వకీల్ సాబ్ తర్వాత దర్శకుడు వేణు శ్రీరామ్ కు బాగా గ్యాప్ వచ్చేసింది. అల్లు అర్జున్ తో ఐకాన్ ప్లాన్ చేసుకుని కథకు గ్రీన్ సిగ్నల్ ఇప్పించుకుని కూడా ముందుకెళ్లలేకపోవడం తెలిసిందే. దాని స్థానంలోనే నిర్మాత దిల్ రాజు నితిన్ తో తమ్ముడు ఆఫర్ ఇచ్చారు. ప్రస్తుతం దీని షూటింగ్ వేగంగా జరుగుతోంది. ఇవాళ నితిన్ పుట్టినరోజు సందర్భంగా వదిలిన పోస్టర్ మంచి మాస్ గా ఉంది. పవన్ కళ్యాణ్ బ్లాక్ బస్టర్ టైటిల్ కావడంతో ఒక అభిమానిగా తనకిది బాధ్యతాయుతమైన మూవీగా చెప్పుకోవచ్చు. సరే ఇదంతా బాగానే ఉంది కానీ నాని ప్రస్తావన ఎందుకో చూద్దాం.
వేణు శ్రీరామ్ గతంలో నానితో ఎంసీఏ మిడిల్ క్లాస్ అబ్బాయి చేశాడు. ప్రభుత్వ ఉద్యోగి అయిన వదినను విలన్ మాఫియా నుంచి కాపాడటమనే పాయింట్ ని తీసుకుని ప్రేక్షకులను మెప్పించేలా తీశాడు. మొదట్లో చిన్న చిన్న గొడవలు పడ్డా చివరికి ఒక్కటయ్యే వదినా మరుదులుగా నాని భూమికల కాంబినేషన్ ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యింది. ఇప్పుడు తమ్ముడులో నితిన్ అక్కగా సీనియర్ హీరోయిన్ లయ కీలక పాత్ర పోషిస్తోంది. కాకపోతే దీంట్లో అత్తారింటికి వెళ్లిన సోదరి ప్రమాదంలో ఇరుక్కుంటే ఆ కుటుంబం మొత్తాన్ని తన భుజాలపై పెట్టుకుని కాపాడే పాత్ర నితిన్ దట.
కొంచెం మహేష్ బాబు అర్జున్ షేడ్స్ కనిపిస్తున్నా వేణు శ్రీరామ్ ఎంచుకున్న బ్యాక్ డ్రాప్ షాకింగ్ గా ఉంటుందని అంటున్నారు. అందుకే ఫస్ట్ లుక్ లో లారీ, మాస్ గా కనిపించే లేడీ డ్రైవర్, భయాందోళనలో కుటుంబ సభ్యులు, పైన ఆయుధంతో నితిన్ వీటి ద్వారా కాన్సెప్ట్ ఏంటో చెప్పకనే చెప్పారు. కాంతార ఫేమ్ సప్తమి గౌడ హీరోయిన్ గా నటిస్తుండగా అజనీష్ లోకనాథ్ సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. ట్రీట్ మెంట్ లో వైవిధ్యం ఉంటుంది కానీ తన తన కథల్లో కోర్ పాయింట్ హీరో కుటుంబంలోని ముఖ్యమైన లేడీ క్యారెక్టర్ చుట్టే వేణు శ్రీరామ్ నడిపించడం గమనించాల్సిన విషయం.
This post was last modified on March 30, 2024 12:00 pm
అమెరికాను నెంబర్ వన్ చేయాలన్న పేరుతో ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటూ.. ప్రపంచాన్ని ఆగమాగం చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇమేజ్…
‘అమరావతి’ని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా నిర్ణయిస్తూ ఏపీ అసెంబ్లీ పెట్టిన తీర్మానం మీద ఇటీవలే ఒక టీవీ ఛానెల్లో చర్చా…
కంటెంట్ మీద ఎంత నమ్మకం ఉన్నా ప్రీమియర్ల విషయంలో నిర్మాతలు ఒకటికి పదిసార్లు ఆలోచించే పరిస్థితులు ఇప్పుడున్నాయి. కొన్నిసార్లు ఈ…
జివి ప్రకాష్ కుమార్ మనకూ బాగా సుపరిచితుడైన సంగీత దర్శకుడు. తమిళంలో అయితే రెగ్యులర్ గా హీరోగా కూడా నటిస్తూ…
ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్లాన్-బీ’గా మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాన్ని…
టాలీవుడ్ టాప్ స్టార్లందరూ తమ సినిమా రిలీజ్ ముంగిట డ్రగ్ టెస్టులు చేసుకోవాలని.. అప్పుడే ఆ సినిమాలు రిలీజ్ అయ్యేలా…