బాలకృష్ణ కెరీర్ లో అతి పెద్ద బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన లెజెండ్ నిన్నటితో 10వ వార్షికోత్సవం పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా నిర్వహించిన వేడుకకు టీమ్ మొత్తం హాజరై కొత్త సినిమా రేంజ్ లో సంబరాలు జరుపుకుంది. రేపు ప్రపంచవ్యాప్తంగా రీ రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ఈవెంట్ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ త్వరలో తమ కాంబినేషన్ లో రాబోయే చిత్రం అంచనాలకు మించి ఉంటుందని, తమ కాంబినేషన్ ఎప్పుడూ మాటలు కాకుండా చేతల్లో ఫలితాన్ని చూపిస్తుందంటూ కొత్త ప్రాజెక్టుని అధికారికంగా స్టేజి మీద ప్రకటించేశారు.
లెజెండ్ దశాబ్దాల తరబడి చెప్పుకునే గొప్ప సినిమాగా నిలిచిపోయిందని, ప్రస్తుత తరంలోని మనవళ్లు, మనవరాళ్లకు సైతం కనెక్ట్ అయ్యేంత గొప్పగా బోయపాటి దీన్ని తీశారని అన్నారు. గతంలో ఇదే కలయికలో వచ్చిన సింహ, మొన్నటి ఏడాది రిలీజైన అఖండ ప్రస్తావన తీసుకొచ్చారు. మహిళల గురించి సందేశం ఇచ్చే ఇలాంటి ప్రయత్నాలకు ప్రేక్షకుల ఆశీర్వాదం దక్కినప్పుడు కలిగే సంతోషాన్ని మాటల్లో వర్ణించలేమని అన్నారు. రేపు బాలయ్య బోయపాటి కొత్త సినిమా ప్రారంభోత్సవం జరగనుంది. లెజెండ్ నిర్మించిన 14 రీల్స్ బ్యానరే దీనికి ప్రొడ్యూసర్ గా వ్యవహరించనున్నారని టాక్.
సో అభిమానులకు ఉన్న డౌట్ పూర్తిగా తీరిపోయినట్టే. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్ టైనర్ చేస్తున్న బాలకృష్ణ అది పూర్తి కావడం ఆలస్యం బోయపాటి శీను సెట్లలో అడుగు పెడతారు. అక్కడి నుంచి రెగ్యులర్ షూటింగ్ ఉంటుంది. ఎన్నికల నేపథ్యంలో కొంత గ్యాప్ తీసుకోనున్న బాలయ్య ఆ తర్వాత వరసగా షూటింగుల్లో పాల్గొంటారు. బోయపాటి మూవీలో హీరోయిన్లు ఎవరు, సంగీత దర్శకుడు ఇతరత్రా టీమ్ ఎవరనే లీక్స్ ఇంకా బయటికి రాలేదు. 1116 రోజులు ఆడిన ఏకైక తెలుగు సినిమాగా టాలీవుడ్ లో రికార్డు సృష్టించిన లెజెండ్ ని మళ్ళీ ఎవరూ దాటలేకపోయారు.
This post was last modified on March 29, 2024 11:25 am
భద్రాద్రి కొత్తగూడెంలో డా.మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన…
ఏపీలో ఒక చిన్న పురుగు ప్రజల్లో టెన్షన్ రేకెత్తిస్తోంది. దాని కారణంగా స్క్రబ్ టైఫస్ అనే వ్యాధి వస్తుంది. అసలు…
కొన్ని రోజుల కిందట కోనసీమ పర్యటన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారిన…
మాములుగా ఒక సినిమా రిలీజయ్యాక దాని ఫలితంతో సంబంధం లేకుండా సక్సెస్ మీట్ల పేరుతో బాణా సంచా కాల్చడం, మీడియా…
ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ మంత్రి నారా లోకేష్.. మంగళవారం మధ్యాహ్నం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో…
ఏపీలో అరటి పండ్ల ధర ఎంత..? ఎందుకీ రాద్దాంతం..? అరటి రైతులు కష్టాలు పడుతున్నారంటూ జగన్ చేసిన వ్యాఖ్యలు చర్చకు…