ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం విషయమై గత నెల ఆయన అభిమానులు ఎంతగా ఆందోళన చెందారో తెలిసిందే. ఒక దశలో ఆయన పరిస్థితి విషమించడంతో అందరూ తీవ్రంగా కలత చెందారు. అదృష్టవశాత్తూ ఆ స్థితి నుంచి ఆయన కోలుకున్నారు. ప్రాణాపాయం నుంచి బయటపడ్డ ఆయన నెమ్మదిగా కోలుకుంటున్నారు. ఈ మధ్యే కరోనా నెగెటివ్ వచ్చిందాయనకు. ఐతే ఆయన పూర్తిగా కోలుకోవడానికైతే ఇంకా సమయం పట్టేట్లే ఉంది. నాలుగు రోజుల విరామం తర్వాత బాలు తనయుడు ఎస్పీ చరణ్ బాలు అభిమానుల కోసం ఆయన ఆరోగ్య స్థితిపై వీడియో అప్ డేట్ కూడా ఇచ్చాడు.
బాలుకు వెంటిలేటర్ తీశారా లేదా అన్నది వెల్లడించలేదు కానీ.. బాలు చాలా వరకు కోలుకున్నారనే చెప్పాడు చరణ్. తాజాగా తీసిన స్కాన్లను బట్టి చూస్తే ఊపిరితిత్తులతో సహా మిగతా అవయవాలన్నీ చాలా వరకు మెరుగుపడ్డ విషయం వాటిలో స్పష్టంగా తెలుస్తోందని అన్నాడు. చికిత్సకు బాలు బాగా స్పందిస్తున్నారని.. ఫిజియో థెరపీకి సహకరిస్తున్నాడని చెప్పాడు. వైద్యులు ఆయన్ని కూర్చోబెట్టి 20-25 నిమిషాల పాటు థెరపీ చేస్తున్నారని చెప్పాడు. బాలు బాగా మాట్లాడుతున్నట్లు కూడా చరణ్ వెల్లడించాడు. ఇక నోటి ద్వారా బాలుకు ఆహారం అందించేందుకు కూడా ప్రయత్నిస్తున్నారని.. త్వరలోనే ఆయన పూర్తిగా కోలుకుంటారన్న ఆశాభావం కలుగుతోందని చరణ్ చెప్పాడు.
This post was last modified on September 15, 2020 2:37 am
కంటెంట్ ఉంటే తెలుగు ప్రేక్షకులు స్టార్లు లేకపోయినా బ్రహ్మాండంగా ఆదరిస్తారని గతంలో బలగం లాంటివి ఋజువు చేస్తే తాజాగా కోర్ట్…
మే 9 విడుదల కాబోతున్న హరిహర వీరమల్లు కన్నా పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజి మీదే ఎక్కువ ప్రేముందనేది బహిరంగ…
విడుదలై నెలరోజులు దాటుతున్నా ఛావా పరుగులు ఆగడం లేదు. వీక్ డేస్ లో నెమ్మదించినప్పటికీ వారాంతం వస్తే చాలు విక్కీ…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ మాట ఇచ్చారంటే.. అది క్షణాల్లో అమలు కావాల్సిందే. ఇదేదో……
ఓ వైపేమో టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అధికారంలో ఉంటే… విపక్షాలు సైతం తమ కార్యక్రమాలను ఘనంగా…
టీడీపీకి మహానాడు అనేది ప్రాణ ప్రదం. ఈ విషయంలో ఎలాంటి తేడా లేదు. పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు…