డీజే టిల్లు టైంలో ఒక ఇంటర్వ్యూలో సిద్దు జొన్నలగడ్డ మాట్లాడుతూ తన లక్ష్యం రాబోయే మూడేళ్ళలో వంద కోట్లు వసూలు చేసే సినిమా ఒకటి తన ఖాతాలో ఉండాలని చెప్పాడు. ఇమేజ్ ఉన్న టైర్ 2 స్టార్లకు సైతం సులభంగా అందని మైలురాయి ఆది. పదుల సంఖ్యలో హిట్లున్న కుర్ర హీరోలు చేరుకోలేని ఆ మార్కుని సిద్దు అంత తేలిగ్గా దక్కించుకోడనే కామెంట్స్ ఎక్కువగా వినిపించాయి. కట్ చేస్తే టిల్లు స్క్వేర్ దాన్ని సాధ్యం చేసి చూపించింది. పదో రోజు అడుగు పెట్టడం ఆలస్యం 101 కోట్ల గ్రాస్ ని సగర్వంగా దాటేసి విజయ దరహాసాన్ని కొనసాగించే దిశగా పరుగులు పెడుతోంది.
ఒక నెల రోజుల క్రితం ఫ్లాష్ బ్యాక్ చూద్దాం. టిల్లు స్క్వేర్ ట్రైలర్ మీద మిశ్రమ స్పందన వచ్చింది. ఫస్ట్ పార్ట్ అంత మేజిక్ జరగదేమోననే అనుమానాలు తలెత్తాయి. పైగా హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ గ్లామర్ ప్లస్ లిప్ లాక్ షో మీద రకరకాల ఆన్ లైన్ డిబేట్లు. ఆ అమ్మాయి వీటికి తట్టుకోలేక ఏకంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రాలేకపోయింది. తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేయలేకపోవడం, పాటలు డీజే టిల్లు రేంజ్ లో రీచ్ కాకపోవడం ఇలా రకరకాల కారణాలు బజ్ మీద ప్రభావం చూపించాయి. కట్ చేస్తే మార్చి 29 రిలీజైన టిల్లు స్క్వేర్ యూత్ కి అమాంతం ఎక్కేసింది.
అక్కడి నుంచి తిరిగి చూడాల్సిన అవసరం లేదు. ది ఫ్యామిలీ స్టార్ వచ్చాక విపరీతంగా నెమ్మదిస్తుందేమోనని ఫ్యాన్స్ భయపడితే అవి పటాపంచలు అయ్యాయి. విజయ్ దేవరకొండ కన్నా తొమ్మిదో రోజు సిద్దు జొన్నలగడ్డనే ఎక్కువ టికెట్లు అమ్మడం దానికి నిదర్శనం. ఇక్కడితో అయిపోలేదు. మంగళవారం ఉగాది సెలవు, ఒక్క రోజు గ్యాప్ లో రంజాన్ పండగ, తిరిగి మూడో వీకెండ్, ఆసక్తి రేపని కొత్త రిలీజులు ఇవన్నీ టిల్లు ప్రభంజనానికి సానుకూలంగా పని చేసేవే. ఈ లెక్కన 150 కోట్ల గ్రాస్ అందుకునే అవకాశాన్ని ఎంత మాత్రం కొట్టిపారేయలేం. దెబ్బలు టిల్లు క్యూబ్ హైప్ ఏ రేంజ్ లో ఉంటుందో.
This post was last modified on April 7, 2024 12:40 pm
తెలుగు రాష్ట్రాల మధ్య విభజన వ్యాఖ్యలపై మరోసారి చర్చ మొదలైంది. తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా…
ప్రధాని నరేంద్ర మోదీ స్కిన్ టోన్పై సోషల్ మీడియాలో చర్చ జోరందుకుంది. రెండు వేర్వేరు ప్రాంతాల్లో చిత్రీకరించిన వీడియోల్లో ఆయన…
మొన్న శుక్రవారం విడుదలైన తిమ్మరాజుపల్లి టీవీకి ప్రమోషన్లయితే ఘనంగా జరిగాయి. ఈవెంట్లు, ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలు అన్నీ చేశారు. నిర్మాత…
అనుకున్నంతా అయ్యింది. జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ ఈ ఏడాది రావడం లేదు.…
గత ఏడాది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అతి పెద్ద సర్ప్రైజ్ అంటే.. ‘మహావతార నరసింహా’నే. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన…
రాష్ట్రంలో కారుణ్య నియామకాల అమలు విధానంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. నియంత్రణ లేకుండా పెరుగుతున్న ఈ…