Movie News

రవితేజ-జగపతి.. పంచ్‌లు అదిరిపోలా

మాస్ రాజా రవితేజ కొత్త చిత్రం ‘మిస్టర్ బచ్చన్’ మొదలైన దగ్గర్నుంచి అభిమానుల్లో ప్రత్యేక ఆసక్తి రేకెత్తిస్తూనే ఉంది. మిరపకాయ్ తర్వాత రవితేజ, హరీష్ శంకర్ కలిసి చేస్తున్న సినిమా కావడంతో దీనిపై ముందు నుంచే మంచి అంచనాలున్నాయి. హిందీ మూవీ ‘రైడ్’కి ఇది రీమేక్ అయినప్పటికీ.. ఏ భాష నుంచి కథను తీసుకున్నా దాన్ని తనదైన శైలిలో మార్చి కొత్త లుక్ తీసుకురావడం హరీష్ శంకర్ శైలి.

గబ్బర్ సింగ్, గద్దలకొండ గణేష్ చిత్రాల్లో అదే మ్యాజిక్ జరిగింది. ఇప్పుడు ‘మిస్టర్ బచ్చన్’లోనూ ఆ మ్యాజిక్ రిపీటవుతుందని ఆశిస్తున్నారు. తాజాగా ‘మిస్టర్ బచ్చన్’ సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్‌గా మారింది. అందుక్కారణం.. ఈ సినిమా నుంచి జగపతిబాబు డెడ్లీ లుక్ ఒకటి రిలీజ్ చేయడమే. ఈ సినిమాలో ఆయనే మెయిన్ విలన్.

జగపతిని డిఫరెంట్ లుక్‌లో చూపిస్తూ వదిలిన పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. డిఫరెంట్ క్యారెక్టర్లు చేయాలని తపించే జగపతి కోరికను ఈ పాత్ర తీర్చినట్లే కనిపిస్తోంది. ఈ పోస్టర్‌ను ట్విట్టర్లో షేర్ చేస్తూ జగపతిబాబు పెట్టిన కామెంట్ నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. ‘‘మిస్టర్ బచ్చన్‌లో మాస్ రాజాని ఏసేయడానికి సిద్ధం’’ అని ఆయన కామెంట్ పెట్టారు.

ఐతే దీనికి మాస్ రాజా కూడా ఆసక్తికర రీతిలో స్పందించాడు. ‘‘మిస్టర్ బచ్చన్ ఇక్కడ. ఎవరు ఎవరిని ఏస్తారో చూస్కుందాం’’ అంటూ జగపతిని కోట్ చేశాడు రవితేజ. ఈ సరదా సంభాషణ సోషల్ మీడియా జనాల దృష్టిని బాగా ఆకర్షించింది. సినిమాకు మంచి పబ్లిసిటీ తెచ్చిపెట్టింది. ఇక ఈ సినిమా షూట్ విషయానికి వస్తే.. 80 శాతం దాకా పూర్తయినట్లు సమాచారం. పీపుల్స్ మీడియా సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని జూన్ లేదా జులై రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు.

This post was last modified on April 8, 2024 1:46 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

కాస్త సౌండ్ పెంచు పురుషోత్తమా

యూత్ హీరో రాజ్ తరుణ్ కు మంచి హిట్టు దక్కి ఎంత కాలమయ్యిందో చెప్పడం కష్టం. సీనియర్ హీరోలతో సపోర్టింగ్…

1 hour ago

బాలయ్య బ్యాక్ టు డ్యూటీ

ఎన్నికలు అయిపోయాయి. ఫలితాలు ఇంకో పద్దెనిమిది రోజుల్లో రాబోతున్నాయి. ఎవరికి వారు విజయం పట్ల ధీమాగా ఉన్నారు. అధికార పార్టీ,…

3 hours ago

పూజా హెగ్డే కోరుకున్న బ్రేక్ దొరికింది

మొన్నటిదాకా టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా అత్యధిక డిమాండ్ అనుభవించిన పూజా హెగ్డే కెరీర్ ప్రారంభంలో వచ్చిన ఐరన్ లెగ్…

4 hours ago

ఆమంచి .. ఎవరి ‘కొంప’ ముంచేనో ?!

ప్రకాశం జిల్లాలో ఆమంచి కృష్ణమోహన్ రాజకీయంగా ఒక బలమైన నాయకుడే అని చెప్పాలి. అయితే తన రాజకీయ భవిష్యత్తు కోసం…

5 hours ago

అమెరికాలో వెంటాడిన మృత్యువు

తెలంగాణలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత రెండు ప్రమాదాలు తప్పించుకుని మూడో ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. నెలల వ్యవధిలో…

5 hours ago

కోర్టు మెట్లెక్కిన జూనియర్  !

ప్రముఖ హీరో జూనియర్ ఎన్టీఆర్ 2003లో జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలో  681 చదరపు గజాల స్థలం సుంకు గీత అనే…

5 hours ago