బాలీవుడ్ లోనే కాదు ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న రామాయణం అధికారికంగా ప్రకటించకుండానే రకరకాల వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. ప్రాజెక్టు ఉంటుందనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఎటొచ్చి ఎప్పుడు ప్రారంభిస్తారనేది సస్పెన్స్ గా ఉంది. దర్శకుడు నితీష్ తివారి ఆల్రెడీ పనులు మొదలుపెట్టారని, లాంఛనంగా గ్రాండ్ ఓపెనింగ్ చేయకపోయినా తనకున్న సెంటిమెంట్స్ ని అనుసరించి సైలెంట్ గా చేస్తున్నారని సమాచారం. రాముడిగా రన్బీర్ కపూర్, సీతగా సాయిపల్లవి మాత్రం ఇప్పటిదాకా ఖరారుగా వినిపిస్తున్న క్యాస్టింగ్ పేర్లు.
తీసేది హిందీలోనే అయినా ప్రతి భాషకు సంబంధించి అనువాదాన్ని ప్రత్యేక శ్రద్ధతో ప్లాన్ చేసుకున్నారని తెలిసింది. అందులో భాగంగానే తెలుగు సంభాషణల కోసం త్రివిక్రమ్ శ్రీనివాస్ ని సంప్రదించినట్టు స్పెషల్ న్యూస్. దర్శకుడయ్యాక త్రివిక్రమ్ బయట సినిమాలకు రాయడం మానేశారు. విజయభాస్కర్ తో అనుబంధం, చిరంజీవి మీద అభిమానంతో ఒక్క జై చిరంజీవకు మాత్రమే డైలాగులు రాశారు. ఆ తర్వాత మళ్ళీ పవన్ కోసం భీమ్లా నాయక్, బ్రోలకు పెన్ను బలం అందించారు. అయితే రామాయణం డబ్బింగ్ మూవీ అవుతుంది కాబట్టి ఒప్పుకోవడం అనుమానమే.
కానీ నితీష్ ఆలోచన వేరుగా ఉందట. అవసరమైతే హిందీ, తమిళం, తెలుగు మూడు భాషల్లో వేర్వేరుగా షూట్ చేసే దిశగా కూడా ప్లాన్ చేస్తున్నారట. అలా జరిగిన పక్షంలో పైన చెప్పింది నిజం కావొచ్చు. ఇతిహాసాలు, పురాణాల మీద తిరుగులేని పట్టున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎస్ అనాలే కానీ అద్భుతమైన మాటలు చూసే అవకాశం దక్కుతుంది. ఒకవేళ వద్దనుకుంటే నెక్స్ట్ ఆప్షన్ గా సాయి మాధవ్ బుర్రాని అనుకుంటున్నారట. అధికారిక ప్రకటనలు వచ్చే దాకా ఇవన్నీ రైటో రాంగో చెప్పలేం కానీ మొత్తానికి లీకవుతున్న అప్డేట్స్ మాత్రం ఆసక్తికరంగానే ఉంటున్నాయి
This post was last modified on April 3, 2024 10:21 pm
ఏపీ సీఎం చంద్రబాబు ఏ చిన్న అవకాశాన్నీ వదలట్లేదా? అంటే.. ఔననే సమాధానమే వస్తోంది. పెట్టుబడులకు ఎక్కడ అవకాశం ఉంటే..…
ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో శాసన సభను బాయ్కాట్ చేసిన వైసీపీ ప్రజాప్రతినిధులు శాసన మండలిలో మాత్రం చిందులు తొక్కుతున్నారు.…
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…