మెగాస్టార్ చిరంజీవి సినిమాలో కీలక పాత్ర ఇస్తామంటే ఎవరైనా నో చెబుతారా? తెలుగు అనే కాక ఇండియాలో ఏ ఫిలిం ఇండస్ట్రీకి చెందిన ఆర్టిస్ల్ అయినా చిరు సినిమా అంటే నటించడానికి ఎంతో ఎగ్జైట్ అవుతారు. కానీ మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ మాత్రం చిరుకు రెండుసార్లు నో చెప్పాడట. అది కూడా ఒక్క సినిమా కోసమే నాలుగేళ్ల వ్యవధిలో రెండుసార్లు చిరుకు నో చెప్పాల్సి వచ్చిందట పృథ్వీరాజ్. దీని గురించి అతను తాజాగా మాట్లాడాడు.
‘‘హిస్టారికల్ ఫిలిం ‘సైరా’ కోసం చిరంజీవి గారు నన్ను సంప్రదించారు. ఆ సినిమాలో ఓ కీలక పాత్రకు నన్ను అడిగారు. అందులో నటించాలని ఆసక్తి ఉన్నా కుదరలేదు. అప్పటికి నా డేట్లన్నీ ‘ఆడుజీవితం’ అనే లార్జర్ దన్ లైఫ్ సినిమా కోసమే ఇచ్చేశానని చెబితే ఆయన అర్థం చేసుకున్నారు. కొన్నేళ్ల తర్వాత చిరంజీవి గారు ‘లూసిఫర్’ను రీమేక్ చేయాలనుకున్నారు. అందుకోసం నన్ను మళ్లీ అడిగారు. కానీ నాలుగేళ్ల తర్వాత కూడా నేను ‘ఆడుజీవితం’ కోసమే డేట్లు ఇచ్చేశానని, ఖాళీ లేదని చెబితే ఆయన ఆశ్చర్యపోయారు’’ అని పృథ్వీరాజ్ చెప్పాడు. ‘ఆడుజీవితం’ పృథ్వీరాజ్ కెరీర్లోనే అత్యంత కష్టపడి చేస్తున్న సినిమా.
ఈ చిత్రం కోసం అతను మామూలు కష్టం పడలేదు. 31 కేజీలు బరువు తగ్గి బక్కచిక్కి కనిపించనున్నాడు పృథ్వీరాజ్ ఇందులో. దీని ట్రైలర్ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అనేక అవార్డులు సంపాదించదగ్గ సినిమాలా దీన్ని పరిగణిస్తున్నారు. ఈ నెల 28న ఈ చిత్రం పలు భాషల్లో ఒకేసారి విడుదల కానుంది. తెలుగులో సైతం ‘ఆడుజీవితం’ను రిలీజ్ చేస్తున్నారు.
తెలుగు మూవీ లవర్స్ చిరకాల వాంఛ ఐమాక్స్ గురించి గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో ఎడతెగని చర్చ…
దక్షిణాదిన క్యారెక్టర్, విలన్ పాత్రలకు మాంచి డిమాండ్ ఉన్న నటుల్లో విజయ్ సేతుపతి ఒకడు. సుకుమార్ అంతటి పెద్ద దర్శకుడు…
అదేంటి పెద్ది వస్తుంటే ఇంకెవరు పోటీకి దిగుతారనే డౌట్ వస్తోందా. టాలీవుడ్ ప్రొడ్యూసర్లు అంత సాహసం చేయరు కానీ ఇతర…
తెలుగులో రిలీజయ్యే ఏ సినిమాకైనా అటు ఏపీలో, ఇటు తెలంగాణలో ఒకేసారి షోలు మొదలుపెట్టాల్సి ఉంటుంది. ఒకట్రెండు గంటల తేడా…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఢిల్లీ టూర్ పై ఓ రేంజి తరహా వ్యాఖ్యలు చేసిన…
జనసేన అదినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు గుప్పించారు.…