సినిమా వాళ్లు సినిమా కుటుంబాలతోనే సంబంధాలు కలుపుకోవడం కొత్తేమీ కాదు. కలిసి నటించిన వాళ్లు పెళ్లి చేసుకోవడమే కాదు.. ఒక సినీ కుటుంబం నుంచి అమ్మాయిని ఇంకో సినీ కుటుంబంలోని అబ్బాయికీ ఇస్తుంటారు. ఈ మధ్య అలాంటి సంబంధమే ఒకటి కుదిరినట్లు వార్తలు వచ్చాయి. కీరవాణి చిన్న కొడుకు శ్రీ సింహా.. మురళీ మోహన్ మనవరాలిని పెళ్లాడబోతున్నట్లుగా ప్రచారం జరిగింది.
ఐతే దీని గురించి ఇప్పటిదాకా ఇరు కుటుంబాలు అధికారికంగా స్పందించలేదు. కాగా ఇప్పుడు మురళీ మోహన్ కోడలు, వధువు తల్లి అయిన మాగంటి రూప ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ధ్రువీకరించింది. మురళీ మోహన్తో కలిసి ఆమె ఆలీ నిర్వహించే ‘ఆలీతో జాలీగా’ కార్యక్రమానికి హాజరైంది.
ఈ సందర్భంగా మీ అమ్మాయికి ఇండస్ట్రీకి చెందిన అబ్బాయితో పెళ్లి కుదిరందట నిజమేనా అని ఆలీ అడిగాడు. దీనికి రూప బదులిస్తూ.. ‘‘అవును. నిజమే.. సంగీత దర్శకుడు కీరవాణి గారి చిన్నబ్బాయి శ్రీ సింహాతో మా అమ్మాయి పెళ్లి నిశ్చయమైంది. ఈ ఏడాది చివర్లో పెళ్లి ఉండొచ్చు’’ అని వెల్లడించింది. కీరవాణి పెద్దబ్బాయి కాలభైరవకు ఇంకా పెళ్లి కాలేదు. ఈలోపే చిన్నబ్బాయికి పెళ్లి కుదరడం ఆశ్చర్యం కలిగించే విషయమే. బహుశా ఇది ప్రేమ పెళ్లి కావచ్చని భావిస్తున్నారు.
‘మత్తువదలరా’ అనే డిఫరెంట్ థ్రిల్లర్ మూవీతో శ్రీ సింహా హీరోగా పరిచయం అయ్యాడు. ఆ సినిమా మంచి విజయం సాధించింది. కానీ తర్వాత సింహా కెరీర్ గాడి తప్పింది. తెల్లవారితే గురువారం, దొంగలున్నారు జాగ్రత్త, ఉస్తాద్.. ఇలా వరుసగా ఫెయిల్యూర్లు ఎదుర్కొన్నాడు. అతడి కొత్త సినిమా ఏదీ అనౌన్స్ కాలేదు.
మెగా హీరోల సినిమాలకు సంబంధించి ఏ ఈవెంట్ అయినా.. అందులో ఎక్కడో ఒక చోట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్…
హైదరాబాద్ శిల్పకళా వేదికలో జరిగిన పెద్ది సక్సెస్ మీట్ కోసం వేలాది అభిమానులు తరలివచ్చారు. ఈ సినిమాకు సంబంధించి ఇదే…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేస్తూ విపక్ష వైసీపీ ఇటీవల డోస్ పెంచిన…
ప్రతి సంవత్సరం విజయ్కి స్పెషల్ పిక్తో పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పే త్రిష.. ఈసారి చెప్పలేదు. ఇన్స్టాగ్రామ్లో కూడా ఆయన్ని…
నిజమే…ఆ ఇద్దరూ కలిశారు. రాష్ట్ర అభివృద్ది కోసం రాజకీయాలను పక్కనపెట్టేశారు. అంతే… ఇద్దరు ముగ్గురయ్యారు. ఆ ముగ్గురూ నలుగురయ్యారు. వెరసి…
కొందరు స్టార్ హీరోయిన్లు కెరీర్ మంచి ఊపులో కొనసాగుతున్న టైంలోనే వ్యక్తిగత జీవితంలో సెటిల్ అవ్వాలని చూస్తుంటారు. ఈ క్రమంలో…