ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం విషయమై గత నెల ఆయన అభిమానులు ఎంతగా ఆందోళన చెందారో తెలిసిందే. ఒక దశలో ఆయన పరిస్థితి విషమించడంతో అందరూ తీవ్రంగా కలత చెందారు. అదృష్టవశాత్తూ ఆ స్థితి నుంచి ఆయన కోలుకున్నారు. ప్రాణాపాయం నుంచి బయటపడ్డ ఆయన నెమ్మదిగా కోలుకుంటున్నారు. ఈ మధ్యే కరోనా నెగెటివ్ వచ్చిందాయనకు. ఐతే ఆయన పూర్తిగా కోలుకోవడానికైతే ఇంకా సమయం పట్టేట్లే ఉంది. నాలుగు రోజుల విరామం తర్వాత బాలు తనయుడు ఎస్పీ చరణ్ బాలు అభిమానుల కోసం ఆయన ఆరోగ్య స్థితిపై వీడియో అప్ డేట్ కూడా ఇచ్చాడు.
బాలుకు వెంటిలేటర్ తీశారా లేదా అన్నది వెల్లడించలేదు కానీ.. బాలు చాలా వరకు కోలుకున్నారనే చెప్పాడు చరణ్. తాజాగా తీసిన స్కాన్లను బట్టి చూస్తే ఊపిరితిత్తులతో సహా మిగతా అవయవాలన్నీ చాలా వరకు మెరుగుపడ్డ విషయం వాటిలో స్పష్టంగా తెలుస్తోందని అన్నాడు. చికిత్సకు బాలు బాగా స్పందిస్తున్నారని.. ఫిజియో థెరపీకి సహకరిస్తున్నాడని చెప్పాడు. వైద్యులు ఆయన్ని కూర్చోబెట్టి 20-25 నిమిషాల పాటు థెరపీ చేస్తున్నారని చెప్పాడు. బాలు బాగా మాట్లాడుతున్నట్లు కూడా చరణ్ వెల్లడించాడు. ఇక నోటి ద్వారా బాలుకు ఆహారం అందించేందుకు కూడా ప్రయత్నిస్తున్నారని.. త్వరలోనే ఆయన పూర్తిగా కోలుకుంటారన్న ఆశాభావం కలుగుతోందని చరణ్ చెప్పాడు.
This post was last modified on September 15, 2020 2:37 am
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…