కౌశల్ మండ.. తెలుగు బిగ్ బాస్ షోకు సంబంధించినంత వరకు ఈ పేరు ఓ సంచలనం. రెండో సీజన్లో విజేతగా నిలిచిన ఈ టీవీ, సినిమా నటుడికి అప్పట్లో వీర లెవెల్లో ఫాలోయింగ్ వచ్చింది. అదే స్థాయిలో వ్యతిరేకత కూడా ఎదుర్కొన్న సంగతీ తెలిసిందే. షో నుంచి బయటికి వచ్చాక కౌశల్ చేసిన అతి పలుమార్లు చర్చనీయాంశం అయింది.
తర్వాత అతను పెద్దగా లైమ్ లైట్లో లేకుండా పోయాడు. ఇప్పుడు బిగ్ బాస్ కొత్త సీజన్ ఆరంభమైన నేపథ్యంలో ఓ మీడియా సంస్థతో అతను పార్టిసిపెంట్ల గురించి మాట్లాడాడు. ఈసారి పార్టిసిపెంట్ల ఎంపిక సరైన విధంగా లేదని కౌశల్ అభిప్రాయపడ్డాడు. గంగవ్వను షోలోకి తీసుకురావడం చాలా మంచి విషయం అని కౌశల్ అన్నాడు.
కేవలం ఫిజికల్ టాస్క్ల ద్వారానే కంటెస్టెంట్లు ఫైనల్కు చేరుకుంటారని తాను అనుకోవట్లేదని.. రెండో సీజన్లో గీతామాధురి ఫిజికల్ టాస్క్లో పెద్దగా కష్టపడకపోయినప్పటికీ ఫైనల్కు చేరుకుందని… ఈ లెక్కన గంగవ్వ 10 వారాల కన్నా ఎక్కువే హౌస్లో ఉండే అవకాశం ఉందని కౌశల్ అభిప్రాయపడ్డాడు.
కొంచెం దుందుడుకుగా వ్యవహరిస్తే టీవీలో ఎక్కువసేపు కనిపిస్తామని కొందరు కంటెస్టెంట్లు అనుకుంటున్నారని.. అన్ని వేళలా అదే జరగదని. కావాలని ఎవరినైనా టార్గెట్ చేసినా అందుకు మూల్యం చెల్లించుకోక తప్పదని కౌశల్ హెచ్చరించాడు.. ఇక పార్టిసిపెంట్లకు అప్పుడే ఫ్యాన్స్ క్లబ్లు మొదలైపోయాయని.. కానీ ఓ కంటెస్టెంట్ కోసం ర్యాలీ తీస్తూ పోరాడిన కౌశల్ ఆర్మీ మాత్రం నెవర్ బిఫోర్.. ఎవర్ ఆఫ్టర్ అని కౌశల్ తన ఆర్మీని పొగుడుకున్నాడు.
This post was last modified on September 13, 2020 11:40 am
అమెరికాను నెంబర్ వన్ చేయాలన్న పేరుతో ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటూ.. ప్రపంచాన్ని ఆగమాగం చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇమేజ్…
‘అమరావతి’ని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా నిర్ణయిస్తూ ఏపీ అసెంబ్లీ పెట్టిన తీర్మానం మీద ఇటీవలే ఒక టీవీ ఛానెల్లో చర్చా…
కంటెంట్ మీద ఎంత నమ్మకం ఉన్నా ప్రీమియర్ల విషయంలో నిర్మాతలు ఒకటికి పదిసార్లు ఆలోచించే పరిస్థితులు ఇప్పుడున్నాయి. కొన్నిసార్లు ఈ…
జివి ప్రకాష్ కుమార్ మనకూ బాగా సుపరిచితుడైన సంగీత దర్శకుడు. తమిళంలో అయితే రెగ్యులర్ గా హీరోగా కూడా నటిస్తూ…
ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్లాన్-బీ’గా మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాన్ని…
టాలీవుడ్ టాప్ స్టార్లందరూ తమ సినిమా రిలీజ్ ముంగిట డ్రగ్ టెస్టులు చేసుకోవాలని.. అప్పుడే ఆ సినిమాలు రిలీజ్ అయ్యేలా…