మెగాస్టార్ చిరంజీవి సినిమాలో కీలక పాత్ర ఇస్తామంటే ఎవరైనా నో చెబుతారా? తెలుగు అనే కాక ఇండియాలో ఏ ఫిలిం ఇండస్ట్రీకి చెందిన ఆర్టిస్ల్ అయినా చిరు సినిమా అంటే నటించడానికి ఎంతో ఎగ్జైట్ అవుతారు. కానీ మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ మాత్రం చిరుకు రెండుసార్లు నో చెప్పాడట. అది కూడా ఒక్క సినిమా కోసమే నాలుగేళ్ల వ్యవధిలో రెండుసార్లు చిరుకు నో చెప్పాల్సి వచ్చిందట పృథ్వీరాజ్. దీని గురించి అతను తాజాగా మాట్లాడాడు.
‘‘హిస్టారికల్ ఫిలిం ‘సైరా’ కోసం చిరంజీవి గారు నన్ను సంప్రదించారు. ఆ సినిమాలో ఓ కీలక పాత్రకు నన్ను అడిగారు. అందులో నటించాలని ఆసక్తి ఉన్నా కుదరలేదు. అప్పటికి నా డేట్లన్నీ ‘ఆడుజీవితం’ అనే లార్జర్ దన్ లైఫ్ సినిమా కోసమే ఇచ్చేశానని చెబితే ఆయన అర్థం చేసుకున్నారు. కొన్నేళ్ల తర్వాత చిరంజీవి గారు ‘లూసిఫర్’ను రీమేక్ చేయాలనుకున్నారు. అందుకోసం నన్ను మళ్లీ అడిగారు. కానీ నాలుగేళ్ల తర్వాత కూడా నేను ‘ఆడుజీవితం’ కోసమే డేట్లు ఇచ్చేశానని, ఖాళీ లేదని చెబితే ఆయన ఆశ్చర్యపోయారు’’ అని పృథ్వీరాజ్ చెప్పాడు. ‘ఆడుజీవితం’ పృథ్వీరాజ్ కెరీర్లోనే అత్యంత కష్టపడి చేస్తున్న సినిమా.
ఈ చిత్రం కోసం అతను మామూలు కష్టం పడలేదు. 31 కేజీలు బరువు తగ్గి బక్కచిక్కి కనిపించనున్నాడు పృథ్వీరాజ్ ఇందులో. దీని ట్రైలర్ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అనేక అవార్డులు సంపాదించదగ్గ సినిమాలా దీన్ని పరిగణిస్తున్నారు. ఈ నెల 28న ఈ చిత్రం పలు భాషల్లో ఒకేసారి విడుదల కానుంది. తెలుగులో సైతం ‘ఆడుజీవితం’ను రిలీజ్ చేస్తున్నారు.
This post was last modified on March 21, 2024 1:25 pm
చాంతాడంత కారణాలు చెప్పుకుని జనం థియేటర్లకు రావడం లేదని ఎంత బాధ పడినా వాస్తవిక పరిస్థితిని అర్థం చేసుకుంటే కనక…
యానిమల్ దెబ్బకు జాతీయ స్థాయిలో భారీ గుర్తింపు తెచ్చేసుకున్న రష్మిక మందన్న బీజీపీ ప్రభుత్వం తరఫున అనధికార ప్రచార కర్త…
దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలలో 370కి పైగా స్థానాలు సాధించి హ్యాట్రిక్ విజయంతో అధికారం చేజిక్కించుకోవాలన్న కమలం ఆశలమీద ఆయా…
ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ జూబ్లీహిల్స్ లో కొన్న 681 గజాల స్థలం విషయంలో వివాదం నెలకొందని, ఆ స్థలం…
రాజకీయాల్లో సెంటిమెంటుకు ఛాన్స్ ఎక్కువ. ఉద్ధండ నాయకుల నుంచి చరిత్ర సొంతం చేసుకున్న పార్టీల వరక కూడా సెంటి మెంటుకు…
వైసీపీ నాయకులు సహా సలహాదారు సజ్జల రామకృష్నారెడ్డి కళ్లలో భయం కనిపిస్తోందని ఆ పార్టీ రెబల్ ఎంపీ, ఉండి నుంచి…