కౌశల్ మండ.. తెలుగు బిగ్ బాస్ షోకు సంబంధించినంత వరకు ఈ పేరు ఓ సంచలనం. రెండో సీజన్లో విజేతగా నిలిచిన ఈ టీవీ, సినిమా నటుడికి అప్పట్లో వీర లెవెల్లో ఫాలోయింగ్ వచ్చింది. అదే స్థాయిలో వ్యతిరేకత కూడా ఎదుర్కొన్న సంగతీ తెలిసిందే. షో నుంచి బయటికి వచ్చాక కౌశల్ చేసిన అతి పలుమార్లు చర్చనీయాంశం అయింది.
తర్వాత అతను పెద్దగా లైమ్ లైట్లో లేకుండా పోయాడు. ఇప్పుడు బిగ్ బాస్ కొత్త సీజన్ ఆరంభమైన నేపథ్యంలో ఓ మీడియా సంస్థతో అతను పార్టిసిపెంట్ల గురించి మాట్లాడాడు. ఈసారి పార్టిసిపెంట్ల ఎంపిక సరైన విధంగా లేదని కౌశల్ అభిప్రాయపడ్డాడు. గంగవ్వను షోలోకి తీసుకురావడం చాలా మంచి విషయం అని కౌశల్ అన్నాడు.
కేవలం ఫిజికల్ టాస్క్ల ద్వారానే కంటెస్టెంట్లు ఫైనల్కు చేరుకుంటారని తాను అనుకోవట్లేదని.. రెండో సీజన్లో గీతామాధురి ఫిజికల్ టాస్క్లో పెద్దగా కష్టపడకపోయినప్పటికీ ఫైనల్కు చేరుకుందని… ఈ లెక్కన గంగవ్వ 10 వారాల కన్నా ఎక్కువే హౌస్లో ఉండే అవకాశం ఉందని కౌశల్ అభిప్రాయపడ్డాడు.
కొంచెం దుందుడుకుగా వ్యవహరిస్తే టీవీలో ఎక్కువసేపు కనిపిస్తామని కొందరు కంటెస్టెంట్లు అనుకుంటున్నారని.. అన్ని వేళలా అదే జరగదని. కావాలని ఎవరినైనా టార్గెట్ చేసినా అందుకు మూల్యం చెల్లించుకోక తప్పదని కౌశల్ హెచ్చరించాడు.. ఇక పార్టిసిపెంట్లకు అప్పుడే ఫ్యాన్స్ క్లబ్లు మొదలైపోయాయని.. కానీ ఓ కంటెస్టెంట్ కోసం ర్యాలీ తీస్తూ పోరాడిన కౌశల్ ఆర్మీ మాత్రం నెవర్ బిఫోర్.. ఎవర్ ఆఫ్టర్ అని కౌశల్ తన ఆర్మీని పొగుడుకున్నాడు.
This post was last modified on September 13, 2020 11:40 am
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…