నాలుగు పదుల వయసులో హీరోయిన్లకు డిమాండ్ ఉండటం చాలా అరుదు. ఒకప్పుడు జయసుధ విజయశాంతి కాలంలో చెల్లుబాటు అయిందేమో కానీ ఇప్పటి ట్రెండ్ అభిరుచులే వేరు. కానీ త్రిష మాత్రం దానికి భిన్నంగా క్రేజీ ఆఫర్లు స్వంతం చేసుకోవడమే కాక రెమ్యునరేషన్ పరంగానూ కొత్త రికార్డులు సృష్టిస్తోంది. చెన్నై టాక్ ప్రకారం కమల్ హాసన్ మణిరత్నం కాంబినేషన్ లో రూపొందబోయే థగ్ లైఫ్ కు గాను అక్షరాలా పన్నెండు కోట్ల పారితోషికం తీసుకుందట. అంటే విజయ్ తో చేసిన లియోకి ఇప్పటికి తీసుకునే మొత్తం రెట్టింపు అయ్యిందన్న మాట. డిమాండ్ అలా ఉంది మరి.
త్రిష ప్రస్తుతం చిరంజీవి విశ్వంభర, అజిత్ విడాయుమర్చి, మోహన్ లాల్ రామ్ లో నటిస్తోంది. వీటికి సమానంగా సొమ్ము అందుకోవడం లేదు. బడ్జెట్, కాల్ షీట్లని బట్టి హెచ్చుతగ్గులున్నాయి. థగ్ లైఫ్ ఆఫర్ చేసిందే ఎక్కువ మొత్తమట. అధిక సంఖ్యలో డేట్లు అవసరం ఉండటంతో కొత్త ప్రాజెక్టులు కమిటయ్యే ఛాన్స్ ఉండదు కాబట్టి ఆ మేరకు ఇవ్వడానికి నిర్మాణ సంస్థ ఒప్పుకుందని తెలిసింది. ఇవి అధికారికంగా ప్రకటించేవి కాదు కనక ఆఫ్ ది రికార్డ్ టాక్ గానే పరిగణనలోకి తీసుకోవాలి. విశ్వంభరకు అంత ముట్టజెప్పకపోయినా టాలీవుడ్ హయ్యెస్ట్ తీసుకుందని సమాచారం.
ఇవి కాకుండా విజయ్ ది గ్రేటెస్ట్ అఫ్ ఆల్ టైం(గోట్) ఒక ప్రత్యేక క్యామియో, పాట చేస్తోందని టాక్. మలయాళంలో నివిన్ పౌలీతో ఐడెంటిటీ తన ఖాతాలోనే ఉంది. డైరి ఇంత బిజీగా ఉంటే కొత్త కమిట్ మెంట్లకు ఛాన్స్ ఎక్కడిది. ఇదంతా పొన్నియిన్ సెల్వన్ పుణ్యమే. విజయ్ సేతుపతితో చేసిన 96 బ్లాక్ బస్టర్ అయినా త్రిషలో ఇంకా గ్లామర్ తగ్గలేదని నిరూపించింది మాత్రం పిఎస్ 1,2లే. కుందవైగా అందులో ఆమెని చూసి తినేది అన్నమా లేక అందమా అనే కామెంట్లు వినిపించాయి. దానికి తగ్గట్టే త్రిష సెకండ్ ఇన్నింగ్స్ మాములు జోరుతో కనిపించడం లేదు. మహర్జాతకం అంటే ఇదేనేమో.
This post was last modified on March 31, 2024 12:49 pm
ఏ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి దశాబ్దాల పాటు నంబర్ వన్ హీరోగా నిలవడం కోసం మెగాస్టార్ చిరంజీవి ఎంత…
బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన కంగనా రనౌత్.. పరిశ్రమలో ఒక స్థాయి అందుకున్న దగ్గర్నుంచి తాను పని చేసే ఇండస్ట్రీలోనే…
రాష్ట్రంలో హైదరాబాద్ కు చెందిన ఐఐటీయన్ల సర్వే పేరుతో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు రెండు మూడు రోజుల నుంచి…
ఇరుముడి వసూళ్లు చూసి చాలా మందికి అసలేం జరుగుతోందో అర్థం కావడం లేదు. ఎక్కడో మారుమూల మూసేయడానికి రెడీగా ఉన్నాయనిపించే…
స్థానిక ఎన్నికలపై జనసేన త్రిముఖ వ్యూహాన్ని అనుసరిస్తోంది. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో విద్యార్థి మృతి చెందాడు. నిన్న వైజాగ్ ప్రైవేటు స్కూల్లో టీచర్ కొట్టిన దెబ్బలకు యూకేజీ విద్యార్థి…