Movie News

ఒక్క సినిమా కోసం రెండుసార్లు చిరుకు నో

మెగాస్టార్ చిరంజీవి సినిమాలో కీలక పాత్ర ఇస్తామంటే ఎవరైనా నో చెబుతారా? తెలుగు అనే కాక ఇండియాలో ఏ ఫిలిం ఇండస్ట్రీకి చెందిన ఆర్టిస్ల్ అయినా చిరు సినిమా అంటే నటించడానికి ఎంతో ఎగ్జైట్ అవుతారు. కానీ మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ మాత్రం చిరుకు రెండుసార్లు నో చెప్పాడట. అది కూడా ఒక్క సినిమా కోసమే నాలుగేళ్ల వ్యవధిలో రెండుసార్లు చిరుకు నో చెప్పాల్సి వచ్చిందట పృథ్వీరాజ్. దీని గురించి అతను తాజాగా మాట్లాడాడు.

‘‘హిస్టారికల్ ఫిలిం ‘సైరా’ కోసం చిరంజీవి గారు నన్ను సంప్రదించారు. ఆ సినిమాలో ఓ కీలక పాత్రకు నన్ను అడిగారు. అందులో నటించాలని ఆసక్తి ఉన్నా కుదరలేదు. అప్పటికి నా డేట్లన్నీ ‘ఆడుజీవితం’ అనే లార్జర్ దన్ లైఫ్ సినిమా కోసమే ఇచ్చేశానని చెబితే ఆయన అర్థం చేసుకున్నారు. కొన్నేళ్ల తర్వాత చిరంజీవి గారు ‘లూసిఫర్’ను రీమేక్ చేయాలనుకున్నారు. అందుకోసం నన్ను మళ్లీ అడిగారు. కానీ నాలుగేళ్ల తర్వాత కూడా నేను ‘ఆడుజీవితం’ కోసమే డేట్లు ఇచ్చేశానని, ఖాళీ లేదని చెబితే ఆయన ఆశ్చర్యపోయారు’’ అని పృథ్వీరాజ్ చెప్పాడు. ‘ఆడుజీవితం’ పృథ్వీరాజ్ కెరీర్లోనే అత్యంత కష్టపడి చేస్తున్న సినిమా.

ఈ చిత్రం కోసం అతను మామూలు కష్టం పడలేదు. 31 కేజీలు బరువు తగ్గి బక్కచిక్కి కనిపించనున్నాడు పృథ్వీరాజ్ ఇందులో. దీని ట్రైలర్ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అనేక అవార్డులు సంపాదించదగ్గ సినిమాలా దీన్ని పరిగణిస్తున్నారు. ఈ నెల 28న ఈ చిత్రం పలు భాషల్లో ఒకేసారి విడుదల కానుంది. తెలుగులో సైతం ‘ఆడుజీవితం’ను రిలీజ్ చేస్తున్నారు.

This post was last modified on March 21, 2024 1:25 pm

Share
Show comments
Published by
Satya
Tags: Pruthvi

Recent Posts

బాబీ గారు… ప్రేక్షకులు ఎప్పుడైనా రైటే

భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…

5 hours ago

‘ఇవేవీ తెలియకుండా జగన్ సీఎం ఎలా అయ్యాడో’

వైసీపీ అధినేత జగన్‌పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…

5 hours ago

అఫీషియల్: తెలంగాణ ఎన్నికల్లో జనసేన పోటీ

తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…

6 hours ago

‘నువ్వు బ‌జారోడివి కాదు’… అనిల్ మీమ్ పంచ్

సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయ‌డంలో తెలుగు వాళ్ల‌ను మించిన వాళ్లు ఇంకెవ్వ‌రూ ఉండ‌రంటే అతిశ‌యోక్తి కాదు. కొన్ని మీమ్స్…

7 hours ago

జగన్ చేతులు కాల్చాకా నేతలు ఆకులు పట్టుకున్నారు

అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…

8 hours ago

కైట్ కుర్రోళ్లు… ఇప్పటికైనా అర్థం చేసుకోండి

సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…

9 hours ago