బాలీవుడ్ లోనే కాదు ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న రామాయణం అధికారికంగా ప్రకటించకుండానే రకరకాల వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. ప్రాజెక్టు ఉంటుందనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఎటొచ్చి ఎప్పుడు ప్రారంభిస్తారనేది సస్పెన్స్ గా ఉంది. దర్శకుడు నితీష్ తివారి ఆల్రెడీ పనులు మొదలుపెట్టారని, లాంఛనంగా గ్రాండ్ ఓపెనింగ్ చేయకపోయినా తనకున్న సెంటిమెంట్స్ ని అనుసరించి సైలెంట్ గా చేస్తున్నారని సమాచారం. రాముడిగా రన్బీర్ కపూర్, సీతగా సాయిపల్లవి మాత్రం ఇప్పటిదాకా ఖరారుగా వినిపిస్తున్న క్యాస్టింగ్ పేర్లు.
తీసేది హిందీలోనే అయినా ప్రతి భాషకు సంబంధించి అనువాదాన్ని ప్రత్యేక శ్రద్ధతో ప్లాన్ చేసుకున్నారని తెలిసింది. అందులో భాగంగానే తెలుగు సంభాషణల కోసం త్రివిక్రమ్ శ్రీనివాస్ ని సంప్రదించినట్టు స్పెషల్ న్యూస్. దర్శకుడయ్యాక త్రివిక్రమ్ బయట సినిమాలకు రాయడం మానేశారు. విజయభాస్కర్ తో అనుబంధం, చిరంజీవి మీద అభిమానంతో ఒక్క జై చిరంజీవకు మాత్రమే డైలాగులు రాశారు. ఆ తర్వాత మళ్ళీ పవన్ కోసం భీమ్లా నాయక్, బ్రోలకు పెన్ను బలం అందించారు. అయితే రామాయణం డబ్బింగ్ మూవీ అవుతుంది కాబట్టి ఒప్పుకోవడం అనుమానమే.
కానీ నితీష్ ఆలోచన వేరుగా ఉందట. అవసరమైతే హిందీ, తమిళం, తెలుగు మూడు భాషల్లో వేర్వేరుగా షూట్ చేసే దిశగా కూడా ప్లాన్ చేస్తున్నారట. అలా జరిగిన పక్షంలో పైన చెప్పింది నిజం కావొచ్చు. ఇతిహాసాలు, పురాణాల మీద తిరుగులేని పట్టున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎస్ అనాలే కానీ అద్భుతమైన మాటలు చూసే అవకాశం దక్కుతుంది. ఒకవేళ వద్దనుకుంటే నెక్స్ట్ ఆప్షన్ గా సాయి మాధవ్ బుర్రాని అనుకుంటున్నారట. అధికారిక ప్రకటనలు వచ్చే దాకా ఇవన్నీ రైటో రాంగో చెప్పలేం కానీ మొత్తానికి లీకవుతున్న అప్డేట్స్ మాత్రం ఆసక్తికరంగానే ఉంటున్నాయి
This post was last modified on April 3, 2024 10:21 pm
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…