ఒక సినిమాని మార్కెట్ చేయడంలో అంచనాలు పెంచడంలో ట్రైలర్ పాత్ర చాలా కీలకం. దీని వల్లే ఒక్కోసారి బిజినెస్ లెక్కలు అమాంతం పెరిగిపోతాయి. బాహుబలి, ఆర్ఆర్ఆర్ విషయంలో రాజమౌళి అంత శ్రద్ధ తీసుకోబట్టే రిలీజ్ ముందు నుంచే హైప్ ని రెట్టింపు చేశాయి. ఒకవేళ తేడా కొడితే ఏం జరుగుతుందనే దానికి బాలీవుడ్ మూవీ బడేమియా చోటే మియా నిలుస్తోంది. వాస్తవానికి ఏప్రిల్ 10 విడుదల కావాల్సిన ఈ యాక్షన్ మల్టీస్టారర్ ఇప్పుడు ఒకరోజు వాయిదా పడి ఏప్రిల్ 11 రానుంది. కారణం ఏంటయ్యా అంటే ఆశించిన దానికి చాలా తక్కువగా అడ్వాన్స్ బుకింగ్స్ ఉండటం.
రంజాన్ పండగ ఏప్రిల్ 11 రానుంది. ఉపవాస దీక్షలు పూర్తి చేసుకుని ముస్లింలు ఆ రోజు నుంచి థియేటర్లకు వస్తారు. ఒకవేళ 10నే బడేమియా చోటేమియాకు నెగటివ్ టాక్ వస్తే అక్కడితో ఖేల్ ఖతం. సమస్యల్లా రొటీన్ గా అనిపించినా ట్రైలర్ వల్ల జరిగిందని విశ్లేషకులు తేల్చి చెబుతున్నారు. ఎలాంటి కొత్తదనం ఫీలవ్వకుండా అక్షయ్ కుమార్, టైగర్ శ్రోఫ్ ఉంటే చాలానే ధీమాతో రెగ్యులర్ ఎలిమెంట్స్ తో నింపేయడం వల్ల బజ్ తెచ్చుకోవడంలో విఫలమయ్యిందని అభిప్రాయపడుతున్నారు. పైగా సలార్ ఫేమ్ పృథ్విరాజ్ సుకుమారన్ నటించిన పాయింట్ ని కూడా సరిగా పబ్లిసిటీ చేయలేకపోయారు.
దీంతో అడ్వాన్ బుకింగ్స్ చూసి డీలా పడిపోయిన నిర్మాతలు వాయిదా మార్గం పట్టారు. ఇదే కాదు మైదాన్ కూడా ఇదే దారిలో వన్ డే పోస్ట్ పోన్ ఆలోచన చేస్తోందని సమాచారం. ఎంతసేపూ పాకిస్థాన్ తీవ్రవాదాన్ని పట్టుకుని ఒకే కథను తిప్పి తిప్పి తీస్తే ఆడియన్స్ లో ఆసక్తి ఎక్కడ నుంచి వస్తుంది. సల్మాన్ ఖాన్ టైగర్ 3 దెబ్బ తింది, థియేటర్లలో ఫైటర్ యావరేజ్ అయ్యింది ఇందుకే కదా. మరి బడేమియా చోటేమియా కూడా అదే దారి పడితే ఇంతకన్నా రెస్పాన్స్ ఏమొస్తుంది. అన్నట్టు ఈ సినిమా తెలుగులో కూడా డబ్బింగ్ రూపంలో విడుదలవుతున్న సంగతి జనాలకు నిజంగా తెలుసంటారా
This post was last modified on April 8, 2024 1:44 pm
చాలాకాలంగా కాంగ్రెస్ పార్టీపై, సీఎం రేవంత్ రెడ్డిపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేస్తున్న సంగతి…
ఏపీ సీఎం చంద్రబాబు ఏ చిన్న అవకాశాన్నీ వదలట్లేదా? అంటే.. ఔననే సమాధానమే వస్తోంది. పెట్టుబడులకు ఎక్కడ అవకాశం ఉంటే..…
తెంపరి తనానికి చొక్కా.. ఫ్యాంటు తొడిగితే.. అది అమెరికా అధ్యక్షుడు ట్రంపేనన్న కామెంట్లు తరచుగా వినిపిస్తాయి. ఎప్పుడు ఎలాంటి నిర్ణయంతో…
ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో శాసన సభను బాయ్కాట్ చేసిన వైసీపీ ప్రజాప్రతినిధులు శాసన మండలిలో మాత్రం చిందులు తొక్కుతున్నారు.…