వకీల్ సాబ్ తర్వాత దర్శకుడు వేణు శ్రీరామ్ కు బాగా గ్యాప్ వచ్చేసింది. అల్లు అర్జున్ తో ఐకాన్ ప్లాన్ చేసుకుని కథకు గ్రీన్ సిగ్నల్ ఇప్పించుకుని కూడా ముందుకెళ్లలేకపోవడం తెలిసిందే. దాని స్థానంలోనే నిర్మాత దిల్ రాజు నితిన్ తో తమ్ముడు ఆఫర్ ఇచ్చారు. ప్రస్తుతం దీని షూటింగ్ వేగంగా జరుగుతోంది. ఇవాళ నితిన్ పుట్టినరోజు సందర్భంగా వదిలిన పోస్టర్ మంచి మాస్ గా ఉంది. పవన్ కళ్యాణ్ బ్లాక్ బస్టర్ టైటిల్ కావడంతో ఒక అభిమానిగా తనకిది బాధ్యతాయుతమైన మూవీగా చెప్పుకోవచ్చు. సరే ఇదంతా బాగానే ఉంది కానీ నాని ప్రస్తావన ఎందుకో చూద్దాం.
వేణు శ్రీరామ్ గతంలో నానితో ఎంసీఏ మిడిల్ క్లాస్ అబ్బాయి చేశాడు. ప్రభుత్వ ఉద్యోగి అయిన వదినను విలన్ మాఫియా నుంచి కాపాడటమనే పాయింట్ ని తీసుకుని ప్రేక్షకులను మెప్పించేలా తీశాడు. మొదట్లో చిన్న చిన్న గొడవలు పడ్డా చివరికి ఒక్కటయ్యే వదినా మరుదులుగా నాని భూమికల కాంబినేషన్ ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యింది. ఇప్పుడు తమ్ముడులో నితిన్ అక్కగా సీనియర్ హీరోయిన్ లయ కీలక పాత్ర పోషిస్తోంది. కాకపోతే దీంట్లో అత్తారింటికి వెళ్లిన సోదరి ప్రమాదంలో ఇరుక్కుంటే ఆ కుటుంబం మొత్తాన్ని తన భుజాలపై పెట్టుకుని కాపాడే పాత్ర నితిన్ దట.
కొంచెం మహేష్ బాబు అర్జున్ షేడ్స్ కనిపిస్తున్నా వేణు శ్రీరామ్ ఎంచుకున్న బ్యాక్ డ్రాప్ షాకింగ్ గా ఉంటుందని అంటున్నారు. అందుకే ఫస్ట్ లుక్ లో లారీ, మాస్ గా కనిపించే లేడీ డ్రైవర్, భయాందోళనలో కుటుంబ సభ్యులు, పైన ఆయుధంతో నితిన్ వీటి ద్వారా కాన్సెప్ట్ ఏంటో చెప్పకనే చెప్పారు. కాంతార ఫేమ్ సప్తమి గౌడ హీరోయిన్ గా నటిస్తుండగా అజనీష్ లోకనాథ్ సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. ట్రీట్ మెంట్ లో వైవిధ్యం ఉంటుంది కానీ తన తన కథల్లో కోర్ పాయింట్ హీరో కుటుంబంలోని ముఖ్యమైన లేడీ క్యారెక్టర్ చుట్టే వేణు శ్రీరామ్ నడిపించడం గమనించాల్సిన విషయం.
This post was last modified on March 30, 2024 12:00 pm
ఇవ్వాళ సెప్టెంబర్ 2 వ తేదీ. వైయస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి. సరిగ్గా 17 ఏళ్ళ క్రితం 2009 సెప్టెంబర్…
తెలంగాణా బీజేపీలో ఓ సెకండ్ హ్యాండ్ కారు రచ్చ రచ్చ చేస్తుంది. క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే కమలం పార్టీని రోడ్డు…
ఏపీ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఇవాళ అభిమానులు ఎదురు చూసిన కీలక అప్డేట్ ఓజి 2.…
సోలో హీరోగా దుల్కర్ సల్మాన్ టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాతోనూ వంద కోట్లు వసూలు చేయగలడని నిరూపించిన లక్కీ భాస్కర్ కొనసాగింపు…
తమిళనాడులో నాలుగు నెలల క్రితం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన జోసెఫ్ విజయ్ ప్రజానుకూల విధానాలతో ముందుకు సాగుతున్నారు. తమిళనాడులో అనేక…
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు సుస్మిత చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అయితే,…