బాక్సాఫీస్ దగ్గర కొన్ని సినిమాలకు అన్నీ భలేగా కలిసి వస్తాయి. కంటెంట్ యావరేజ్గా ఉన్నా సరే.. అవి ఊహించని స్థాయిలో వసూళ్లు రాబడుతుంటాయి. ఇప్పుడు టిల్లు స్క్వేర్ అనే మూవీకి అలాగే కలిసొస్తోంది. సిద్ధు జొన్నలగడ్డకు ఉన్న మంచి ఇమేజ్.. డీజే టిల్లు పాత్ర పట్ల జనాల్లో ఉన్న క్రేజ్.. చాన్నాళ్లుగా సరైన సినిమా లేక బాక్సాఫీస్ స్లంప్లో ఉండడం.. పైగా వేసవి సీజన్.. ఇవన్నీ కలిసి వచ్చి ఈ చిత్రం సంచలన వసూళ్లు రాబడుతోంది.
ఇలాంటి మీడియం రేంజ్ మూవీకి తొలి రోజు రూ.25 కోట్ల వసూళ్లు రావడం అంటేనే ఒక సంచలనం. ఐతే టిల్లు స్క్వేర్ ఊపు ఒక్క రోజుకు పరిమితం కాలేదు. శని, ఆదివారాల్లో కూడా ఈ సినిమా వసూళ్ల మోత మోగించింది. వరల్డ్ వైడ్ తొలి వీకెండ్లో ఏకంగా రూ.68 కోట్ల వసూళ్లు రాబట్టింది టిల్లు స్క్వేర్.
ఈ సినిమా రేంజికి ఈ వసూళ్లు అసాధారణం. విశేషం ఏంటంటే.. ఈ వీకెండ్లో ఇండియా మొత్తానికి హైయెస్ట్ గ్రాసర్ ఇదే. బాలీవుడ్లో కరీనా కపూర్, కృతి సనన్, టబు నటించిన క్రేజీ మూవీ క్రూ గత శుక్రవారమే రిలీజైంది. దానికి మంచి టాక్ కూడా వచ్చింది. ఓపెనింగ్స్ కూడా ఘనంగానే వచ్చాయి. కానీ ఆ సినిమా కూడా టిల్లు స్క్వేర్ వెనుకే నిలిచింది.
దేశవ్యాప్తంగా మార్కెట్ ఉన్న హిందీ చిత్రానికి వచ్చిన వసూళ్ల కంటే రీజనల్ మూవీ అయిన టిల్లు వసూళ్లే ఎక్కువ. క్రూ మూవీకి వీకెండ్లో రూ.62.5 కోట్ల మేర వసూళ్లు వచ్చాయి. దానికంటే టిల్లు స్క్వేర్కు ఐదు కోట్లు ఎక్కువే కలెక్షన్ వచ్చింది. ఇండియాలో మరే భాషలో సినిమాలు కూడా ఈ వీకెండ్లో ఈ స్థాయిలో వసూళ్లు రాబట్టలేదు. యుఎస్లో ఈ చిత్రం 1.5 మిలియన్ డాలర్ల మార్కుకు చేరువగా ఉండడం విశేషం.
This post was last modified on April 1, 2024 10:40 pm
2009లో అవతార్ సినిమా రిలీజైనపుడు వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ ఎలా షేక్ అయిపోయిందో తెలిసిందే. అప్పటిదాకా ఉన్న అన్ని బాక్సాఫీస్…
ఉప్పెన సినిమా చేసే సమయానికి కృతి శెట్టి వయసు కేవలం 17 ఏళ్లే. అంత చిన్న వయసులోనే ఆమె భారీ…
ఒకప్పుడు అప్పు చేయాలంటే భయపడేవాళ్లు, అది అవసరానికి మాత్రమే తీసుకునేవాళ్లు. కానీ ఇప్పుడు సీన్ మారింది. అప్పు చేయడం తప్పు…
కూలీ సినిమా విడుదలకు ముందు దర్శకుడు లోకేష్ కనకరాజ్ భవిష్యత్ ప్రాజెక్టుల గురించి ఎంత చర్చ జరిగిందో.. ఎన్ని ఊహాగానాలు…
అఖిల్ కెరీర్ను మార్చేస్తుందని.. అతడిని పెద్ద స్టార్ను చేస్తుందని అక్కినేని అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్న సినిమా.. ఏజెంట్. అతనొక్కడే,…
ప్రముఖ శ్రీ కృష్ణ క్షేత్రం ఉడిపిలోని పుట్టిగే శ్రీ కృష్ణ మఠం ఆధ్వర్యంలో నిర్వహించిన బృహత్ గీతోత్సవ కార్యక్రమంలో ఏపీ…