Movie News

కీరవాణి కొడుకు పెళ్లి వార్త.. నిజమే

సినిమా వాళ్లు సినిమా కుటుంబాలతోనే సంబంధాలు కలుపుకోవడం కొత్తేమీ కాదు. కలిసి నటించిన వాళ్లు పెళ్లి చేసుకోవడమే కాదు.. ఒక సినీ కుటుంబం నుంచి అమ్మాయిని ఇంకో సినీ కుటుంబంలోని అబ్బాయికీ ఇస్తుంటారు. ఈ మధ్య అలాంటి సంబంధమే ఒకటి కుదిరినట్లు వార్తలు వచ్చాయి. కీరవాణి చిన్న కొడుకు శ్రీ సింహా.. మురళీ మోహన్ మనవరాలిని పెళ్లాడబోతున్నట్లుగా ప్రచారం జరిగింది.

ఐతే దీని గురించి ఇప్పటిదాకా ఇరు కుటుంబాలు అధికారికంగా స్పందించలేదు. కాగా ఇప్పుడు మురళీ మోహన్ కోడలు, వధువు తల్లి అయిన మాగంటి రూప ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ధ్రువీకరించింది. మురళీ మోహన్‌తో కలిసి ఆమె ఆలీ నిర్వహించే ‘ఆలీతో జాలీగా’ కార్యక్రమానికి హాజరైంది.

ఈ సందర్భంగా మీ అమ్మాయికి ఇండస్ట్రీకి చెందిన అబ్బాయితో పెళ్లి కుదిరందట నిజమేనా అని ఆలీ అడిగాడు. దీనికి రూప బదులిస్తూ.. ‘‘అవును. నిజమే.. సంగీత దర్శకుడు కీరవాణి గారి చిన్నబ్బాయి శ్రీ సింహాతో మా అమ్మాయి పెళ్లి నిశ్చయమైంది. ఈ ఏడాది చివర్లో పెళ్లి ఉండొచ్చు’’ అని వెల్లడించింది. కీరవాణి పెద్దబ్బాయి కాలభైరవకు ఇంకా పెళ్లి కాలేదు. ఈలోపే చిన్నబ్బాయికి పెళ్లి కుదరడం ఆశ్చర్యం కలిగించే విషయమే. బహుశా ఇది ప్రేమ పెళ్లి కావచ్చని భావిస్తున్నారు.

‘మత్తువదలరా’ అనే డిఫరెంట్ థ్రిల్లర్ మూవీతో శ్రీ సింహా హీరోగా పరిచయం అయ్యాడు. ఆ సినిమా మంచి విజయం సాధించింది. కానీ తర్వాత సింహా కెరీర్ గాడి తప్పింది. తెల్లవారితే గురువారం, దొంగలున్నారు జాగ్రత్త, ఉస్తాద్.. ఇలా వరుసగా ఫెయిల్యూర్లు ఎదుర్కొన్నాడు. అతడి కొత్త సినిమా ఏదీ అనౌన్స్ కాలేదు.

Satya

Recent Posts

అంచనాల ఒత్తిడిని ‘రామాయణ’ తట్టుకుంటుందా

ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…

41 minutes ago

లవ్ స్టోరీ భయపడాల్సిన పని లేదు

ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…

2 hours ago

అయ్యగారి జోరు అదిరింది

పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…

3 hours ago

మ్యూజిక్ చిచ్చు పెట్టిన ‘గాడ్ ఆఫ్ వార్’

తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…

4 hours ago

ఎట్టకేలకు బూత్ స్థాయిపై జనసేన కన్ను

బూత్ స్థాయిలో బ‌లోపేతం అయ్యే దిశ‌గా జ‌న‌సేన క‌స‌ర‌త్తు షురూ చేసింది. ప్ర‌స్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయ‌కులు ఉన్న‌ప్ప‌టికీ..…

5 hours ago

రాజధాని భూముల రచ్చలో నిజమేంటి..?

ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…

6 hours ago