రెండున్నర దశాబ్దాల కిందట శంకర్-కమల్ హాసన్ కాంబినేషన్లో వచ్చిన ‘ఇండియన్’ మూవీ రేపిన సంచలనం అంతా ఇంతా కాదు. రెండు దశాబ్దాల తర్వాత ఈ మూవీకి సీక్వెల్ చేయడానికి రెడీ అయింది శంకర్-కమల్ జోడీ. కానీ ఏ ముహూర్తాన ఈ చిత్రం మొదలైందో కానీ.. దీన్ని ఎన్నో ఇబ్బందులు వెంటాడాయి. సెట్లో క్రేన్ ప్రమాదంతో ఆగిన షూటింగ్.. తర్వాత కరోనా, ఇతర కారణాలతో ఎంతకీ మొదలు కాలేదు.
రెండేళ్లకు పైగా గ్యాప్ తర్వాత ఏడాది కిందట ‘ఇండియన్-2’ చిత్రీకరణను పున:ప్రారంభించారు. అప్పటికే శంకర్ తీస్తున్న ‘గేమ్ చేంజర్’తో పాటు ఇండియన్-2 చిత్రీకరణను సమాంతరంగా జరపాలని శంకర్ భావించాడు. కానీ ఆ ప్రణాళికలు ఫలించలేదు. ‘గేమ్ చేంజర్’ను పక్కన పెట్టి ‘ఇండియన్-2’ మీదే ఎక్కువ ఫోకస్ పెట్టాడు శంకర్.
ఐతే కొన్ని నెలల కిందటే ‘ఇండియన్-2’ షూట్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు మొదలయ్యాయి. కానీ షూటింగ్ సుదీర్ఘ కాలం చేయడం, పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఎంతకీ పూర్తి కాకపోవడం చర్చనీయాంశం అయింది. కాగా ఇప్పుడు కమల్ ఈ సినిమాకు సంబంధించి ఆశ్చర్యకర విషయం వెల్లడించాడు. తాము కేవలం ‘ఇండియన్-2’ మాత్రమే తీయలేదని.. ఇండియన్-3కి కూడా ఒకేసారి చిత్రీకరణ జరిపామని ఆయన వెల్లడించారు. ఏవో కొన్ని సీన్లు అని కాకుండా ‘ఇండియన్-3’ మొత్తం కూడా పూర్తి చేసేసినట్లు ఆయన వెల్లడించారు.
‘ఇండియన్-2’ రిలీజయ్యాక ‘ఇండియన్-3’ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు మొదలవుతాయని.. ఎక్కువ గ్యాప్ లేకుండా ఆ సినిమాను కూడా రిలీజ్ చేసేస్తామని ఆయన చెప్పారు. ఇండియన్-2 ఈ ఏడాది ద్వితీయార్ధంలో, ఇండియన్-3 వచ్చే ఏడాది ఆరంభంలో వచ్చే అవకాశాలున్నాయి.
This post was last modified on March 25, 2024 4:19 pm
నిర్మాత దిల్ రాజు అన్నట్టు వందల సినిమాలు తీయకపోయినా కెవిఎన్ ప్రొడక్షన్స్ అనేది ఇప్పుడు అన్ని బాషల ఇండస్ట్రీలో హాట్…
మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ‘కాాకా’ నుంచి ఇటీవల రిలీజ్ చేసిన టైటిల్ గ్లింప్స్ మెగా అభిమానులనే కాక సామాన్య…
కింగ్ సైజ్ ఫిలిం మేకర్ అని ఎవరికైనా బిరుదు ఇవ్వాల్సి వస్తే అందరి మదిలో మెదిలే ఒకే ఒక్క పేరు…
మాస్ రాజా రవితేజ నిఖార్సయిన హిట్టు కొట్టి నాలుగేళ్లయింది. ఈ నాలుగేళ్లలో ఆయన ఆరు చిత్రాలతో పలకరించాడు. వీటిలో కొన్ని…
ఏదైనా మితంగా తింటేనే అందం. మితిమీరిందా పొట్ట ఉబ్బిపోయి డాక్టర్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. తిండి సామెత సినిమాలకు కూడా…
కరోనా తర్వాత థియేటర్స్ కి జనం మళ్ళీ వచ్చేలా చేసిన సినిమాల్లో జాంబీ రెడ్డి ఉంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ…