ఇంకా మొదలుకాకపోయినా సూపర్ స్టార్ రజనీకాంత్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబోలో తెరకెక్కబోయే ప్యాన్ ఇండియా మూవీ మీద అప్పుడే ఓ రేంజ్ అంచనాలు మొదలయ్యాయి. ప్రతి సినిమాకు హైప్ అంతకంతా పెంచుకుంటూ పోతున్న ఈ ట్రెండీ డైరెక్టర్ ఎన్ని లోపాలున్నా సరే లియోని ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ చేశాడో చూశాం. దాంట్లో జరిగిన పొరపాట్లు తలైవర్ చిత్రంలో రిపీట్ చేయనని హామీ ఇస్తున్న లోకేష్ విజయ్ లియోకి హాలీవుడ్ మూవీ ఏ హిస్టరీ అఫ్ వయొలెన్స్ నుంచి స్ఫూర్తి తీసుకున్న సంగతి తెలిసిందే. దాన్ని ఓపెన్ గా టైటిల్ కార్డులోనే వేసుకుని మరీ నిజాయితీ చూపించాడు.
ఇప్పుడు రజని 171 కోసం ఇదే ఫార్ములా వాడబోతున్నట్టు తెలిసింది. 2013లో వచ్చిన ‘ది పర్జ్’ ఆధారంగా స్క్రిప్ట్ సిద్ధం చేసినట్టు ఇన్ సైడ్ టాక్. దీని కథ చాలా వెరైటీగా ఉంటుంది. అమెరికన్ ప్రభుత్వం ఓ పన్నెండు గంటల పాటు విచిత్రమైన జిఓ అమలు చేస్తుంది. దీని ప్రకారం ఆ సమయంలో ఎలాంటి క్రిమినల్ యాక్టివిటీ చేసినా ఎలాంటి చర్యలు ఉండవు. ఫోన్ చేసినా పోలీసులు రారు. హాస్పిటల్స్ కి కాల్ చేసినా ఆంబులెన్స్ పలకవు. ఇలాంటి దారుణమైన పరిస్థితుల్లో హీరో తనతో పాటు కుటుంబాన్ని, ఆపదలో ఉన్న వాళ్ళను ఎలా కాపాడతాడానే పాయింట్ తో రూపొందింది.
మన నేటివిటీకి ఇది సెట్ కాదు కాబట్టి మెయిన్ పాయింట్ తీసుకుని దానికి చాలా మార్పులు చేశారట. రజనికి బంగారం స్మగ్లర్ బ్యాక్ డ్రాప్ ని జోడించినట్టు మూడు రోజుల క్రితమే లీకయ్యింది. కళగు టైటిల్ ప్రచారంలోకి వచ్చేసింది. ఈ లెక్కన లోకేష్ కనగరాజ్ ఎవరితో సినిమా చేసినా ఎక్కడి నుంచో ఇన్స్ పిరేషన్ తీసుకుంటూనే ఉంటాడన్న మాట. దీనికి అనిరుద్ రవిచందరే సంగీతం సమకూర్చబోతున్నాడు. వేసవిలోగా షూటింగ్ మొదలుపెట్టి నాలుగైదు నెలల్లో పూర్తి చేసేలా పక్కా ప్లాన్ సిద్ధమవుతోందట. ఖైదీ తరహాలో కేవలం ఒక్క రాత్రిలో జరిగే సంఘటనలతో కళగు ఉంటుందని మరో లీక్.
This post was last modified on April 5, 2024 8:29 am
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…