రెండున్నర దశాబ్దాల కిందట శంకర్-కమల్ హాసన్ కాంబినేషన్లో వచ్చిన ‘ఇండియన్’ మూవీ రేపిన సంచలనం అంతా ఇంతా కాదు. రెండు దశాబ్దాల తర్వాత ఈ మూవీకి సీక్వెల్ చేయడానికి రెడీ అయింది శంకర్-కమల్ జోడీ. కానీ ఏ ముహూర్తాన ఈ చిత్రం మొదలైందో కానీ.. దీన్ని ఎన్నో ఇబ్బందులు వెంటాడాయి. సెట్లో క్రేన్ ప్రమాదంతో ఆగిన షూటింగ్.. తర్వాత కరోనా, ఇతర కారణాలతో ఎంతకీ మొదలు కాలేదు.
రెండేళ్లకు పైగా గ్యాప్ తర్వాత ఏడాది కిందట ‘ఇండియన్-2’ చిత్రీకరణను పున:ప్రారంభించారు. అప్పటికే శంకర్ తీస్తున్న ‘గేమ్ చేంజర్’తో పాటు ఇండియన్-2 చిత్రీకరణను సమాంతరంగా జరపాలని శంకర్ భావించాడు. కానీ ఆ ప్రణాళికలు ఫలించలేదు. ‘గేమ్ చేంజర్’ను పక్కన పెట్టి ‘ఇండియన్-2’ మీదే ఎక్కువ ఫోకస్ పెట్టాడు శంకర్.
ఐతే కొన్ని నెలల కిందటే ‘ఇండియన్-2’ షూట్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు మొదలయ్యాయి. కానీ షూటింగ్ సుదీర్ఘ కాలం చేయడం, పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఎంతకీ పూర్తి కాకపోవడం చర్చనీయాంశం అయింది. కాగా ఇప్పుడు కమల్ ఈ సినిమాకు సంబంధించి ఆశ్చర్యకర విషయం వెల్లడించాడు. తాము కేవలం ‘ఇండియన్-2’ మాత్రమే తీయలేదని.. ఇండియన్-3కి కూడా ఒకేసారి చిత్రీకరణ జరిపామని ఆయన వెల్లడించారు. ఏవో కొన్ని సీన్లు అని కాకుండా ‘ఇండియన్-3’ మొత్తం కూడా పూర్తి చేసేసినట్లు ఆయన వెల్లడించారు.
‘ఇండియన్-2’ రిలీజయ్యాక ‘ఇండియన్-3’ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు మొదలవుతాయని.. ఎక్కువ గ్యాప్ లేకుండా ఆ సినిమాను కూడా రిలీజ్ చేసేస్తామని ఆయన చెప్పారు. ఇండియన్-2 ఈ ఏడాది ద్వితీయార్ధంలో, ఇండియన్-3 వచ్చే ఏడాది ఆరంభంలో వచ్చే అవకాశాలున్నాయి.
తెలంగాణ రాజకీయాలు వ్యూహాత్మక మలుపు తిరుగుతున్నాయి. బీఆర్ ఎస్, టీఆర్ ఎస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కసారిగా జనసేన పార్టీపై…
మొన్నటిదాకా తమిళ సినీ పరిశ్రమలోనే కాక దేశంలోని ఇతర భాషాల్లోనూ ఓ స్టార్ హీరోగా ఎదిగిన జోసెఫ్ విజయ్… ఉన్నట్టుండి…
ఏపీలో విగ్రహాల ధ్వంసం వ్యవహారం విపక్ష వైసీపీని ఉక్కిరిబిక్కిరి చేస్తోందని చెప్పాలి. నంద్యాలలో ఆదివారం ఉదయం వైఎస్ విగ్రహం ధ్వంసం ఘటనలో…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు భారీ షాక్ తగిలింది. తెలంగాణలో జనసేన బలోపేతం దిశగా…
తెలుగు మూవీ లవర్స్ చిరకాల వాంఛ ఐమాక్స్ గురించి గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో ఎడతెగని చర్చ…
దక్షిణాదిన క్యారెక్టర్, విలన్ పాత్రలకు మాంచి డిమాండ్ ఉన్న నటుల్లో విజయ్ సేతుపతి ఒకడు. సుకుమార్ అంతటి పెద్ద దర్శకుడు…