రెండున్నర దశాబ్దాల కిందట శంకర్-కమల్ హాసన్ కాంబినేషన్లో వచ్చిన ‘ఇండియన్’ మూవీ రేపిన సంచలనం అంతా ఇంతా కాదు. రెండు దశాబ్దాల తర్వాత ఈ మూవీకి సీక్వెల్ చేయడానికి రెడీ అయింది శంకర్-కమల్ జోడీ. కానీ ఏ ముహూర్తాన ఈ చిత్రం మొదలైందో కానీ.. దీన్ని ఎన్నో ఇబ్బందులు వెంటాడాయి. సెట్లో క్రేన్ ప్రమాదంతో ఆగిన షూటింగ్.. తర్వాత కరోనా, ఇతర కారణాలతో ఎంతకీ మొదలు కాలేదు.
రెండేళ్లకు పైగా గ్యాప్ తర్వాత ఏడాది కిందట ‘ఇండియన్-2’ చిత్రీకరణను పున:ప్రారంభించారు. అప్పటికే శంకర్ తీస్తున్న ‘గేమ్ చేంజర్’తో పాటు ఇండియన్-2 చిత్రీకరణను సమాంతరంగా జరపాలని శంకర్ భావించాడు. కానీ ఆ ప్రణాళికలు ఫలించలేదు. ‘గేమ్ చేంజర్’ను పక్కన పెట్టి ‘ఇండియన్-2’ మీదే ఎక్కువ ఫోకస్ పెట్టాడు శంకర్.
ఐతే కొన్ని నెలల కిందటే ‘ఇండియన్-2’ షూట్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు మొదలయ్యాయి. కానీ షూటింగ్ సుదీర్ఘ కాలం చేయడం, పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఎంతకీ పూర్తి కాకపోవడం చర్చనీయాంశం అయింది. కాగా ఇప్పుడు కమల్ ఈ సినిమాకు సంబంధించి ఆశ్చర్యకర విషయం వెల్లడించాడు. తాము కేవలం ‘ఇండియన్-2’ మాత్రమే తీయలేదని.. ఇండియన్-3కి కూడా ఒకేసారి చిత్రీకరణ జరిపామని ఆయన వెల్లడించారు. ఏవో కొన్ని సీన్లు అని కాకుండా ‘ఇండియన్-3’ మొత్తం కూడా పూర్తి చేసేసినట్లు ఆయన వెల్లడించారు.
‘ఇండియన్-2’ రిలీజయ్యాక ‘ఇండియన్-3’ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు మొదలవుతాయని.. ఎక్కువ గ్యాప్ లేకుండా ఆ సినిమాను కూడా రిలీజ్ చేసేస్తామని ఆయన చెప్పారు. ఇండియన్-2 ఈ ఏడాది ద్వితీయార్ధంలో, ఇండియన్-3 వచ్చే ఏడాది ఆరంభంలో వచ్చే అవకాశాలున్నాయి.
This post was last modified on March 25, 2024 4:19 pm
ప్రేక్షకులు చాల అడ్వాన్స్ ఉన్నారు, తెలివి మీరిపోయారనే సత్యాన్ని చాలా మంది దర్శక నిర్మాతలు గుర్తించడం లేదు. ఆ ఏముందిలే…
ఇండస్ట్రీలో వరుసగా ఫెయిల్యూర్లు ఇచ్చాక అవకాశాలు దక్కించుకోవడం అంత తేలికైన విషయం కాదు. కానీ కొందరు డైరెక్టర్లు మాత్రం తమ…
ఆదర్శ కుటుంబం టీజర్ వచ్చాక అందులో కంటెంట్ ఎలా ఉంటుందో ప్రేక్షకులకు ఐడియా వచ్చేసింది. అభిమానులు హ్యాపీగానే ఉన్నారు. వెంకీ…
ఫిలిం ఇండస్ట్రీలో చాలా ఏళ్ల పాటు నంబర్ స్థానానికి పోటీ పడ్డ ఇద్దరు టాప్ హీరోల మధ్య మంచి స్నేహం…
ఏంటో టాలీవుడ్ లో ఏదీ మాట మీద అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుందన్న గ్యారెంటీ లేకుండా పోతోంది. వాయిదాల పర్వంలో నలిగిపోతున్న…
ఏపీ సీఎం చంద్రబాబు గతానికి భిన్నంగా ఏపీలో పాలన సాగిస్తున్నారు. గతంలో ఆయన మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో…