Movie News

పచ్చజెండా ఊపేసిన నాగ్

వరుస ఫెయిల్యూర్లతో సతమతం అయిన సీనియర్ హీరో అక్కినేని నాగార్జునకు సంక్రాంతి సినిమా ‘నా సామి రంగ’ గొప్ప ఉపశమనాన్ని అందించింది. కంటెంట్ పరంగా యావరేజే అయినా.. సంక్రాంతి టైంలో ఈ సినిమా బాగానే ఆడి హిట్ అనిపించుకుంది. దీంతో ఉత్సాహంగా కొత్త సినిమాలు ఒప్పుకుంటున్నాడు కింగ్. ఆల్రెడీ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్‌తో కలిసి ‘కుబేర’ అనే మల్టీస్టారర్ చేస్తున్నాడు నాగ్. దీని తర్వాత తమిళ దర్శకుడు నవీన్‌తో సినిమాకు ఆయన పచ్చజెండా ఊపేసినట్లు సమాచారం.

నాగ్‌తో నవీన్ సినిమా గురించి చాలా రోజులుగా చర్చ జరుగుతోంది. తమిళంలో ‘మూడర్ కూడం’ అనే చిన్న సినిమాతో మంచి పేరు సంపాదించాడు నవీన్. అతను ఓ కథతో గత ఏడాది నాగ్‌ను సంప్రదించాడు. అప్పట్నుంచి జరుగుతున్న కథా చర్చలు ఎట్టకేలకు ఒక కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది.

నాగ్-నవీన్ సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతుందని అంటున్నారు. ఇందులో వేర్వేరు భాషలకు చెందిన నటీనటులు ముఖ్య పాత్రలు చేస్తారని.. ఇదొక మల్టీస్టారర్ తరహాలో ఉంటుందని సమాచారం. సూర్య కజిన్, తమిళ అగ్ర నిర్మాతల్లో ఒకరైన జ్ఞానవేల్ రాజా ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయబోతున్నాడు.

ఇది నాగ్ వందో సినిమానా కాదా అనే విషయంలో క్లారిటీ లేదు. ఈ మైల్‌స్టోన్ మూవీని తెలుగువాడే అయిన తమిళ దర్శకుడు మోహన్ రాజాతో చేయడానికి చూశాడు నాగ్. కానీ ఆ కాంబో కుదరలేదు. తన స్థానంలోకి నవీన్ వచ్చాడు. నాగ్‌కు ఇది వందో సినిమానే అయితే ప్లానింగ్ అదీ భారీగానే ఉంటుంది. అనౌన్స్‌మెంట్ కూడా ఘనంగానే చేస్తారు. ఈ ఏడాది మధ్యలో సెట్స్ మీదికి వెళ్లే అవకాశమున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో విడుదల కావచ్చు.

This post was last modified on March 24, 2024 1:08 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

2 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

2 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

3 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

4 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

5 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

7 hours ago