బాలీవుడ్ లోనే కాదు ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న రామాయణం అధికారికంగా ప్రకటించకుండానే రకరకాల వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. ప్రాజెక్టు ఉంటుందనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఎటొచ్చి ఎప్పుడు ప్రారంభిస్తారనేది సస్పెన్స్ గా ఉంది. దర్శకుడు నితీష్ తివారి ఆల్రెడీ పనులు మొదలుపెట్టారని, లాంఛనంగా గ్రాండ్ ఓపెనింగ్ చేయకపోయినా తనకున్న సెంటిమెంట్స్ ని అనుసరించి సైలెంట్ గా చేస్తున్నారని సమాచారం. రాముడిగా రన్బీర్ కపూర్, సీతగా సాయిపల్లవి మాత్రం ఇప్పటిదాకా ఖరారుగా వినిపిస్తున్న క్యాస్టింగ్ పేర్లు.
తీసేది హిందీలోనే అయినా ప్రతి భాషకు సంబంధించి అనువాదాన్ని ప్రత్యేక శ్రద్ధతో ప్లాన్ చేసుకున్నారని తెలిసింది. అందులో భాగంగానే తెలుగు సంభాషణల కోసం త్రివిక్రమ్ శ్రీనివాస్ ని సంప్రదించినట్టు స్పెషల్ న్యూస్. దర్శకుడయ్యాక త్రివిక్రమ్ బయట సినిమాలకు రాయడం మానేశారు. విజయభాస్కర్ తో అనుబంధం, చిరంజీవి మీద అభిమానంతో ఒక్క జై చిరంజీవకు మాత్రమే డైలాగులు రాశారు. ఆ తర్వాత మళ్ళీ పవన్ కోసం భీమ్లా నాయక్, బ్రోలకు పెన్ను బలం అందించారు. అయితే రామాయణం డబ్బింగ్ మూవీ అవుతుంది కాబట్టి ఒప్పుకోవడం అనుమానమే.
కానీ నితీష్ ఆలోచన వేరుగా ఉందట. అవసరమైతే హిందీ, తమిళం, తెలుగు మూడు భాషల్లో వేర్వేరుగా షూట్ చేసే దిశగా కూడా ప్లాన్ చేస్తున్నారట. అలా జరిగిన పక్షంలో పైన చెప్పింది నిజం కావొచ్చు. ఇతిహాసాలు, పురాణాల మీద తిరుగులేని పట్టున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎస్ అనాలే కానీ అద్భుతమైన మాటలు చూసే అవకాశం దక్కుతుంది. ఒకవేళ వద్దనుకుంటే నెక్స్ట్ ఆప్షన్ గా సాయి మాధవ్ బుర్రాని అనుకుంటున్నారట. అధికారిక ప్రకటనలు వచ్చే దాకా ఇవన్నీ రైటో రాంగో చెప్పలేం కానీ మొత్తానికి లీకవుతున్న అప్డేట్స్ మాత్రం ఆసక్తికరంగానే ఉంటున్నాయి
This post was last modified on April 3, 2024 10:21 pm
తను స్వతహాగా రష్యన్ అయినా.. పుట్టి పెరిగింది రష్యాలోనే అయినా.. పవన్ కళ్యాణ్ను పెళ్లి చేసుకున్నాక పూర్తిగా ఒక తెలుగింటి…
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య ఎంత స్నేహం ఉందో తెలిసిందే. ఆర్ఆర్ఆర్ షూటింగ్, ప్రమోషన్స్ టైంలో కనిపించినంతగా ఇప్పుడు…
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో చాలామంది హాలీవుడ్ సినిమాల నుంచి స్ఫూర్తి పొంది కథలు, సన్నివేశాలు తీర్చిదిద్దుకున్న వాళ్లే. ఇప్పుడు ఇండియా…
అక్కినేని నాగేశ్వరరావు మనవడు సుమంత్ను చూస్తే పెద్ద స్టార్ కావడానికి అవసరమైన అన్ని లక్షణాలు ఉన్నట్లే కనిపిస్తాడు. ఆరడుగుల ఆజానుబాహుడు,…
పోలవరం జిల్లా ఈర్లపల్లి గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్ధిని ముర్రం శివాని ఆత్మహత్య చేసుకుంది. దీనికి సంబంధించిన కారణాలు…
తెలంగాణలో ఆక్రమ కట్టడాలకు సింహ స్వప్నంగా మారిన హైడ్రా విధానంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తమ మాటంటే హైడ్రాకు…