కొన్ని అరుదైన కలయికలు ఫ్యాన్స్ ఎదురు చూసేలా ఉంటాయి. అలాంటిదే ఆదివారం జరిగింది. తెలుగు డిజిటల్ మీడియా ఫెడరేషన్ ఆరిజిన్ డే సందర్భంగా నిర్వహించిన వేడుకకు చిరంజీవి, విజయ్ దేవరకొండ ముఖ్య అతిథులుగా రావడంతో ఈవెంట్ కళను సంతరించుకుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఎందరో ఇన్ఫ్లూయెన్సర్లతో పాటు ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు విచ్చేయగా మెగాస్టార్ తో ఫ్యామిలీ స్టార్ ముచ్చటించడం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. విజయ్ యాంకర్ గా మారిపోయి ప్రశ్నలు సందిస్తే వాటికి ఓపిగ్గా చిరంజీవి సమాధానం చెప్పడమనే ప్రక్రియను స్టేజి మీద నిర్వహించారు.
వాటిలో కొన్ని ఆసక్తికరంగా ఉన్నాయి. నెగటివిటీని ఎలా ఎదురుకుంటారనే క్వశ్చన్ కు చిరు బదులిస్తూ 1977 కెరీర్ ప్రారంభంలో మదరాసు పాండీ బజారుకు వెళ్ళినప్పుడు నువ్వు హీరోవా అనే రీతిలో కొందరు ఎగతాళి చేశారని, దాంతో తాను నమ్మే హనుమంతుడు ఇచ్చిన ధైర్యంతో ముందుకు వెళ్లానే తప్ప తిరిగి తనను కామెంట్ చేసిన చోటుకి జీవితంలో మళ్ళీ కాలు పెట్టలేదని చెప్పారు. ఎవరినీ పట్టించుకోకుండా సాగడమే లైఫని వివరించారు. ఇంకో ప్రశ్నకు మాట్లాడుతూ తనకు నాన్న వెంకట్ రావే ఫ్యామిలీ స్టారని, ఆయనను చూసే కుటుంబ బాధ్యతలు తెలుసుకున్నానని అన్నారు.
బాగా కిక్ ఇచ్చిన మరో పాయింట్ ఉంది. మిడిల్ క్లాస్ మనస్థత్వాల గురించి చెబుతూ ఇంట్లో రోజు ఫ్యాన్లు, లైట్లు ఎవరూ లేనప్పుడు ఆన్ లో ఉంటే వెంటనే స్మార్ట్ ఫోన్ ద్వారా చెక్ చేసుకుని ఆపేస్తానని, సబ్బులు మిగిలిపోతే వాటిని ముద్దగా చేసుకుని తిరిగి వాడుకుంటానే తప్ప పారేయనని అన్నారు. విజయ్ దేవరకొండ సైతం షాంపూ బాటిల్ అయిపోతే కొన్ని నీళ్లు కలుపుకుని మొత్తం ఖాళీ అయ్యాకే పారేస్తానని చెప్పడం చిరుకి బాగా కనెక్ట్ అయ్యింది. ఇలా ఎన్నో విషయాలను ఇద్దరు పంచుకున్న తీరు అభిమానులకే కాదు అక్కడికి వచ్చిన ఆహూతులకు, అభిమానులకు భలే కిక్ ఇచ్చిన మాట వాస్తవం.
This post was last modified on March 31, 2024 10:21 pm
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…