ఒకప్పుడు నిన్నే పెళ్లాడతా, గులాబీ లాంటి బ్లాక్ బస్టర్స్ తో క్రియేటివ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న కృష్ణవంశీ ఆ తర్వాత ఎన్నో మంచి సినిమాలిచ్చారు. కొత్తవాళ్లతో చందమామ లాంటి సూపర్ హిట్స్ ని అభిమానులు అంత సులభంగా మర్చిపోలేరు. ఇప్పటికీ ఇండిపెండెన్స్ డే అంటే వెంటనే గుర్తొచ్చే వాటిలో ఖడ్గం ముందు వరసలో ఉంటుంది. సిందూరంని మెచ్చుకోని విమర్శకులు లేరు. ఇదంతా గతం. ప్రస్తుతం కృష్ణవంశీ బ్యాడ్ ఫామ్ గురించి తెలిసిందే. గత ఏడాది ప్రకాష్ రాజ్ తో తీసిన రంగమార్తాండ మెప్పులు తెచ్చింది కానీ నిర్మాతకు కాసులు తేలేదు.
ఒకరకంగా చెప్పాలంటే ఇంత వెనుకబడి ఉన్న సీనియర్ దర్శకులు సాధారణంగా రిస్కులు చేయరు. కానీ ఈయన మాత్రం పట్టువదలని విక్రమార్కుడిలా కథలు రాసుకుంటూనే ఉన్నారు. తాజాగా మూడు జంటలతో ఓ ప్రేమకథను ప్లాన్ చేసుకున్నారని తెలిసింది. డెబ్యూ యాక్టర్స్ ని తీసుకుని తక్కువ బడ్జెట్ తో ఒక సెన్సిబుల్ లవ్ స్టోరీని చెప్పే ప్రయత్నం చేస్తారట. మూడు దశాబ్దాల క్రితం గులాబీలో యూత్ పల్స్ ని సరిగ్గా పట్టుకున్న కృష్ణవంశీ ఇంత లేట్ ఏజ్ లో అందులోనూ మారిన ట్రెండ్ కు అనుగుణంగా మెప్పిస్తారా అనేది వెయ్యి డాలర్ల ప్రశ్న.
దీనికి సమాధానం తెలియాలంటే ఇంకొంత కాలం ఆగాలి. కృష్ణవంశీ అనే కాదు బి గోపాల్, వివి వినాయక్, కోదండరామిరెడ్డి, రాఘవేంద్రరావు లాంటి సీనియర్లు ఇప్పటి జనరేషన్ కు అనుగుణంగా స్క్రిప్ట్ ల విషయంలో తడబడి ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. స్టార్ హీరోలు అవకాశాలు ఇచ్చినా ఉపయోగించుకోలేని దాఖలాలు బోలెడు. రామ్ చరణ్ కోరిమరీ గోవిందుడు అందరివాడే చేస్తే ఏమయ్యిందో అభిమానుల కన్నా ఎక్కువగా కృష్ణవంశీకే తెలుసు. మరి ఇప్పుడు ఇది చివరి బంతిగా భావించి సిక్సర్ కొడతారో లేదో బాక్సాఫీసే సమాధానం చెప్పాలి.
This post was last modified on March 22, 2024 10:36 am
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…