యువ దర్శకులు కొందరు స్టేజ్ మీద డ్యాన్సులవీ వేస్తుంటారు కానీ.. స్టార్ డైరెక్టర్లు ఆ పని చేయడం అరుదు. దర్శకులంటే హుందాగా ఉండాలి, డ్యాన్సులేయడం ఏంటి అనే అభిప్రాయంతో ఉంటారు చాలామంది. ఐతే ఇప్పుడు దేశంలోనే నంబర్ వన్ దర్శకుడైన రాజమౌళి ఒక వేడుకలో డ్యాన్స్ చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. విశేషం ఏంటంటే.. ఆయనతో పాటుగా భార్య రమ కూడా నృత్యం చేయడం.
ఐతే వీళ్లిద్దరూ కలిసి స్టేజ్పై సందడి చేసింది సినిమా వేడుకలో కాదు. ఒక ఫ్యామిలీ ఫంక్షన్లో. ఆ వేడుక ఏంటి అనే వివరాలు తెలియలేదు కానీ.. ఫ్యామిలీ ఫంక్షన్లో ఇద్దరూ కలిసి ఓ పాటకు డ్యాన్స్ చేసి అక్కడి వారందరినీ అలరించారు.
ప్రేమికుడు సినిమాలోని అందమైన ప్రేమరాణి చేయి తగిలితే.. పాటకు ఎంతో హుషారుగా డ్యాన్స్ చేశారు రాజమౌళి, రమ. జక్కన్న చాలా హుషారుగా స్టెప్పులేస్తున్న తీరు చూస్తే ఆశ్చర్యం కలగక మానదు. రెండేళ్ల కిందట ఆర్ఆర్ఆర్తో పలకరించాక కొంత కాలం విశ్రాంతి తీసుకున్న రాజమౌళి.. ఆ తర్వాత మహేష్ బాబు సినిమా స్క్రిప్టు పనుల్లో మునిగిపోయారు. ఈ మధ్యే స్క్రిప్ట్ లాక్ అయింది. ప్రస్తుతం ప్రి ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది చిత్ర బృందం.
ఎప్పుడూ రాజమౌళి సినిమాలకు ఛాయాగ్రహణం అందించే సెంథిల్ కుమార్ వేరే కారణాలతో ఈ సినిమా నుంచి తప్పుకున్నాడు. పి.ఎస్.వినోద్ ఆ బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. ఇది ఇండియానా జోన్స్ తరహా అడ్వెంచరస్ థ్రిల్లర్ అని టీం ముందు నుంచి చెబుతోంది. ప్రస్తుతం మహేష్ ఈ మూవీ కోసం లుక్ మార్చుకునే పనిలో ఉన్నాడు. ఈ ఏడాది ద్వితీయార్ధంలో ఈ మెగా మూవీ సెట్స్ మీదికి వెళ్లొచ్చు.
This post was last modified on March 31, 2024 11:18 pm
వెంకటేష్ ఫిల్మోగ్రఫీలో నువ్వు నాకు నచ్చావ్ చాలా ప్రత్యేక స్థానం సంపాదించుకున్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వచ్చి పాతిక సంవత్సరాలు…
చిన్న హీరోలు వేగంగా ఎక్కువ సినిమాలు చేయడం రెమ్యునరేషన్ పరంగా సంతృప్తినిస్తుందేమో కానీ కెరీర్ పరంగా ఒక్కోసారి ఇదే పెద్ద…
స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ తరఫున గత ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్కు మద్దతుగా వ్యవహరిస్తూ…
నైజాంలో చాలా ఏళ్ల నుంచి డిస్ట్రిబ్యూషన్లో దిల్ రాజే కింగ్. ఆయన ఈ ఏరియాలో నంబర్ వన్ డిస్ట్రిబ్యూటర్గా ఎదిగాక..…
వచ్చే వారం ది కేరళ స్టోరీ 2 విడుదల కానుంది. మూడేళ్ళ క్రితం వచ్చిన మొదటి భాగం ఎంత సంచలనం…
రాజకీయ పార్టీలు ఓట్ల కోసం కురిపిస్తున్న ఉచితాల ఆఫర్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం…