టాలీవుడ్లో కొందరు యువ కథానాయకులు బహుముఖ ప్రజ్ఞాశాలులు. వాళ్లు సొంతంగా స్క్రిప్టు రాసుకోగలరు. అవసరమైన డైరెక్షన్ కూడా చేయగలరు. ఆ టాలెంట్తోనే తాము చేసే సినిమాలకు అన్నీ తామై వ్యవహరిస్తుంటారు. అందుకే వాళ్ల సినిమాలు హిట్టయితే ఎక్కువ క్రెడిట్ దర్శకులను మించి అందుకుంటూ ఉంటారు. ఈ జాబితాలో అడివి శేష్, సిద్ధు జొన్నలగడ్డ లాంటి వాళ్లుంటారు. శేష్ చేసే ప్రతి సినిమాకూ మేజర్ క్రెడిట్ తనకే దక్కుతుంటుంది. అందుకు అతను రైటింగ్తో పాటు మేకింగ్లోనూ శ్రద్ధ వహించడమే కారణం. ఇలాంటి ఇమేజే సిద్ధు సైతం తెచ్చుకున్నాడు.
‘డీజే టిల్లు’కు అతనే స్క్రిప్టు అందించడం.. టిల్లు పాత్ర భలేగా పేలడంతో దర్శకుడు విమల్ కంటే సిద్ధుకే ఎక్కువ ప్రశంసలు దక్కాయి. ఆ సినిమా సక్సెస్కు సంబంధించి మేజర్ క్రెడిట్ సిద్ధుకే వెళ్లింది.
ఇప్పుడు ‘డీజే టిల్లు’ సీక్వెల్ ‘టిల్లు స్క్వేర్’ రాబోతోంది. దర్శకుడిగా విమల్ స్థానంలోకి మల్లిక్ రామ్ వచ్చాడు. కానీ ప్రేక్షకుల ఫోకస్ అంతా సిద్ధు మీదే ఉంది. రేప్పొద్దున సినిమా హిట్టయినా క్రెడిట్ అంతా సిద్ధుకే వెళ్తుందనే అభిప్రాయాలున్నాయి.
ఇదే విషయాన్ని మల్లిక్ దగ్గర ప్రస్తావిస్తే.. అది సమస్యే కాదన్నాడు. సిద్ధుకే ఎక్కువ పేరొస్తే అది తనకు సంతోషమే అని చెప్పాడు. ‘నా తొలి చిత్రం ‘నరుడా డోనరుడా’ రీమేక్. రెండో చిత్రం ‘అద్భుతం’కి ప్రశాంత్ వర్మ కథ అందించాడు. ఆ కథలు నచ్చి తెరకెక్కించా. నేను సొంతంగా కథలు రాసుకోగలను. అలాగే వేరే వాళ్ల కథలకూ న్యాయం చేయగలను. ‘టిల్లు స్క్వేర్’ కూడా అలా ఇష్టపడే చేశా. ఈ సినిమాతో సిద్ధుకు ఎక్కువ పేరొస్తే సంతోషమే. ఎందుకంటే సిద్ధుతో నాకు ఎప్పట్నుంచో స్నేహం ఉంది. నేను, సిద్ధు, ప్రశాంత్ వర్మ, తేజ సజ్జా 12 ఏళ్ల నుంచి కష్టపడుతున్నాం. మాలో ఎవరు సక్సెస్ అయినా అందరం ఆనందపడతాం’ అని మల్లిక్ చెప్పాడు.
This post was last modified on March 22, 2024 6:01 pm
చరిత్రలో ముందు నుంచీ మహిళా దర్శకురాళ్లు తెలుగులోనే కాదు ఏ భాషలో అయినా తక్కువే. కేవలం విజయనిర్మల గారు ఒక్కరే…
చాలాకాలంగా కాంగ్రెస్ పార్టీపై, సీఎం రేవంత్ రెడ్డిపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేస్తున్న సంగతి…
ఏపీ సీఎం చంద్రబాబు ఏ చిన్న అవకాశాన్నీ వదలట్లేదా? అంటే.. ఔననే సమాధానమే వస్తోంది. పెట్టుబడులకు ఎక్కడ అవకాశం ఉంటే..…
తెంపరి తనానికి చొక్కా.. ఫ్యాంటు తొడిగితే.. అది అమెరికా అధ్యక్షుడు ట్రంపేనన్న కామెంట్లు తరచుగా వినిపిస్తాయి. ఎప్పుడు ఎలాంటి నిర్ణయంతో…
ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…