తెలుగు ప్రేక్షకులకు భాషా భేదం అనేదే ఉండదు. మంచి సినిమా ఎక్కడి నుంచి వచ్చినా ఆదరిస్తారు. డబ్బింగ్ సినిమాలను మన వాళ్లు నెత్తిన పెట్టుకున్నట్లు ఎవ్వరూ పెట్టుకోరు. ఈ మధ్య మనవాళ్లు మలయాళ చిత్రాలను బాగా ఆదరిస్తున్నారు. గత నెలలో ‘ప్రేమలు’ అనే మలయాళ సినిమాను సూపర్ హిట్ చేశారు.
మమ్ముట్టి సినిమా ‘భ్రమయుగం’ కూడా ఓ మాదిరిగా ఆడింది. ఇప్పుడు ‘మంజుమ్మెల్ బాయ్స్’ అనే సినిమా మంచి టాక్తో మొదలై బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటేలా కనిపిస్తోంది. ఐతే వీటి మధ్యలో ‘ది గోట్ లైఫ్: ఆడుజీవితం’ అనే మరో మలయాళ చిత్రం కూడా తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ట్రైలర్ చూస్తేనే ఇది గొప్ప సినిమా అనే సంకేతాలు కనిపించాయి. టాక్ కూడా అలాగే వచ్చింది. కానీ ఈ సినిమా టాలీవుడ్ బాక్సాఫీస్లో పెద్దగా ప్రభావమే చూపలేదు.
‘ది గోట్ లైఫ్’ గొప్ప సినిమా అనడంలో సందేహం లేదు. హాలీవుడ్ స్టాండర్డ్స్ కనిపించాయి సినిమాలో. ఈ సినిమా కోసం పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రాణం పెట్టేశాడు. ఒక పాత్ర కోసం ఏ స్టార్ హీరో చేయని సాహసం చేశాడు. కానీ ఈ సినిమా మరీ నెమ్మదిగా సాగడం.. విపరీతమైన వేదనకు గురి చేసేలా ఉండడం.. నిడివి మరీ ఎక్కువ అయిపోవడంతో తెలుగు ప్రేక్షకులు తట్టుకోలేకపోయారు. మంచి సినిమా అంటూనే చూడలేం అనే అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఈ సినిమాకు రిలీజ్ ఖర్చులు కూడా వెనక్కి రాని పరిస్థితి. కానీ మలయాళ ప్రేక్షకులు మాత్రం ‘ది గోట్ లైఫ్’ను నెత్తిన పెట్టుకున్నారు. పృథ్వీరాజ్ కష్టానికి గొప్ప ఫలితాన్ని అందించారు. రిలీజైన దగ్గర్నుంచి హౌస్ ఫుల్స్తో రన్ అవుతోంది ఈ చిత్రం. మలయాళ ఇండస్ట్రీలో అత్యంత వేగంగా వంద కోట్ల వసూళ్లు సాధించిన చిత్రంగా ‘ది గోట్ లైఫ్’ నిలవడం విశేషం. ఆర్ట్ సినిమాలా అనిపించే ఇలాంటి మూవీకి ఇంత మంచి కలెక్షన్ ఇచ్చి తమ అభిరుచిని చాటుకున్నారు మలయాళ ఆడియన్స్.
ఏపీలో వైసీపీ అదికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలోని పాత జిల్లాలతో పాటుగా వైసీపీ సర్కారే కొత్తగా ఏర్పాటు చేసిన కొత్త జిల్లాల్లోనూ…
పవన్ కళ్యాణ్ భుజాల లోపల కలిగిన గాయం ఊహించిన దానికంటే తీవ్రంగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్…
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును వేధింపులకు గురిచేసి.. కస్టడీలో టార్చర్ చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ సునీల్ కుమార్…
రాజకీయాలంటే చాలా మంది చెడిపోయాయని అనుకుంటారు. కానీ, రాజకీయాలు అంతగా ఏమీ చెడిపోలేదు. ఒక పార్టీ కారణంగానే ఈ పేరు…
జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అనౌన్స్ మెంట్ ఇవాళ వచ్చేసింది. నిజానికి…
దేశ అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ అవార్డులను ఎంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తారో తెలిసిందే. ప్రతిసారీ అవార్డులు ప్రకటించినపుడు గ్రహీతల అర్ఙతల…