Movie News

చుక్కల్ని తాకుతున్న త్రిష పారితోషికం

నాలుగు పదుల వయసులో హీరోయిన్లకు డిమాండ్ ఉండటం చాలా అరుదు. ఒకప్పుడు జయసుధ విజయశాంతి కాలంలో చెల్లుబాటు అయిందేమో కానీ ఇప్పటి ట్రెండ్ అభిరుచులే వేరు. కానీ త్రిష మాత్రం దానికి భిన్నంగా క్రేజీ ఆఫర్లు స్వంతం చేసుకోవడమే కాక రెమ్యునరేషన్ పరంగానూ కొత్త రికార్డులు సృష్టిస్తోంది. చెన్నై టాక్ ప్రకారం కమల్ హాసన్ మణిరత్నం కాంబినేషన్ లో రూపొందబోయే థగ్ లైఫ్ కు గాను అక్షరాలా పన్నెండు కోట్ల పారితోషికం తీసుకుందట. అంటే విజయ్ తో చేసిన లియోకి ఇప్పటికి తీసుకునే మొత్తం రెట్టింపు అయ్యిందన్న మాట. డిమాండ్ అలా ఉంది మరి.

త్రిష ప్రస్తుతం చిరంజీవి విశ్వంభర, అజిత్ విడాయుమర్చి, మోహన్ లాల్ రామ్ లో నటిస్తోంది. వీటికి సమానంగా సొమ్ము అందుకోవడం లేదు. బడ్జెట్, కాల్ షీట్లని బట్టి హెచ్చుతగ్గులున్నాయి. థగ్ లైఫ్ ఆఫర్ చేసిందే ఎక్కువ మొత్తమట. అధిక సంఖ్యలో డేట్లు అవసరం ఉండటంతో కొత్త ప్రాజెక్టులు కమిటయ్యే ఛాన్స్ ఉండదు కాబట్టి ఆ మేరకు ఇవ్వడానికి నిర్మాణ సంస్థ ఒప్పుకుందని తెలిసింది. ఇవి అధికారికంగా ప్రకటించేవి కాదు కనక ఆఫ్ ది రికార్డ్ టాక్ గానే పరిగణనలోకి తీసుకోవాలి. విశ్వంభరకు అంత ముట్టజెప్పకపోయినా టాలీవుడ్ హయ్యెస్ట్ తీసుకుందని సమాచారం.

ఇవి కాకుండా విజయ్ ది గ్రేటెస్ట్ అఫ్ ఆల్ టైం(గోట్) ఒక ప్రత్యేక క్యామియో, పాట చేస్తోందని టాక్. మలయాళంలో నివిన్ పౌలీతో ఐడెంటిటీ తన ఖాతాలోనే ఉంది. డైరి ఇంత బిజీగా ఉంటే కొత్త కమిట్ మెంట్లకు ఛాన్స్ ఎక్కడిది. ఇదంతా పొన్నియిన్ సెల్వన్ పుణ్యమే. విజయ్ సేతుపతితో చేసిన 96 బ్లాక్ బస్టర్ అయినా త్రిషలో ఇంకా గ్లామర్ తగ్గలేదని నిరూపించింది మాత్రం పిఎస్ 1,2లే. కుందవైగా అందులో ఆమెని చూసి తినేది అన్నమా లేక అందమా అనే కామెంట్లు వినిపించాయి. దానికి తగ్గట్టే త్రిష సెకండ్ ఇన్నింగ్స్ మాములు జోరుతో కనిపించడం లేదు. మహర్జాతకం అంటే ఇదేనేమో.

This post was last modified on March 31, 2024 12:49 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

మిరల్ రిపోర్ట్ ఏంటి

నిన్న ఎలాగూ కొత్త తెలుగు సినిమాలు లేవనే కారణంగా మిరల్ అనే డబ్బింగ్ మూవీని రిలీజ్ చేశారు. ప్రేమిస్తేతో టాలీవుడ్…

5 hours ago

త్రివిక్రమ్ కోసం స్రవంతి ప్రయత్నాలు

గుంటూరు కారం విడుదలై అయిదు నెలలు పూర్తి కావొస్తున్నా త్రివిక్రమ్ శ్రీనివాస్ కొత్త సినిమా ఇప్పటిదాకా మొదలుకాలేదు. అసలు పూర్తి…

7 hours ago

టీడీపీలో 92 గెలుపు గుర్రాలు.. అధికారం ఖాయ‌మే!

బీజేపీ, జ‌న‌సేన‌లతో కూట‌మి క‌ట్టిన టీడీపీ ఏపీలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో పోరాటం చేసిన విష‌యం తెలిసిందే. పోలింగ్ శాతం పెరిగిన…

8 hours ago

గురుశిష్యులతో రామ్ చరణ్ సింగిల్ ప్లాన్

గేమ్ ఛేంజర్ దెబ్బకు ఏకంగా మూడు సంవత్సరాలకు పైగా దానికే కేటాయించాల్సి వచ్చిన రామ్ చరణ్ శంకర్ మీద ఉన్న…

8 hours ago

జగన్ విమానం ఖర్చు అంతుంటుందా ?

ఎన్నికల సమరం ముగియడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబంతో కలిసి విదేశాలకు విహారయాత్రకు వెళ్లారు. జగన్ విదేశీ పర్యటనకు…

9 hours ago

ప్రేక్షకుల అటెండెన్సుకి ఎవరిది బాధ్యత

చాంతాడంత కారణాలు చెప్పుకుని జనం థియేటర్లకు రావడం లేదని ఎంత బాధ పడినా వాస్తవిక పరిస్థితిని అర్థం చేసుకుంటే కనక…

9 hours ago