంబోధించడం. “కుదిరితే సరిదిద్దండి లేదంటే క్షమించండి అంతేకాని నేనున్నాను గుర్తించండి ఇక్కడ మీరు” అంటూ సరదాగా పలకడం అందరినీ నవ్వుల్లో ముంచెత్తింది. అక్కడితో ఆగకుండా బ్రహ్మానందం స్టైల్ లో ఐ యాం టెల్లింగ్ థట్ అంటూ ఇంకో పంచ్ వేసి పోలా అదిరిపోలా అంటూ ఫినిషింగ్ టచ్ ఇవ్వడంతో త్రివిక్రమ్ వెంటనే దగ్గరికి వచ్చేశారు.
ఆహ్లాదకరంగా సాగిన ప్రసంగంలో జూనియర్ ఎన్టీఆర్ హుషారు ప్రతి మాటలో వినిపించింది. ఏదో వచ్చా నాలుగు మాటలు చెప్పేసి వెళదామనే తరహాలో కాకుండా ఫ్యాన్స్ కి ఉత్సాహం కలిగేలా చేయడంతో వీడియోలు వైరలయ్యాయి. ది ఫ్యామిలీ స్టార్ ఫలితం తేలిపోయాక టిల్లు స్క్వేర్ కలెక్షన్లలో ఒక్కసారిగా ఊపు రావడంతో ప్రమోషన్లలో మళ్ళీ వేగం పెంచారు. ఈవెంట్ చేయడం కూడా అందులో భాగమే. పది రోజులకే 100 కోట్ల గ్రాస్ దాటేయడంతో సంక్రాంతికి వచ్చిన హనుమాన్ తర్వాత మళ్ళీ ఆ స్థాయి బ్లాక్ బస్టర్ అనిపించుకుంది ఈ సినిమానే.
This post was last modified on April 9, 2024 3:52 pm
బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన కంగనా రనౌత్.. పరిశ్రమలో ఒక స్థాయి అందుకున్న దగ్గర్నుంచి తాను పని చేసే ఇండస్ట్రీలోనే…
రాష్ట్రంలో హైదరాబాద్ కు చెందిన ఐఐటీయన్ల సర్వే పేరుతో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు రెండు మూడు రోజుల నుంచి…
ఇరుముడి వసూళ్లు చూసి చాలా మందికి అసలేం జరుగుతోందో అర్థం కావడం లేదు. ఎక్కడో మారుమూల మూసేయడానికి రెడీగా ఉన్నాయనిపించే…
స్థానిక ఎన్నికలపై జనసేన త్రిముఖ వ్యూహాన్ని అనుసరిస్తోంది. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో విద్యార్థి మృతి చెందాడు. నిన్న వైజాగ్ ప్రైవేటు స్కూల్లో టీచర్ కొట్టిన దెబ్బలకు యూకేజీ విద్యార్థి…
నిర్మాత దిల్ రాజు అన్నట్టు వందల సినిమాలు తీయకపోయినా కెవిఎన్ ప్రొడక్షన్స్ అనేది ఇప్పుడు అన్ని బాషల ఇండస్ట్రీలో హాట్…