Movie News

తెలుగు ప్రేక్షకుల తత్వం బోధపడిన పృథ్విరాజ్

పృథ్విరాజ్ సుకుమారన్ ఆడు జీవితం ది గోట్ లైఫ్ కు విమర్శకుల నుంచి అద్భుతమైన ప్రశంసలు దక్కాయి. జాతీయ అవార్డు ఖాయమని జోస్యం చెబుతున్నారు. కేరళతో పాటు ఓవర్సీస్ మలయాళ ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. వంద కోట్ల గ్రాస్ ఖాయమని ట్రేడ్ నమ్మకంగా ఉంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఇది ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోయింది. టిల్లు స్క్వేర్ ప్రభంజనం వల్ల ఎవరూ పట్టించుకోలేదనే స్టేట్ మెంట్ కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయినా సరే దానికి ఎదురుగా ఇంకో కంటెంట్ ఉన్న సినిమా ఉంటే ఆడియన్స్ ఆదరిస్తారు. అందులో డౌట్ లేదు.

హైదరాబాద్ వచ్చి మరీ పృథ్విరాజ్ ప్రమోషన్లు చేసుకున్నప్పటికీ జనాలకు అవి రీచ్ కాలేదు. కారణాలు బోలెడు. మొదటిది మూడు గంటలు సాగే సుదీర్ఘమైన ఎమోషనల్ డ్రామాలు తెలుగు ప్రేక్షకులకు అంతగా అలవాటు లేదు . పైగా ఏదో కష్టాలు మర్చిపోయి కాసేపు ఎంజాయ్ చేద్దామని థియేటర్ కు వస్తే గల్ఫ్ దేశంలో ఒక మనిషి పడే నరకయాతనని అంతసేపు చూసేందుకు ఇష్టపడలేదు. పెర్ఫార్మన్స్ పరంగా కట్టిపడేసిన మాట వాస్తవమే కానీ మన జనాలకు కనెక్ట్ అయ్యేలా డ్రామా, ఎమోషన్లు లేకపోవడం మైనసయ్యింది. పైగా మ్యూజికల్ గానూ పాటలు పదే పదే వినేలా అనిపించలేదు.

ఇదే కంటెంట్ కేరళవాసులకు కనెక్ట్ అవ్వడంలో ఆశ్చర్యం లేదు. వాళ్లకు స్లో డ్రామాలు అలవాటే. మొన్నటికి మొన్న మమ్ముట్టి భ్రమయుగం అక్కడ రికార్డులు సాధిస్తే ఇక్కడ మొదటి వీకెండ్ కే చేతులు ఎత్తేసింది. సో మలయాళీ హీరోలు టాలీవుడ్ లవర్స్ తత్వాన్ని అర్థం చేసుకోవాలి. వేగం, భావోద్వేగం, ఎంటర్ టైన్మెంట్, యాక్షన్ వీటిలో ఏ జానర్ తీసుకున్నా కట్టిపడేసే అంశాలు ఉంటే తప్ప ఆదరణ దక్కడం కష్టం. ప్రేమలు ఏపీ తెలంగాణలో 17 కోట్లు ఎలా వసూలు చేసిందని విశ్లేషణ చేసుకుంటే సమాధానం దొరికేస్తుంది. ఫలితం చూశాక వరదరాజ మన్నార్ కు ఈ తత్వం బోధపడినట్టే ఉంది.

This post was last modified on April 2, 2024 6:21 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

రవితేజ సమస్యే నానికి వచ్చిందా

కథలు, కాంబోలు చూసేందుకు ఎంత బాగున్నా బడ్జెట్ విషయంలో ప్రాక్టికల్ గా ఆలోచించకపోతే చాలా సమస్యలు తలెత్తే పరిస్థితులను నిర్మాతలు…

1 hour ago

విశ్వంభరలో స్టాలిన్ అక్కయ్య

చిరంజీవి హీరోగా వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న విశ్వంభర షూటింగ్ ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్విరామంగా జరిగిపోతోంది. ఎన్నికలు ప్లస్ విదేశీ…

2 hours ago

151 కన్నా ఎక్కువ స్థానాలు గెలుస్తాం..ఐ-ప్యాక్ తో జగన్

ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ముగిసిన అనంతరం సీఎం జగన్ తొలిసారి బయటకు వచ్చారు. విజయవాడలోని ఐ-ప్యాక్ ఆఫీసును జగన్ సందర్శించారు.…

3 hours ago

జాన్వీకి చుక్కలు చూపించిన క్రికెట్

ఒకేసారి ఆర్ఆర్ఆర్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ సరసన రెండు వేర్వేరు ప్యాన్ ఇండియా సినిమాలతో గ్రాండ్ టాలీవుడ్…

3 hours ago

రియాక్షన్లు గమనిస్తున్నారా పూరి గారూ

నిన్న విడుదలైన డబుల్ ఇస్మార్ట్ టీజర్ పట్ల రామ్ అభిమానుల స్పందన కాసేపు పక్కనపెడితే సగటు ప్రేక్షకులకు మాత్రం మరీ…

5 hours ago

సెలవుల శుక్రవారం….హారతి కర్పూరం

ఒకవైపు జనాలు రావడం లేదని తెలంగాణ సింగల్ స్క్రీన్ థియేటర్లు పది రోజులు మూసేయాలని నిర్ణయించుకుంటే ఇంకోవైపు రేపు రిలీజ్…

6 hours ago