మొదటి రోజు నెమ్మదిగా మాములు ఓపెనింగ్స్ సాధించిన ఓం భీమ్ బుష్ క్రమంగా వీకెండ్స్ ని చేతుల్లోకి తీసుకుంటోంది. ఫస్ట్ డేతో పోలిస్తే శనివారం వసూళ్లు మెరుగ్గా ఉన్నాయని ట్రేడ్ టాక్. ఐపిఎల్ ప్రభావం ఉన్నప్పటికీ క్రమంగా ఆడియన్స్ థియేటర్లకు వస్తున్నట్టు వసూళ్లు స్పష్టం చేస్తున్నాయి. యూనిట్ అఫీషయల్ గా ప్రకటించిన దాని ప్రకారం రెండు రోజుల గ్రాస్ ఆల్రెడీ 10 కోట్లు దాటేసింది. ఓవర్సీస్ లో 2.5 మిలియన్ మార్కు అందుకోవడం మరో విశేషం. టైంపాస్ కి ఢోకా లేదనే టాక్ సానుకూలంగా పని చేస్తోంది. ముఖ్యంగా యూత్ మద్దతు ఏ సెంటర్స్ లో బలంగా ఉంది.
ఇవాళ ఆదివారంతో పాటు రేపు సోమవారం హోలీ పండగ జాతీయ సెలవు దినం కలిసి రావడం ఖాయం. సుదీర్ఘమైన వీకెండ్ ని ముందే దృష్టిలో పెట్టుకుని యువి క్రియేషన్స్ వేసుకున్న స్ట్రాటజీ వర్కౌట్ అవుతోంది. పోటీకి వస్తుందనుకున్న అల్లరి నరేష్ ఆ ఒక్కటి అడక్కు తప్పుకోవడం, కాంపిటీషన్ లో ఉన్న లైన్ మ్యాన్ లాంటివి కనీస స్థాయిలో మెప్పించలేకపోవడంతో ఓం భీమ్ బుష్ తప్ప ప్రేక్షకులకు వేరే మంచి ఛాయస్ లేదు. దీంతో శ్రీవిష్ణు టీమ్ ప్రమోషన్లను మరింత పెంచే దిశగా టూర్లు చేపట్టే ఆలోచనలో ఉన్నట్టు యూనిట్ టాక్. దీనికి సంబంధించిన క్లారిటీ రావాల్సి ఉంది.
వచ్చే వారం టిల్లు స్క్వేర్ రాబోతున్న నేపథ్యంలో ఓం భీమ్ బుష్ కి ఈ అయిదు రోజులు చాలా కీలకం. 14 కోట్లని బ్రేక్ ఈవెన్ టార్గెట్ గా పెట్టుకున్న ఈ హారర్ కామెడీ ఎంటర్ టైనర్ ఆది, సోమవారాలు సరిగ్గా వాడుకుంటే దానికి చేరువగా వెళ్ళిపోతుంది. ఆపై వచ్చేవి లాభాలుగా తీసుకోవచ్చు. గత రెండు వారాలుగా చెప్పుకోదగ్గ హిట్ ఏదీ లేకపోవడంతో థియేటర్లకు సరైన ఫీడింగ్ జరగడం లేదు. మలయాళం డబ్బింగ్ ప్రేమలు మాత్రమే ఆక్యుపెన్సీలు చూపించింది. గామి ఫస్ట్ వీక్ లోనే మొత్తం రాబట్టి ఫైనల్ రన్ త్వరగా చేరుకుంది. సో బ్యాంగ్ బ్రోస్ కు ఇంతకన్నా మంచి ఛాన్స్ దొరకదు.
This post was last modified on March 24, 2024 12:19 pm
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…