తెలుగులో చిరుత, టక్ జగదీష్ సాంబ, సాహసం శ్వాసగా సాగిపో లాంటి సినిమాల్లో నటించి పేరు తెచ్చుకున్న డేనియల్ బాలాజీకి ఎక్కువ గుర్తింపు తెచ్చింది మాత్రం ఘర్షణే. వెంకటేష్ బృందంలో కీలక సభ్యుడిగా తమిళంలో చేసిన పాత్రే ఇక్కడ పోషించి సూపర్ హిట్ లో భాగమయ్యాడు. ప్రముఖ హీరో మురళి సోదరుడిగా ఇండస్ట్రీకి వచ్చినా తనకంటూ స్వంత గుర్తింపు కోసం కష్టపడుతూ వచ్చాడు. సంపాదించిన దాంట్లో అధిక శాతం తన ఊరిలో గుడి నిర్మాణం కోసం వెచ్చించిన డేనియల్ కు పరిశ్రమలో అందరితో సత్సంబంధాలు ఉన్నాయి. అందుకే కడచూపు కోసం ఎంతో మంది వచ్చారు.
అలాంటి డేనియల్ బాలాజీ ఇవాళ హఠాత్తుగా గుండెజబ్బుతో కన్నుమూయడం అందరినీ కలవరపరిచింది. అయిదు పదుల వయసు దాటకుండా ఇంకా ఎంతో భవిష్యత్తు ఉన్న నటుడికి ఇలా జరగడం విషాదమే. అయితే తన కోరిక తీరకుండానే కన్నుమూయడం స్నేహితులను ఇంకా బాధ పెడుతోంది. స్వంతంగా దర్శకత్వం చేయాలని ప్లాన్ చేసుకున్న డేనియల్ బాలాజీ స్నేహితుడు ఎంఆర్ గణేష్ ని నిర్మాతగా సెట్ చేసుకున్నాడు. తమిళ తెలుగు కన్నడ భాషల్లో ఏకకాలంలో రూపొందించాలని కథను రాసుకున్నాడు. వేరే హీరోతో తానో ముఖ్య పాత్రలో తీసేలా స్క్రిప్ట్ తీర్చిదిద్దారు.
తీరా చూస్తే విధి రాత మరోలా నిర్దేశించింది. టాలీవుడ్ లో ఎక్కువ సినిమాలు చేయకపోయినా మంచి గుర్తింపు తెచ్చుకున్న డేనియల్ బాలాజీకి దర్శకుడు శివ నిర్వాణ నాని టక్ జగదీష్ లో కీలక పాత్ర ఇచ్చాడు. అయితే థియేటర్ రిలీజ్ కాకపోవడం, డైరెక్ట్ ఓటిటిలో వచ్చినా నెగటివ్ ఫలితం అందుకోవడం వల్ల బ్రేక్ దక్కలేదు. 2002 తమిళ చిత్రం ఏప్రిల్ మాదాతిల తో డెబ్యూ చేసిన డేనియల్ బాలాజీ జూనియర్ ఎన్టీఆర్ సాంబతో తెలుగు ఎంటరు ఇచ్చాడు. గత ఏడాది రిలీజైన అరియవన్ తర్వాత మళ్ళీ తెరమీద కనిపించలేదు. తన అనారోగ్యం ప్రేక్షకులకు శాశ్వతంగా దూరం చేసింది.
రెండు వారాల క్రితం రణ్వీర్ సింగ్ ని మూడేళ్ళ పాటు బ్యాన్ చేస్తున్నట్టు ఫెడరేషన్ అఫ్ వెస్ట్రన్ సినీ ఎంప్లొయీస్…
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇంధనం, బంగారం దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం భారీ స్థాయిలో విదేశీ మారకద్రవ్యాన్ని వెచ్చిస్తున్న విషయం…
అతిలోకసుందరిగా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న హీరోయిన్ శ్రీదేవి. కాలం చేసి సంవత్సరాలు గడుస్తున్నా ఆవిడ వేసిన…
అమరావతిలో పొట్టి శ్రీరాములు స్మృతి వనాన్ని సందర్శించిన అనంతరం జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక…
పవన్ వ్యాఖ్యలపై అందరూ మాట్లాడేశారు.. ఇక మిగిలింది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వంతే! రెండు రోజుల నుంచి తెలుగు…
టెక్సాస్ రాష్ట్రంలోని ఫ్రిస్కో సిటీ హాల్ బయట ఒక అమెరికన్ భారత జాతీయ జెండాను చించివేయడం ఇప్పుడు తీవ్ర దుమారం…