Movie News

పచ్చజెండా ఊపేసిన నాగ్

వరుస ఫెయిల్యూర్లతో సతమతం అయిన సీనియర్ హీరో అక్కినేని నాగార్జునకు సంక్రాంతి సినిమా ‘నా సామి రంగ’ గొప్ప ఉపశమనాన్ని అందించింది. కంటెంట్ పరంగా యావరేజే అయినా.. సంక్రాంతి టైంలో ఈ సినిమా బాగానే ఆడి హిట్ అనిపించుకుంది. దీంతో ఉత్సాహంగా కొత్త సినిమాలు ఒప్పుకుంటున్నాడు కింగ్. ఆల్రెడీ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్‌తో కలిసి ‘కుబేర’ అనే మల్టీస్టారర్ చేస్తున్నాడు నాగ్. దీని తర్వాత తమిళ దర్శకుడు నవీన్‌తో సినిమాకు ఆయన పచ్చజెండా ఊపేసినట్లు సమాచారం.

నాగ్‌తో నవీన్ సినిమా గురించి చాలా రోజులుగా చర్చ జరుగుతోంది. తమిళంలో ‘మూడర్ కూడం’ అనే చిన్న సినిమాతో మంచి పేరు సంపాదించాడు నవీన్. అతను ఓ కథతో గత ఏడాది నాగ్‌ను సంప్రదించాడు. అప్పట్నుంచి జరుగుతున్న కథా చర్చలు ఎట్టకేలకు ఒక కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది.

నాగ్-నవీన్ సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతుందని అంటున్నారు. ఇందులో వేర్వేరు భాషలకు చెందిన నటీనటులు ముఖ్య పాత్రలు చేస్తారని.. ఇదొక మల్టీస్టారర్ తరహాలో ఉంటుందని సమాచారం. సూర్య కజిన్, తమిళ అగ్ర నిర్మాతల్లో ఒకరైన జ్ఞానవేల్ రాజా ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయబోతున్నాడు.

ఇది నాగ్ వందో సినిమానా కాదా అనే విషయంలో క్లారిటీ లేదు. ఈ మైల్‌స్టోన్ మూవీని తెలుగువాడే అయిన తమిళ దర్శకుడు మోహన్ రాజాతో చేయడానికి చూశాడు నాగ్. కానీ ఆ కాంబో కుదరలేదు. తన స్థానంలోకి నవీన్ వచ్చాడు. నాగ్‌కు ఇది వందో సినిమానే అయితే ప్లానింగ్ అదీ భారీగానే ఉంటుంది. అనౌన్స్‌మెంట్ కూడా ఘనంగానే చేస్తారు. ఈ ఏడాది మధ్యలో సెట్స్ మీదికి వెళ్లే అవకాశమున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో విడుదల కావచ్చు.

This post was last modified on March 24, 2024 1:08 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

`వేమిరెడ్డి` వేడి.. వైసీపీని ద‌హిస్తుందా.. !

రాజ‌కీయంగా ప్ర‌శాంతంగా ఉండే నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్ రెడ్డి.. ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రినీ టార్గెట్ చేయ‌లేదు. త‌న స‌తీమ‌ణి,…

3 minutes ago

తెలంగాణ విజ‌న్ డాక్యుమెంట్ లో ఏముంది?

తెలంగాణ‌లో సీఎం రేవంత్ రెడ్డి సార‌థ్యంలోని కాంగ్రెస్ ప్ర‌భుత్వం.. స్వ‌ప్నిస్తున్న తెలంగాణ విజ‌న్ డాక్యుమెంటును తాజాగా మంగ‌ళ‌వారం సాయంత్రం ఫ్యూచ‌ర్…

12 minutes ago

అఫీషియల్ – అఖండ 2 ఆగమనం

రకరకాల ప్రచారాలు, వదంతులు, డిస్కషన్లు, సోషల్ మీడియా తిట్లు, ఎన్నెన్నో కథలు వెరసి గత అయిదు రోజులుగా పెద్ద చర్చగా…

55 minutes ago

హార్దిక్ దెబ్బకు పవర్ఫుల్ విక్టరీ

టెస్ట్ సిరీస్ ఓటమి బాధను మరిపిస్తూ వన్డే సిరీస్ గెలిచిన టీమిండియా, ఇప్పుడు టీ20లోనూ అదే జోరు కొనసాగించింది. కటక్‌లోని…

1 hour ago

ఏఐ కోసం రూ. 1.5 లక్షల కోట్లు… మైక్రోసాఫ్ట్ భారీ ప్లాన్!

టెక్ ప్రపంచంలోనే ఒక సంచలన ప్రకటన వెలువడింది. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల, భారత ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు.…

1 hour ago

అల్లూ వారి పుష్ప కథ బెడిసికొట్టిందా?

తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ లో భాగంగా ఇవాళ సినీ ప్రముఖులు ఈ సమ్మేళనానికి విచ్చేసారు. అందులో పాల్గొన్న నిర్మాత అల్లు…

1 hour ago