ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం విషయమై గత నెల ఆయన అభిమానులు ఎంతగా ఆందోళన చెందారో తెలిసిందే. ఒక దశలో ఆయన పరిస్థితి విషమించడంతో అందరూ తీవ్రంగా కలత చెందారు. అదృష్టవశాత్తూ ఆ స్థితి నుంచి ఆయన కోలుకున్నారు. ప్రాణాపాయం నుంచి బయటపడ్డ ఆయన నెమ్మదిగా కోలుకుంటున్నారు. ఈ మధ్యే కరోనా నెగెటివ్ వచ్చిందాయనకు. ఐతే ఆయన పూర్తిగా కోలుకోవడానికైతే ఇంకా సమయం పట్టేట్లే ఉంది. నాలుగు రోజుల విరామం తర్వాత బాలు తనయుడు ఎస్పీ చరణ్ బాలు అభిమానుల కోసం ఆయన ఆరోగ్య స్థితిపై వీడియో అప్ డేట్ కూడా ఇచ్చాడు.
బాలుకు వెంటిలేటర్ తీశారా లేదా అన్నది వెల్లడించలేదు కానీ.. బాలు చాలా వరకు కోలుకున్నారనే చెప్పాడు చరణ్. తాజాగా తీసిన స్కాన్లను బట్టి చూస్తే ఊపిరితిత్తులతో సహా మిగతా అవయవాలన్నీ చాలా వరకు మెరుగుపడ్డ విషయం వాటిలో స్పష్టంగా తెలుస్తోందని అన్నాడు. చికిత్సకు బాలు బాగా స్పందిస్తున్నారని.. ఫిజియో థెరపీకి సహకరిస్తున్నాడని చెప్పాడు. వైద్యులు ఆయన్ని కూర్చోబెట్టి 20-25 నిమిషాల పాటు థెరపీ చేస్తున్నారని చెప్పాడు. బాలు బాగా మాట్లాడుతున్నట్లు కూడా చరణ్ వెల్లడించాడు. ఇక నోటి ద్వారా బాలుకు ఆహారం అందించేందుకు కూడా ప్రయత్నిస్తున్నారని.. త్వరలోనే ఆయన పూర్తిగా కోలుకుంటారన్న ఆశాభావం కలుగుతోందని చరణ్ చెప్పాడు.
కెరీర్ తొలి నాళ్లలో పెద్దగా అవకాశాలు లేనపుడు దక్షిణాదిన వచ్చే ప్రతి ఛాన్సునూ మహా ప్రసాదం అనుకుంటారు. స్టార్ ఇమేజ్…
మెగా హీరోల సినిమాలకు సంబంధించి ఏ ఈవెంట్ అయినా.. అందులో ఎక్కడో ఒక చోట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్…
హైదరాబాద్ శిల్పకళా వేదికలో జరిగిన పెద్ది సక్సెస్ మీట్ కోసం వేలాది అభిమానులు తరలివచ్చారు. ఈ సినిమాకు సంబంధించి ఇదే…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేస్తూ విపక్ష వైసీపీ ఇటీవల డోస్ పెంచిన…
ప్రతి సంవత్సరం విజయ్కి స్పెషల్ పిక్తో పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పే త్రిష.. ఈసారి చెప్పలేదు. ఇన్స్టాగ్రామ్లో కూడా ఆయన్ని…
నిజమే…ఆ ఇద్దరూ కలిశారు. రాష్ట్ర అభివృద్ది కోసం రాజకీయాలను పక్కనపెట్టేశారు. అంతే… ఇద్దరు ముగ్గురయ్యారు. ఆ ముగ్గురూ నలుగురయ్యారు. వెరసి…