ఇటీవలే విడుదలైన ది గోట్ లైఫ్ ఆడు జీవితంలో పృథ్విరాజ్ సుకుమారన్ నటనకు సర్వత్రా నీరాజనాలు అందుతున్నాయి. జాతీయ అవార్డు వస్తే ఆశ్చర్యం లేదని, ఆస్కార్ కు సైతం పంపాల్సిన అద్భుతమైన పెర్ఫార్మన్స్ ఇచ్చాడని విమర్శకులు పొగుడుతున్నారు. ఇందులో అతిశయోక్తి లేదు. అయితే తెలుగులో టిల్లు స్క్వేర్ ప్రభంజనం, గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ క్రేజ్ వల్ల ఆశించిన స్థాయిలో రన్ రావడం లేదు. కానీ ప్రపంచవ్యాప్తంగా మలయాళం వెర్షన్ ఆదివారం ముందే 50 కోట్ల గ్రాస్ దాటేయడమే కాక కేరళ టాప్ 5లో చోటు సంపాదించడం ఖాయమని అక్కడి విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఇది కాసేపు పక్కనపెడితే పృథ్విరాజ్ సుకుమారన్ విలన్ గా నటించిన బాలీవుడ్ మూవీ బడేమియా చోటేమియా ఏప్రిల్ 10 రంజాన్ కానుకగా రిలీజ్ కానుంది. అక్షయ్ కుమార్, టైగర్ శ్రోఫ్ హీరోలుగా రూపొందిన ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ తెలుగులో కూడా రానుంది. అయితే ట్రైలర్ వచ్చినప్పటి నుంచి దీని మీద నెగటివ్ క్యాంపైన్ ఎక్కువగా జరుగుతోంది. రొటీన్ యాంటీ పాకిస్థాన్ అంశాన్ని తీసుకుని, ఇద్దరు ఫ్లాప్ హీరోలతో సూపర్ హిట్ సినిమా తీసే ప్రయత్నం చేశారని నెటిజెన్లు తలంటారు. అలాంటి సినిమాలో శత్రుదేశం ప్రతినిథిగా నటించాడు పృథ్విరాజ్ సుకుమారన్.
ఒకవేళ ఈ పాత్ర కనక రొటీన్ గా ఉంటే కనక ట్రోలింగ్ కు గురి కావాల్సి వస్తుందని ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. ఎందుకంటే గోట్ లైఫ్ ఆడు జీవితం తీసుకొచ్చిన పేరు అంతా ఇంతా కాదు. అదంతా బడేమియా చోటేమియా వల్ల తగ్గిపోకూడదు. నిజానికి ట్రైలర్ లో పృథ్విరాజ్ మొహాన్ని రివీల్ చేయలేదు. కేవలం మాస్క్ ఉన్న మనిషిగా చూపించారు. అలాని వెరైటీ గెటప్ ఏమి ఉండదు. ఎన్నో సినిమాల్లో చూసిన తరహాలో డిజైన్ చేశారు. ఇదంతా ఓకే కానీ క్లైమాక్స్ లో అక్షయ్, టైగర్ ల చేతిలో దెబ్బలు తిని చనిపోయే ఎపిసోడ్ మాత్రం ఉండకూడదని ఫ్యాన్స్ కోరిక. జరిగే పనేనా.
This post was last modified on March 31, 2024 11:16 pm
మొన్న ఏడాది వచ్చిన వరుణ్ తేజ్ 'మట్కా'ని సామాన్య ప్రేక్షకులు మర్చిపోయి ఉండొచ్చు కానీ అభిమానులకు మాత్రం పీడకలలా నిలిచిపోయింది.…
నిన్న కీలకమైన వీకెండ్ పూర్తయ్యింది. శుక్రవారం విడుదలైన తిమ్మరాజుపల్లి టీవీ, పాపం ప్రతాప్ ఆశలన్నీ సండే మీద పెట్టుకుని ప్రమోషన్లు…
సమ్మర్ సీజన్ లో ఏప్రిల్ చివరి వారం సినిమాలకు చాలా మంచి టైం. వేసవి పీక్స్ లో ఉండటంతో పాటు…
గంధపు చెక్కల స్మగ్లర్గా.. దేశవ్యాప్తంగా ఒకప్పుడు సంచలనం రేపిన వీరప్పన్ గురించి అందరికీ తెలిసిందే. కర్ణాటక నుంచి తమిళనాడు వరకు…
ఎన్నికల రాజకీయాల్లో ఆరితేరిన ప్రధాని నరేంద్ర మోడీ.. సమయం.. సందర్భంతోపాటు సెంటిమెంటుకు కూడా ప్రాధాన్యం ఇస్తారు. సాధారణ ప్రజలకు అత్యంతచేరువ…
రెండేళ్ల క్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి సూపర్ 6 పేరిట ఇచ్చిన హామీలు బాగా…