జూనియర్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ మల్టీ స్టారర్ వార్ 2కి మ్యూజిక్ డైరెక్టర్ లాకయ్యాడని బాలీవుడ్ టాక్. ప్రీతమ్ చక్రవర్తిని దాదాపుగా ఖరారు చేశారని తెలిసింది. క్రేజీ ఆల్బమ్స్ ఎన్నో ఇచ్చిన సక్సెస్ ఫుల్ ట్రాక్ రికార్డు ఇతని సొంతం. యష్ రాజ్ ఫిలింస్ ధూమ్ నుంచే ఇతని కెరీర్ ఊపందుకుంది. 2001లో ఎంట్రీ ఇచ్చిన ఈ క్రియేటివ్ టాలెంట్ తర్వాత గ్యాంగ్ స్టర్, ధూమ్ 2, భాగం భాగ్, భూల్ భులయ్యా, రేస్, లవ్ ఆజ్ కల్, అజబ్ ప్రేమ్ కి గజబ్ కహాని, వన్స్ అపాన్ ఏ టైం ఇన్ ముంబై, రెడీ, బాడీ గార్డ్ లాంటి ఎన్నో చార్ట్ బస్టర్ ఇచ్చి విపరీతమైన ఫాలోయింగ్ పెంచుకున్నాడు.
బ్రహ్మాస్త్ర పార్ట్ వన్ శివకు పలు అవార్డులు దక్కించుకున్నాడు. టైగర్ 3, డంకీ ఇతని కంపోజింగ్ లో వచ్చినవే యానిమల్ లో ఒక సాంగ్ ఇచ్చాడు. వార్ 2 దర్శకుడు అయాన్ ముఖర్జీతో బ్లాక్ బస్టర్లలో భాగం పంచుకున్నాడు. హృతిక్ రోషన్ కి కొత్త కాదు కానీ తారక్ కి మాత్రం తను ఇచ్చే మొదటి ఆల్బమ్ అవుతుంది. త్వరలోనే మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలుపెట్టబోతున్నారు. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ ల మధ్య వచ్చే ఒక స్పెషల్ సాంగ్ ని ఆర్ఆర్ఆర్ లో నాటు నాటుని మించిపోయేలా ప్లాన్ చేస్తున్నారని ఇన్ సైడ్ టాక్. కొరియోగ్రఫీ కూడా అదే స్థాయిలో ఉండేలా చూస్తారట.
ఈ లెక్కన అంచనాలు ఏ స్థాయిలో పెరుగుతాయో చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం ముంబైలో వేసిన ప్రత్యేక సెట్లలో హృతిక్ మీద కీలక సన్నివేశాలు తీస్తున్నారు. ఏప్రిల్ నుంచి జూనియర్ ఎన్టీఆర్ చేరతాడు. ఒకవేళ దేవర వల్ల టైం సరిపోకపోతే రెండింటికి కాల్ షీట్లు సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. కియారా అద్వానీ ఒక హీరోయిన్ కాగా రెండో జోడి ఇంకా లాక్ కాలేదు. వచ్చే ఏడాది ఆగస్ట్ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రిలీజ్ కాబోతున్న వార్ 2ని మూడు వందల కోట్లకు పైగా బడ్జెట్ తో తీస్తారని ముంబై టాక్. దేవర పార్ట్ 1 తర్వాత తారక్ తర్వాతి విడుదల ఇదే కాబోతోంది.
This post was last modified on March 23, 2024 6:53 pm
తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల కేసు వ్యవహారం ఆసక్తి రేపిన సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ కు 10…
సోషల్ మీడియాలో చాలా అలెర్ట్ గా ఉండాలి. ముఖ్యంగా సెలబ్రిటీలు బిజీగా షెడ్యూల్స్ లో ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా…
థియేటర్లకు సరైన సినిమాలు వస్తే రావడానికి ప్రేక్షకులు సిద్ధంగా ఉన్నారు. ఎటొచ్చి వాళ్ళను కనీస స్థాయిలో మెప్పించే కంటెంట్ ఉన్నవి…
తెలంగాణలో రెండు రాజ్యసభ స్థానాలకు పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అభిషేక్ మను సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డిలు..…
వంటగ్యాస్ కొరత కారణంగా దేశవ్యాప్తంగా చిన్న హోటళ్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. హోటళ్లకు సరఫరా అయ్యే కమర్షియల్ సిలిండర్ల పంపిణీని…
రాష్ట్రంలోని పలు మున్సిపల్ సంస్థల్లో పాలకవర్గాల గడువు ముగియడంతో అక్కడ స్పెషల్ ఆఫీసర్ల పాలన అమల్లోకి రానుంది. మున్సిపల్ కార్పొరేషన్లు,…