Movie News

టిల్లు స్క్వేర్.. సిద్ధుకే ఎక్కువ పేరొచ్చినా ఓకే

టాలీవుడ్లో కొందరు యువ కథానాయకులు బహుముఖ ప్రజ్ఞాశాలులు. వాళ్లు సొంతంగా స్క్రిప్టు రాసుకోగలరు. అవసరమైన డైరెక్షన్ కూడా చేయగలరు. ఆ టాలెంట్‌తోనే తాము చేసే సినిమాలకు అన్నీ తామై వ్యవహరిస్తుంటారు. అందుకే వాళ్ల సినిమాలు హిట్టయితే ఎక్కువ క్రెడిట్ దర్శకులను మించి అందుకుంటూ ఉంటారు. ఈ జాబితాలో అడివి శేష్, సిద్ధు జొన్నలగడ్డ లాంటి వాళ్లుంటారు. శేష్ చేసే ప్రతి సినిమాకూ మేజర్ క్రెడిట్ తనకే దక్కుతుంటుంది. అందుకు అతను రైటింగ్‌తో పాటు మేకింగ్‌లోనూ శ్రద్ధ వహించడమే కారణం. ఇలాంటి ఇమేజే సిద్ధు సైతం తెచ్చుకున్నాడు.

‘డీజే టిల్లు’కు అతనే స్క్రిప్టు అందించడం.. టిల్లు పాత్ర భలేగా పేలడంతో దర్శకుడు విమల్ కంటే సిద్ధుకే ఎక్కువ ప్రశంసలు దక్కాయి. ఆ సినిమా సక్సెస్‌కు సంబంధించి మేజర్ క్రెడిట్ సిద్ధుకే వెళ్లింది.

ఇప్పుడు ‘డీజే టిల్లు’ సీక్వెల్ ‘టిల్లు స్క్వేర్’ రాబోతోంది. దర్శకుడిగా విమల్ స్థానంలోకి మల్లిక్ రామ్ వచ్చాడు. కానీ ప్రేక్షకుల ఫోకస్ అంతా సిద్ధు మీదే ఉంది. రేప్పొద్దున సినిమా హిట్టయినా క్రెడిట్ అంతా సిద్ధుకే వెళ్తుందనే అభిప్రాయాలున్నాయి.

ఇదే విషయాన్ని మల్లిక్ దగ్గర ప్రస్తావిస్తే.. అది సమస్యే కాదన్నాడు. సిద్ధుకే ఎక్కువ పేరొస్తే అది తనకు సంతోషమే అని చెప్పాడు. ‘నా తొలి చిత్రం ‘నరుడా డోనరుడా’ రీమేక్. రెండో చిత్రం ‘అద్భుతం’కి ప్రశాంత్ వర్మ కథ అందించాడు. ఆ కథలు నచ్చి తెరకెక్కించా. నేను సొంతంగా కథలు రాసుకోగలను. అలాగే వేరే వాళ్ల కథలకూ న్యాయం చేయగలను. ‘టిల్లు స్క్వేర్’ కూడా అలా ఇష్టపడే చేశా. ఈ సినిమాతో సిద్ధుకు ఎక్కువ పేరొస్తే సంతోషమే. ఎందుకంటే సిద్ధుతో నాకు ఎప్పట్నుంచో స్నేహం ఉంది. నేను, సిద్ధు, ప్రశాంత్ వర్మ, తేజ సజ్జా 12 ఏళ్ల నుంచి కష్టపడుతున్నాం. మాలో ఎవరు సక్సెస్ అయినా అందరం ఆనందపడతాం’ అని మల్లిక్ చెప్పాడు.

This post was last modified on March 22, 2024 6:01 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

2 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

2 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

3 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

4 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

5 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

7 hours ago