కాదేది క్రియేటివిటీకి అనర్హం. ఇది న్యూ జనరేషన్ ఫిలిం మేకర్స్ గుర్తు పెట్టుకోవాల్సిన సూక్తి. అప్పుడే కొత్త కాన్సెప్ట్ లతో విభిన్న ప్రయోగాలు చేసే ఛాన్స్ ఉంటుంది. అన్నపూర్ణ స్టూడియోస్, ఆసియన్ సంస్థలు సంయుక్తంగా తెలుగులో తీసుకొస్తున్న డియర్ చూస్తే ఇదే అనిపిస్తుంది. జివి ప్రకాష్ కుమార్, ఐశ్యర్య రాజేష్ జంటగా రూపొందిన ఈ సినిమాలో మెయిన్ పాయింట్ ఏంటంటే అమ్మాయి గురక. దాని చుట్టే లవ్ స్టోరీ, మ్యారేజ్, ఎమోషన్స్ అన్నీ పెట్టేశారు. సంగీతం స్వయంగా జివినే సమకూర్చుకున్న ఈ ఎంటర్ టైనర్ కు ఆనంద్ రవిచంద్రన్ దర్శకత్వం వహించాడు.
కథేంటో అరటిపండు వలిచినట్టు చెప్పేశారు. అబ్బాయి లైట్ స్లీపర్. అంటే రాత్రిళ్ళు ఎక్కువ నిద్ర పట్టదు. ఏదో రెండు మూడు గంటలు పడుకుని మమ అనిపిస్తాడు. అమ్మాయికేమో పెద్ద శబ్దాలతో గురక పెట్టి తొంగోవడం అలవాటు. ఈ ఇద్దరికీ దేవుడు ముడిపెడతాడు. తమ బలహీనతను దాచి పెట్టుకుని ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. కట్ చేస్తే మొదటి రాత్రి అసలు రహస్యం బయట పడుతుంది. సింహంలా గుర్రు సౌండ్ తో కాపురం చేసే పెళ్ళాన్ని భరించలేనంటూ కుర్రాడు వీధికెక్కుతాడు. వీళ్లకు తగ్గట్టే ఉన్న తల్లితండ్రులకు ఇదో పెద్ద సమస్యగా మారుతుంది. అదేంటో ఏప్రిల్ 12 చూడాలి.
వెరైటీగా అనిపిస్తోంది కానీ ఇలాంటి వాటిలో వినోదం బాగా పండితేనే థియేట్రికల్ గా వర్కౌట్ అవుతాయి. ఆ మధ్య గుడ్ నైట్ అనే తమిళ మూవీ బాగా ఆడింది. ఓటిటిలో ఇంకా మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే డియర్ అలాంటి స్పందనే దక్కించుకుంటుందా లేదానేది వేచి చూడాలి. క్యాస్టింగ్ మొత్తం అరవ నటీనటులే ఉన్నారు. పెద్ద బడ్జెట్ లేకుండా సింపుల్ గా లాగించిన డియర్ పూర్తిగా ఎంటర్ టైన్మెంట్ మీద ఆధారపడి ఉంది. లీడ్ పెయిర్ లో ఒకరికి ఒక విచిత్రమైన జబ్బు ఉండటం దర్శకుడు మారుతీ ఏ క్షణంలో కనిపెట్టాడో కానీ సంవత్సరాల తర్వాత కూడా ఆ ఫార్ములా చెల్లుబాటవుతోంది.
This post was last modified on April 6, 2024 6:39 pm
భారత దేశ రాజకీయాల్లో ఎన్నో పార్టీలు పుడుతున్నాయి. ఆ వెంటనే కనుమరుగు అవుతున్నాయి. ఎక్కడో ఒకటి అరా పార్టీలు కొనసాగుతున్నా... అవన్నీ దాదాపుగా…
టాలీవుడ్లో క్యారెక్టర్ రోల్స్ తో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి సురేఖా వాణి. వందల సంఖ్యలో సినిమాలు చేసిన ఆమెకు…
ఈ వారం టాలీవుడ్లో ఒక ఆసక్తికర అరంగేట్రం జరిగింది. ఇండస్ట్రీలో అతి పెద్ద కుటుంబాల్లో ఒకటైన ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి…
వైసీపీలో జగన్ అంటే ప్రాణం పెట్టేవారే ఉన్నారని, ఆయన గీసిన గీత దాటబోరని చెప్పే వారు కనిపిస్తారు. అయితే.. తాజాగా…
కథానాయికగా మలయాళంలో పరిచయం అయి.. తెలుగులో మంచి ఫాలోయింగ్, అవకాశాలు అందుకున్న అమ్మాయి అనుపమ పరమేశ్వరన్. ఆమె కెరీర్లో ఎక్కువ…
వైసీపీ నాయకుడు వాసుపల్లి గణేష్ ఎయిర్ పోర్టుకి పెళ్లికి లింక్ పెట్టి మాట్లాడ్డం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఊరందరిదీ…