కౌశల్ మండ.. తెలుగు బిగ్ బాస్ షోకు సంబంధించినంత వరకు ఈ పేరు ఓ సంచలనం. రెండో సీజన్లో విజేతగా నిలిచిన ఈ టీవీ, సినిమా నటుడికి అప్పట్లో వీర లెవెల్లో ఫాలోయింగ్ వచ్చింది. అదే స్థాయిలో వ్యతిరేకత కూడా ఎదుర్కొన్న సంగతీ తెలిసిందే. షో నుంచి బయటికి వచ్చాక కౌశల్ చేసిన అతి పలుమార్లు చర్చనీయాంశం అయింది.
తర్వాత అతను పెద్దగా లైమ్ లైట్లో లేకుండా పోయాడు. ఇప్పుడు బిగ్ బాస్ కొత్త సీజన్ ఆరంభమైన నేపథ్యంలో ఓ మీడియా సంస్థతో అతను పార్టిసిపెంట్ల గురించి మాట్లాడాడు. ఈసారి పార్టిసిపెంట్ల ఎంపిక సరైన విధంగా లేదని కౌశల్ అభిప్రాయపడ్డాడు. గంగవ్వను షోలోకి తీసుకురావడం చాలా మంచి విషయం అని కౌశల్ అన్నాడు.
కేవలం ఫిజికల్ టాస్క్ల ద్వారానే కంటెస్టెంట్లు ఫైనల్కు చేరుకుంటారని తాను అనుకోవట్లేదని.. రెండో సీజన్లో గీతామాధురి ఫిజికల్ టాస్క్లో పెద్దగా కష్టపడకపోయినప్పటికీ ఫైనల్కు చేరుకుందని… ఈ లెక్కన గంగవ్వ 10 వారాల కన్నా ఎక్కువే హౌస్లో ఉండే అవకాశం ఉందని కౌశల్ అభిప్రాయపడ్డాడు.
కొంచెం దుందుడుకుగా వ్యవహరిస్తే టీవీలో ఎక్కువసేపు కనిపిస్తామని కొందరు కంటెస్టెంట్లు అనుకుంటున్నారని.. అన్ని వేళలా అదే జరగదని. కావాలని ఎవరినైనా టార్గెట్ చేసినా అందుకు మూల్యం చెల్లించుకోక తప్పదని కౌశల్ హెచ్చరించాడు.. ఇక పార్టిసిపెంట్లకు అప్పుడే ఫ్యాన్స్ క్లబ్లు మొదలైపోయాయని.. కానీ ఓ కంటెస్టెంట్ కోసం ర్యాలీ తీస్తూ పోరాడిన కౌశల్ ఆర్మీ మాత్రం నెవర్ బిఫోర్.. ఎవర్ ఆఫ్టర్ అని కౌశల్ తన ఆర్మీని పొగుడుకున్నాడు.
మలయాళ హీరో అయినప్పటికీ సలార్ నుంచి పృథ్విరాజ్ సుకుమారన్ కు మన దగ్గర కూడా ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ నమ్మకంతోనే…
సెలబ్రెటీల కుటుంబాల్లో కొందరిలో ఎంతో ప్రతిభ ఉన్నప్పటికీ.. అది ఎప్పుడో కానీ బయటికి రాదు. ఎప్పుడూ మామూలుగా కనిపించే వ్యక్తులు..…
రిలీజైన రోజు నుంచి వీకెండ్ దాకా చెడుగుడు ఆడేసిన లెనిన్ ఎట్టకేలకు అఖిల్ కెరీర్ లో ఒక హిట్టుని చేర్చేసింది.…
టాలీవుడ్ అగ్రశ్రేణి డ్యాన్స్ మాస్టర్లు ఇద్దరి మధ్య వివాదం రాజుకుంది. జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ మధ్య ఘర్షణ చోటు…
టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల వ్యవహారం అదిగో పులి ఇదిగో తోక కథలా మారిపోయింది. ఒక డేట్ వేయడం, దానికి…
ఘట్టమనేని మూడో తరం నుంచి మొదటి వారసుడు జయకృష్ణ తొలి సినిమా శ్రీనివాస మంగాపురం జూలై 30 విడుదలకు రెడీ…