వరుస ఫెయిల్యూర్లతో సతమతం అయిన సీనియర్ హీరో అక్కినేని నాగార్జునకు సంక్రాంతి సినిమా ‘నా సామి రంగ’ గొప్ప ఉపశమనాన్ని అందించింది. కంటెంట్ పరంగా యావరేజే అయినా.. సంక్రాంతి టైంలో ఈ సినిమా బాగానే ఆడి హిట్ అనిపించుకుంది. దీంతో ఉత్సాహంగా కొత్త సినిమాలు ఒప్పుకుంటున్నాడు కింగ్. ఆల్రెడీ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్తో కలిసి ‘కుబేర’ అనే మల్టీస్టారర్ చేస్తున్నాడు నాగ్. దీని తర్వాత తమిళ దర్శకుడు నవీన్తో సినిమాకు ఆయన పచ్చజెండా ఊపేసినట్లు సమాచారం.
నాగ్తో నవీన్ సినిమా గురించి చాలా రోజులుగా చర్చ జరుగుతోంది. తమిళంలో ‘మూడర్ కూడం’ అనే చిన్న సినిమాతో మంచి పేరు సంపాదించాడు నవీన్. అతను ఓ కథతో గత ఏడాది నాగ్ను సంప్రదించాడు. అప్పట్నుంచి జరుగుతున్న కథా చర్చలు ఎట్టకేలకు ఒక కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది.
నాగ్-నవీన్ సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతుందని అంటున్నారు. ఇందులో వేర్వేరు భాషలకు చెందిన నటీనటులు ముఖ్య పాత్రలు చేస్తారని.. ఇదొక మల్టీస్టారర్ తరహాలో ఉంటుందని సమాచారం. సూర్య కజిన్, తమిళ అగ్ర నిర్మాతల్లో ఒకరైన జ్ఞానవేల్ రాజా ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయబోతున్నాడు.
ఇది నాగ్ వందో సినిమానా కాదా అనే విషయంలో క్లారిటీ లేదు. ఈ మైల్స్టోన్ మూవీని తెలుగువాడే అయిన తమిళ దర్శకుడు మోహన్ రాజాతో చేయడానికి చూశాడు నాగ్. కానీ ఆ కాంబో కుదరలేదు. తన స్థానంలోకి నవీన్ వచ్చాడు. నాగ్కు ఇది వందో సినిమానే అయితే ప్లానింగ్ అదీ భారీగానే ఉంటుంది. అనౌన్స్మెంట్ కూడా ఘనంగానే చేస్తారు. ఈ ఏడాది మధ్యలో సెట్స్ మీదికి వెళ్లే అవకాశమున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో విడుదల కావచ్చు.
This post was last modified on March 24, 2024 1:08 pm
మహబూబ్ నగర్, మల్కాజ్ గిరి, నాగర్ కర్నూలు. తెలంగాణలో ఉన్న ఈ మూడు లోక్ సభ స్థానాలలో కాంగ్రెస్ పార్టీ…
మంచు విష్ణు ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్యాన్ ఇండియా రేంజ్ లో నిర్మిస్తున్న కన్నప్ప షూటింగ్ లో ప్రభాస్ అడుగు పెట్టాడు.…
ఐదేళ్ల పాలనను పూర్తి చేసుకుని ఎన్నికలకు వెళ్తున్నాడు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఐతే 2019 ఎన్నికల ముంగిట ఇచ్చిన…
సినిమాలకు సంబంధించి కొన్ని డేట్లు చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంటాయి. వాటి ప్రస్తావన వచ్చినప్పుడంతా అభిమానులు పాత జ్ఞాపకాల్లో మునిగి…
గోనె ప్రకాశరావు. తరచుగా సీఎం జగన్పైనా.. వైసీపీపైనా నిప్పులు చెరిగే మాజీ వైసీపీ నాయకుడు.. ఒకప్పటి వైఎస్ రాజశేఖర్రెడ్డికి మిత్రుడు.…
వచ్చే వారం విడుదల కావాల్సిన గ్యాంగ్స్ అఫ్ గోదావరి మళ్ళీ వాయిదా పడి మే 17 బదులు మే 31కి…